అగ్ని మహా పురాణము

Table of Contents

రుద్రశాంతి వర్ణనము

పరమేశ్వరుడు చెప్పెను:

ఇప్పుడు కల్పా ఘోర శివ శాంతిని చెప్పెదను. అఘోర శివుడు ఏడు కోట్ల గణములకు అధిపతి. బ్రహ్మ హత్యాది పాపములను నశింపచేయును. ఉత్తమాధమ సిద్ధులను ఇచ్చువాడు సమస్త రోగములను తొలగించును. భౌమ దివ్య అంతరిక్ష ఉత్పాతములను మర్దించును. విషగ్రహ పిశాచములను కూడ మ్రింగివేసి సకల కామములను పూరించును. పాప పీడలను తొలగించుటకు దుర్భాగ్య దుఃఖ వినాశకమగు ప్రబల ప్రాయశ్చిత్తరూపుడు. ఏకవీరమును సర్వాంగ న్యాసము చేసి సర్వదా పంచముఖ ధ్యానము చేయవలెను. శాంతిక పౌష్టికములందు శివుడు శుక్లవర్ణుడు, వశీకరణమున రక్త వర్ణుడు, స్తంభన కర్మయందు పీతవర్ణుడు, ఉచ్చాటన మారణ కర్మలందు ధూమ్రవర్ణుడు, ఆకర్షణమున కృష్ణ వర్ణుడు, మోహన కర్మయందు కపిల వర్ణుడు, ముప్పది రెండు అక్షరములు వేదోక్తములగు అఘోర శివుని రూపము ఇది. అందుచే అట్టి అఘోర శివుని పూజించ వలెను. ఈ మంత్రమును ముప్పది లక్షల జపముచేసి గుగ్గులు మిశ్రఘృతముతో దశాంశ హోమము చేసినచో, సాధకుడు మంత్ర సిద్ధి పొంది సిద్ధార్థుడగును. అతడన్నియు సాధించగలడు. అఘోర మంత్రమును మించి భుక్తిముక్తిప్రదమగు మరియొక మంత్రము లేదు. దీనిని జపించుటచే అబ్రహ్మ చారి బ్రహ్మచారి అగును. అస్నాతకుడు స్నాతకుడు అగును. ఆ ఘోరాస్త్రము అఘోర మంత్రము. ఈ రెండును మంత్రరాజములు. ఏ ఒక్కదానినైనను జపహోమార్చనములందు వినియోగించినచో, యుద్ధమునందు శత్రు సైన్యమును నశింప చేయవచ్చును.

