భవిష్య పురాణము

70 - ఆవాల సప్తమీవ్రత ఉద్యాపన

యాజ్ఞవల్క్యునికి బ్రహ్మదేవుడు చెప్తున్న అంశమిది. సిద్ధార్థ సప్తమి వ్రతా నంతరం మరుసటి రోజు స్నాన, పూజన, జపాదులు తరువాత భోజకుడు, పురాణవేత్త, వేదపారంగతుడు అనువారలకు భోజనాలు పెట్టించి ఎర్రటి వస్త్రాలు, పాలిస్తున్న ఆవు, మరియు వారుమేచ్చు భోజనపదార్థాలు అన్నీ మధ్యాహ్నకాలంలో దానం చెయ్యాలి. ఈ చివరిదానం భోజకునికివ్వాలి. ఆయన దొరకకపోతే పౌరాణికునికి ఆయనా దొరక్కపోతే సామవేదం తెలిసిన మంత్ర విదుడైన బ్రాహ్మణుని కివ్వాలి. ఇది సిద్ధార్థ సప్తముద్యాపనము.