అగ్ని మహా పురాణము

48 - అథ చతుర్వింశతిమూర్తి స్తోత్రమ్

శ్రీ భగవానువాచః-

ఓం రూపః కేశవః పద్మశజు చక్రగదాధరః.

నారాయణః శజు పద్మ గదాచక్రీ ప్రదక్షిణమ్.

నతోగదీమాధవోరికజ్జపద్మీ సమామితమ్

చక్ర కౌమోదకీ పద్మ శజీ గోవిన్ద ఊర్జితః.

మోక్షదః శ్రీగదీపద్మీ శజీవిష్ణుశ్చ చక్రధృక్

శజచక్రాబ్దగ దినం మధుసూదన మానమే.

భక్త్యాత్రివిక్రమః, పద్మ గదీ చక్రీచ శజ్యపి

శజ్ఞ చక్రగదా పద్మీ వామనః పాతుమాంసదా.

హయగ్రీవుడు చెప్పెను. బ్రహ్మదేవా ! ఓంకార రూపుడగు కేశవుడు తన హస్తములో (క్రింది కుడి చెయ్యి, పై కుడి చేయ్యి, పై ఎడమ చేయ్యి, క్రింద ఎడమ చేయ్యి ఆనుక్రమమున అని ఒక మతము. పై కుడి చెయ్యి మొదలు క్రింద కుడి చెయ్యి వరకును అని మరొక మతము) పద్మ - శంఖ - చక్ర గదలను ధరించి యుండును. నారాయణుడు అదే వరుసలో శంఖ - పద్మ - గదా - చక్రములను ధరించును. ప్రదక్షిణ పూర్వకముగా ఆ భగవంతుని పాదములకు నమస్కరించుచున్నాను. మాధవుడు గదా - చక్ర - శంఖ, పద్మములను ధరించును. నే నాతనికి నమస్కరించుచున్నాను. - గోవిందుడు చక్ర - గదా - పద్మ - శంఖములను ధరించును. బలశాలియై యుండును. శ్రీ విష్ణువు గదా - పద్మ  శంఖ - చక్రములను ధరించును. ఆతడి మోక్ష ప్రదాత మధుసూదనుడు శంఖ చక్ర - పద్మ -గదలను ధరించును. నేనాతని ఎదుట భక్తితో వంగి నమస్కరించుచున్నాను. త్రివిక్రముడు పద్మ-గదా-చక్ర-శంఖములను ధరించును. వామనుడు శంఖ-చక్ర గదా-పద్మములతో ప్రకాశించుచుండును. ఆతడు సర్వదా నన్ను రక్షించుగాక.

గతిదః శ్రీధరః పద్మీ చక్రీ శార్జీ చ స జ్ఞ్యపి

హృషీ కేశో గదీ చక్రీ పద్మీ శజ్ఖీచ పాతున.

వరదః పద్మనాభస్తు శజ్ఖాబ్జారి గదాధరః

 దామోదరః పద్మశ జ గదాచక్రి నమామితమ్.

తేనేగదీ శబ్ధచక్రి వాసుదేవోల్టభృజ్జగత్

సఙ్కర్షణో గదీ శబ్ధి పద్మీ చక్రీచ పాతువః.  

శ్రీధరుడ కమల శంఖ చక్రధనస్సులమ ధరించి యుండును. ఆతడ అందరికిని సద్గతి ఇచ్చువాడ. హృషీ కేడు గదా-చక్ర-పద్మ-శంఖములను ధరించును. ఆతడు మనల నందరిని రక్షించుగాక. వరదాతయగు పద్మ నాభుడ శంఖపద్మ-చక్ర గదలను ధరించును. దామోదరుడ పద్మ-శంఖ-గదా-చక్రములు ధరించి విరాజిల్లు చుండును. ఆతనికి నమస్కరించుచున్నాను. గదా-శంఖచక్ర-పద్మ ధారియైన వాసుదేవుడు సంపూర్ణ జగమును సృజించెను. గదా- శంఖ పద్మ-చక్రములను ధరించిన సంకర్షణుడు ఒప్ముల నందరిని రక్షించుగాక.

వాదీ చక్రీ శజగదీ ప్రద్యుమ్న పద్మభృత్ ప్రభుః

అనిరుద్దశ్చక్ర గదీ శజీ పద్మీ చ పొతునః.

సురేశో ఒర్యబ్ద శబ్ధాఢ్య శ్రీగదీ పురుషోత్తమః

ఆధోక్షజః పద్మ గదీ శజ్ఖీ చక్రీచ పాతువః.