ఇపుడు సర్వార్థ సాధకమగు మంగళకరమైన రుద్ర శాంతిని చెప్పెదను. పుత్ర ప్రాప్తి గ్రహ బాధా నివారణ, విష వ్యాధుల వినాశము, దుర్భిక్ష మహామారి, శాంతి దుస్స్వప్న నివారణము, బల రాజ్యాది ప్రాప్తి రిపువినాశనము, వీటిని సాధించుటకు రుద్ర శాంతిని ప్రయోగించవలెను. వృక్షము అకాలమున ఫలించినను సమస్త గ్రహబాధలను తొలగించుటకును కూడ దీనిని ప్రయోగించవలెను. పూజనమునందు మంత్రాంతమున నమః చేర్చవలెను. హోమమునందు ‘స్వాహా’ చేర్చ వలెను. తృప్తియందు ‘వషట్’ పుష్టికరము యందు ‘వౌషట్’ చేర్చవలెను. మంత్రమునందు రెండు చోట్ల ‘చ’ వున్నచోట ఆవశ్యకతాను సారముగ ‘నమః’ స్వాహా మొదలు జాతి యోగములు చేయవలెను. “ఓం రుద్రాయ” మొదలు “అవికృత రూపాయ” వరకును మూలోక్తము రుద్ర శాంతి మంత్రము. ఉత్తరపర్తి కమలదళమున నియతితత్త్వము. పశ్చిమ కమల దళమున కాలతత్వము నైఋతి దళమున మాయాతత్వము వుండును. వీటియందు దేవతలను పూజించవలెను. ఏక పింగళాయ, శ్వేత పింగళాయ, కృష్ణ పింగళాయ, మధు పింగళాయ, నమః అని నియతితత్త్వమునందు పూజించవలెను. అనంతాయ, ఆర్ద్రాయ, శుష్కాయ, పయోగణాయ, అని కాలతత్వము నందు కరాళాయ వికరాళాయ అని మాయాతత్వము నందు పూజించవలెను. దక్షిణ దళమునందున్న విద్యాతత్త్వమున “సహస్ర శీర్షాయ” మొదలు “సహస్ర లింగాయ” వరకు చెప్పి పూజించవలెను. అచటనే ఏక జటాయ మొదలు షడ్రుద్రాయ వరకును షడ్విధ రుద్రుల పూజచేయవలెను. ఆగ్నేయ దళమున వున్న ఈ శతత్త్వమున భూతపతయే, పశుపతయే, ఉపమాపతయే, కాలాధిపతయే అని చెప్పి పూజ చేయవలెను. పూర్వ దళమున ఉన్న సదాశివతత్త్వము నందున్న ఆరువురిని “ఉమాయై” మొదలు “విశ్వేశ్వరాయ నమః” వరకును వున్న మంత్రములతో పూజించవలెను. కర్ణికలందు ఉన్న శివతత్త్వముపై ఉమామహేశ్వరుని ‘ఓం వ్యోమ వ్యాపినే’ మొదలు శివాయ వరకును వున్న మూలోక్త మంత్రముతో పూజించవలెను. శివతత్త్వమున వ్యోమ వ్యాపియను పేరుగల శివుని నవ పదముల పూజచేయవలెను. పిదప యోగ పీఠముపై ఉన్న శివుని నవపద యుక్త నామములు చెప్పుచు పూజించవలెను. “శాశ్వతాయ” మొదలు పంచవక్త్రాయ వరకును ఉన్న మూలోక్తము మంత్రము. పిదప ‘సత్’ అను పేరుగల శివుని నవపదముల పూజచేయవలెను. పిదప యోగపీఠముపై నున్న శివుని నవపదయుక్త నామములు చెప్పుచు పూజించవలెను. “శాశ్వతాయ” మొదలు పంచ వక్త్రాయ వరకుసు ఉన్న మూలోక్తము మంత్రము. పిదప ‘సత్’ అను పేరుగల పూర్వ దళము నందు “అఘోర హృదయాయ” మొదలు “జోతీ రూపాయ” వరకును మూలోక్త మంత్రముతో శివుని పూజించవలెను. ఆగ్నేయమునందున్న కాలతత్త్వము నందును, దక్షిణము నందున్న విద్యాతత్త్వము నందును “పరమేశ్వరాయ” మొదలు “తేజ” వరకును ఉన్న మూలోక్త మంత్రముతో పరమేశ్వరుని పూజించవలెను. నైఋతి అందున్న కాలతత్వము నందును పశ్చిమ దిక్కునందున్న కాలతత్వము నందును “ఓం ధ్రు ధ్రు” మొదలు “సుఖప్రద” వరకును వున్న మూలోక్త మంత్రముతో పూజించవలెను. వాయవ్య, ఉత్తర దళములందున్న నియతి పురుషులను “సర్వసాన్ని ధ్యకర” మొదలు “నమోన్నమః” వరకును ఉన్న మూలోక్త మంత్రముతో పూజ చేయవలెను. ఈశాన్యమునందున ప్రాకృత తత్త్వమునందు కూడ జపహోమములు చేయవలెను. ఈ రుద్ర శాంతి గ్రహబాధను, రోగాది త్రివిధ పీడలను నశింపచేయును. (324)