అగ్ని మహా పురాణము

305 - పంచాశద్విష్ణునామాని

 అగ్ని రువాచః-

జపన్వై పంచపంచాశ ద్విష్ణు నామాని యోనరః

 మంత్రజప్యాది ఫలభాక్ తీర్దేష్వర్చాది చాక్షయమ్.

పుష్కరే పుండరీకాక్షం గయాయాం చ గదాధరమ్

రాఘవం చిత్రకూటే తుప్రభాసే దైత్య సూదనమ్.

జయం జయన్త్యాం తద్వచ్చ జయన్తం హస్తినాపురే

వారాహం వర్ధమానేచ కాశ్మీరే చక్రపాణినమ్.

జనార్ధనం చ కుబ్జామ్రే మధురాయాంచ కేశవమ్

కుబ్జామ్ర కే హృషీ కేశం గంగాద్వారే జటాధరమ్.

శాలగ్రామే మహాయోగం హరిం గోవర్ధనాచలే

పిండార కే చతుర్బాహుం శంఖోద్దారేచ శంఖినమ్.

వామనం చ కురు క్షేత్రే యమునాయాం త్రివిక్రమమ్

విశ్వేశ్వరం తథా శోణే కపిలం పూర్వసాగరే.

విష్ణుం మహోదధౌ విద్యాద్ధంగా సాగర సంగమే

కిష్కింధాయాం వనమాలం దేవం రై వతకం విదుః.

కాశీతటే మహయోగం విరజాయాం రిపుంజయమ్

విశాఖయూ పే హ్యజితం నేపాలే లోక భావనమ్.

ద్వార కాయాం విద్ధి కృష్ణ మంద రే మధుసూదనమ్

లో కాకులే రేపుహరం శాలగ్రామే హరింస్మరేత్.

పురుషం పురుష వటే విమలేచ జగత్ర్పభుమ్

ఆనన్తం సైంధ వారణ్యే దండ కే శార్జ్గధారిణమ్.

ఉత్పలా వర్త కే శౌరిం నర్మదాయాం శ్రియః పతిమ్

దామోదరం రైవత కే నందాయాం జలశాయినమ్.

గోపీశ్వరం చ సిన్ద్వబ్ధౌ మహేన్ద్రే చాచ్యుతం విదుః

సహ్యాద్రౌ దేవదేవేశం వైకుంఠం మాగధే వనే.

సర్వపాపహరం వింద్య ఔఢ్రేతు పురుషోత్తమమ్

ఆత్మానం హృదయే విద్దిజపతాం భుక్రిము క్తిదమ్.

వటవటే వైశ్రవణం చత్వ రే చత్వరే శివమ్

పర్వతే పర్వతే రామం సర్వత్ర మధుసూదనమ్.

నరం భూమౌతథా వ్యోమ్ని వసిష్ఠే గరుడధ్వజమ్

వాసుదేవం చ సర్వత్ర సంస్మరన్భు క్తిము క్తిభాక్.

నామాన్యేతాని విష్ణోశ్చ జప్త్వాసర్వ మవాప్నుయాత్

క్షేత్రే ష్వేతేషు యః శ్రాద్ధందానం జప్యంచతర్పణమ్.

తత్సర్వం కోటిగుణితం మృతో బ్రహ్మమయోభవేత్

యః పఠేచ్ఛృణు యాదాపి నిర్మలః స్వర్గ మాప్నుయాత్ .

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే పంచపంచాశ ద్వీష్ణునామక థనం నామ పంచాధిక త్రిశ తతమోఽధ్యాయః.

ఆగ్ని దేవుడు పలికెను. శ్రీ మహావిష్ణువు యొక్క యేబదిఐను నామములు ఎవడు జపించునో అతడు మంత్ర జపాది ఫలమును తీర్థ పూజనాదుల అక్షయ పుణ్యమును పొందును. పుష్కరము పుండరీకాక్షుని గయయందు గదా ధరుని, చిత్రకూటము నందు రాఘవుని. ప్రభాసమునందు దైత్య సూదనుని, జయంతియందు జముని, హస్తి నాపుర సన జయంతుని, వర్ధమానమున వారాహుని, కాశ్మీరమున చక్రపాణిని కబ్జామ్రమున జనార్దనుని మధుర యందు కేశవుని కుఱ్ఱమకమున హృషీ కేశుని గంగాద్వారమున జటాధరుని, శాలగ్రామమున మహాయోగుని గోవర్ధనాచలమున వారిని పిండారకమున చర్బాహువును శంఖోద్ధారము నందు శంఖిని, కురు క్షేత్రమున పామమని, యుమున యందు త్రివిక్ర ముని, శోణమున విశ్వేశ్వరుని పూర్వసాగర మన కపిలుని మహోదధి యందు విష్ణువును గంగా సాగర సంగమ మున వనమాలుని, కిష్కింధయందు రైవతకుని, కాశీ తటమున మహాయోగుని వీర జయందు రిపుంజయుని, విశాఖ యూపమున అజితుని నేపాలమున లోక భావనుని, ద్వారకలో కృష్ణుని మందరమున మధుసూదనుని, లోకాకుల మున రిపుహరుని, శాలగ్రామమున హరిని స్మరించవలెను. పురుషవటమున పురుషుని విమలమున జగత్ర్పడు పును సైధవారణ్యమున ఆనంతుని, దండక యందు శార్జధారిని ఉత్పలా వర్తకమున శౌరినీ నర్మద యదు శ్రీపతిని రైవతకమున దామోదరుని నంద యందు జలశాయిని, సింధు సముద్రమున గోపీశ్వరుని మహేంద్ర తీర్థమున అచ్యుతుని, సహ్యాద్రి పై దేవ దేవేశుని మాగధ వనమున వైకుంఠుని వింధ్యము పై సర్వపాప హరిని ఓడ్ర దేశమున పురుషోత్తపని హృదయమున ఆత్మను స్మరించవలెను. ఈ ఆత్మ జపించు వారికి భుక్తి ముక్తులను ఇచ్చును. ప్రతి వటము నందు వైశ్రవణుని, ప్రతి చత్వరము నందు శివుని, ప్రతి పర్వతము నందు రాముని సర్వత్ర మధుసూదనుని భూమ్యాకాశము లందు సరుని వశిష్ఠ తీర్థమున గరుడ ధ్వజుని సర్వత్ర వాసుదేవుని స్మరించువాడు భుక్తి ముక్తులను పొందును. ఈ విష్ణు నామమును జపించువాడు సర్వమును పొందును. ఈ క్షేత్రములలో చేసిన శ్రాద్దము, దానము, జపము. తర్పణము అంతయు కోటి గుణిత మచును. అట్లు చేసినవాడు మరణానంతరము బ్రహ్మ మయుడగును. ఇది చదివిన వాడును, విన్న వాడును పాపరహితుడై స్వర్గము పొందును.

ఆగ్ని మహా పురాణమున పంచ పంబా శద్విష్ణు నామ కథన మను మూడు వందల ఐదవ అధ్యాయము సమాప్తము.