డేవోనృసింహశ్చ కబ్జ గదీశ జ్ఖీ నమామితమ్

అచ్యుతః శ్రీగదీపద్మీ చక్రీ శ చ పాతువః.

వాలరూపీ శబ్ధగదీ ఉపే శక పద్మ్యపి

జనార్దనః పద్మ చక్రీ శబ్ధధారీ గదాధరః

 యజ్ఞః శజ్ఖీ పద్మ చక్రీ హతి కౌమోదకీధరః

కృష్ణః శజ్ఖీ గదీ పద్మీ చక్రి మే భుక్తి ముక్తితః.

యుద్ధ కుశలుడైన ప్రద్యుమ్నుడ చక్ర-శంఖ-గదా-పద్మ ములను ధరించును. అనిరుద్ధుడు చక్రగదా శంఖపద్మములను అతడు మనలను రక్షించుగాక. సురేశ్వరుడై న పురుషోత్తముడు చక్ర-కమల-శంఖ-గదలను ధరించును. అధోక్షజుడు పద్మగదా-శంఖ చక్రములను ధరించును. ఆతడు మిమ్ములను రక్షించుగాక. నృసింహుడు చక్ర - పద్మ-గదా-శంఖములను ధరించును. నేను ఆతనికి నమస్కరించుచున్నాను. గదా - పద్మ - చక్ర . శంఖములను ధరించు అచ్యుతుడు మిమ్ము లను రక్షించుగాక. శంఖ - గదా - చక్ర - పద్మములను ధరించు, బావటుడైన వామనుడు, పద్మ - చక్ర - శంఖ - గదలను ధరించు జనార్దనుడు, శంఖ - పద్మ - చక్ర - గదలను ధరించు, యజస్వరూపుడైన శ్రీహరి, శంఖ - గదా - పద్మ - చక్రములను ధరించు కృష్ణుడు నాకు భోగ మును, మోక్షమును ప్రసాదించుగాక.

ఆదిమూర్తిర్వాసుదేవ స్తస్మాత్సజర్షణో భవత్

 సజ్కర్షకాచ్చ ప్రద్యుమ్న  ప్రద్యుమ్నాద నిరుద్ధకః.

కేశవాది ప్రభేదేన ఏకైకః స్యా దాక్రమాత్

ద్వాదశాక్షతకం స్తోత్రం చతుర్వింశతి మూర్తిమత్.

యఃపఠేచ్ఛృణుయాద్వాపి నిర్మలః సర్వమాప్నుయాత్

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే చతుర్వింశతిమూర్తి స్తోత్రం నామాష్టచత్వారింశోధ్యాయః.

వాసుదేవుడు ఆదిమూర్తి, వాసుదేవుని నుండి సంకర్షణుడు ఆవిర్భవించెను. సంకర్షణుని నుండి ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్ను ని నుండి ఆరుద్ధడు ఆవిర్భవించెను. వీరిలో ఒక్కరొక్కరు క్రమముగ కేశ వాదీమూర్తి భేదమున మూడేసి రూపములలో ఆవిర్భవించిరి. (అనగా వాసుదేవుని నుండి కేశవ - నారాయణ - మాధవమూర్తులు, సంకర్షణుని నుండి గోవింద - విష్ణు - మధుసూదనమూర్తులు ప్రద్యుమ్నుని నుండి త్రివిక్రమ - వామన - శ్రీధర మూర్తులు, అనిరుద్ధుని నుడి హృషీ కేశ - పద్మనాభ - దామోదరమూర్తులు ఆవిర్భవించినవి), ఇరువది నాలుగు మూర్తుల స్తోత్రముతో కూడిన ఈ ద్వాదశాక్షర స్తోత్రమును చదువువారును, వినువారును నిర్మలులై, సంపూర్ణ మనోరథములను పొందుదురు.

విశేషాంశము : ఈ స్తోత్రములో ఇరువది నాలుగు మూర్తుల స్వరూపముమ వర్ణించు మొదటి పండ్రెండు శ్లోకములలోని మొదటి అక్షరములను కలిపి చదివినచో “ఓం నమో భగవతే వాసుదేవాయ” అను ద్వానజాక్షరి ఏర్పడును అందుచే దానికి ఉద్వాదశాక్షరీ స్తోత్రము”. అనియు, “చతుర్వింశతి మూర్తి స్తోత్రము” అనియు పేర్లు.

అగ్ని శుహాపురాణము నందు చతుర్వింశతిమూర్తి స్తోత్రమను నలుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.