అగ్ని మహా పురాణము

40 - అథార్ఘ్యాదిదానవిధిశల్యకథనే.

భగవానువాచః

పూర్వమాసిన్మహద్భూతం సర్వభూతభయఙ్కరమ్

తద్దేవైర్నిహితం భూమౌ స వాస్తుపురుషః స్మృతః.

చతుష్షష్టిపదే క్షేత్రే ఈశం కోణార్ధసంస్థితమ్

ఘృతాక్షతై స్తర్పయేత్తం పర్జన్యం పదగం తతః.

ఉత్పలాద్భిర్జయన్తం చ ద్విపదస్థం పతాకయా

మహేన్ర్దం చైకకోష్ఠస్థం సర్వరక్తైః పదే రవిమ్.

వితానేనార్ధపదగం సత్యం పాదే భృతం ఘృతైః

వ్యోమశాకునమాం సేన కోణార్ధపదసంస్థితమ్.

స్రుచా చార్ధపదే వహ్నిం పూషణం లాజయైకతః

స్వర్ణేన వితథం ద్విష్ఠం మన్దనేన గృహక్షతమ్.

మాంసోదనేన ధర్మేశమేకైకస్మిన్ స్థితం ద్వయమ్

గన్దర్వం ద్విపదం గన్దైర్భృశం శాకునజిహ్వయా.

ఏకస్థమర్ధసంస్థం చ మృగనీలపటైస్తథా

పితృన్ కృశరయార్ధస్థం దన్తకాష్ఠైః పదస్థితమ్.

దౌవారికం ద్విసంస్థం చ సుగ్రీవం యావకేశ తు

భగవంతుడైన హయగ్రీవుడు చేప్పేమ : ఓ బ్రహ్మదేవా! పూర్వము సమస్తప్రాణులకును భయంకరమైన ఒక మహాభూత ముండెను. దానిని దేవతలు భూమిలో పాతి పెట్టిరి. దానికే వాస్తుపురుషు డని పేరు; ఆరువదినాలుగు పదముల క్షేత్రమునందు ఆర్ధకోణమునందున్న ఈపని ఘృతాక్షతలచే తృప్తిపరుపవలెను. ఒక పదమునం దున్న పర్ణన్యుని కమల-జలములచేతను, రెండు పదములలో ఉన్న జయంతుని పతాక చేతను, రెండు కోషములం దున్న ఇంద్రుని కూడ అదే విధమునను, రెండుపదములలో నున్న సూర్యునిఎఱ్ఱని అన్ని పదార్థములచేతను, రెండు పదములపై నున్న సత్యుని వితానము (చాందనీ) చేతను, ఒక పదము నం దున్న భృతని ఘృతముచేతను, అగ్ని కోణమునందలి ఆర్ధకోణమునం దున్న ఆకాశమును శాకున మను ఓషధి జిగురుచేతను, ఆ కోణమునందే రెండవ ఆర్థపదమునం దున్న అగ్ని దేవుని సుక్కుచేతను, ఒక పదమునం దున్న పూమని లాజలచేతను, రెండ పదములపై నున్న వితథునిస్వర్ణము చేతను, ఒక పదముపై నున్న గృహక్షతుని వెన్న చేతను, ఒక పదముపై నున్న యమధర్మరాజును మాంసాన్న ముచేతను, రెండు పదములపై ఉన్న గంధర్వుని గంధముచేతను, ఒక పదముపై నున్న భృంగుని శాకునజిహ్వ అను ఓషధిచేతను, అర్ధపదముపై ఉన్న మృగమును నీలిబట్టచేతను, ఆర్థకోష్ఠము నిమ్న భాగమునం దున్న పితృగణమును పులగముచేతను, ఒక పదముపై నున్న ద్వారపాలకుని దంతకాష్ఠముచేతను, రెండు పదములపై నున్న సుగ్రీవుని యవలతో చేసిన పదార్థము చేతను తృప్తి పరుపవలెను.

పుష్పదన్తం కుశస్తమ్బైః పద్మైర్వరుణమేకతః.

అసురం సురయా ద్వీష్ఠం పదేశాయ ఘృతామ్బసా

యవైః పాపం పదార్ధస్థం రోగంమధ్యే చ మణ్డకైః.

నాగపుష్పైః పదే నాగం ముఖ్యం భక్ష్యైర్హి సంస్థితమ్

ముద్గోదనేన భల్లాటం పదే సోమం పదే తథా.

మధునా పాయసెనాథ శాలూకేన ఋషింద్వయే

పదే దితింలోపికాభిరర్దే దితిమథాపరమ్.

హరికాభిస్త తశ్చాపమీశాధః పయసా పదే

తతోఽధశ్చాపవత్సన్తు దధ్నా చైకపదే స్థితమ్.

లడ్డుకైశ్చ మరీచిం తు పూర్వకోష్ఠచతుష్టయే

సవిత్రే రక్తపుష్పాణి బ్రహ్మాధఃకోణకోష్ఠకే.

తదధః కోష్ఠకే దద్యాత్సవిత్రే చ కుశోదకమ్

వివస్వతేఽరుణం దద్యాచ్చన్దనం చతురజ్ఘ్రిషు.

రక్షోఽధః కోణకోష్ఠే తు ఇన్ద్రాయార్ఘ్యం నిశాన్వితమ్

ఇన్ద్రం జయాయ తస్యాధో ఘృతార్థం కోణకోష్ఠేకే.

చతుష్పదే చ దాతవ్యమిన్ద్రాయ గుడపాయసమ్

వాయ్వధః కోణదేశే తు రుద్రాయ పక్వమాంసకమ్.

తదధః కోణకోష్ఠే తు యక్షాయార్ధం సలం తథా

మహీధరాయ మాంసాన్నం మాషం చ చతురజ్ఘ్రిషు.

మధ్యే చతుష్పదే స్థాప్యా బ్రహ్మణే తిలతణ్డులాః

చరకీం మాషసర్పర్భ్యాం స్కన్దం కృశరయాసృజా.

రక్తపత్రైర్విదారీం చ కన్దర్పం చ పలోదనైః

పూతనాం పలపిత్తాభ్యాం మాంసాసృగ్భ్యాం చ జమ్భాకమ్.

పిత్తానృగస్థిభిః పాపం పిలిపిఞ్జం స్రజాసృజా

ఈశాద్యాన్రక్తమాంసేన ఆభావాదక్షతైర్యజేత్.

రక్షొమాతృగణేభ్యశ్చ పిశాచాదిభ్య ఏవ చ

పితృభ్యః క్షేత్రపాలేభ్యో బలీన్దద్యాత్ ప్రకామతః.

రెండు పదములపై నున్న పుష్పదంతుని కుశతృణములచేతమ, రెండు పదములపై నున్న వరుణుని పద్మముల చేతను, రెండు పదములపై నున్న ఆసురుని సురచేతను, ఒక వరము పైనున్న ఆది శేషుని నేయి కలిపిన జలముచేతను ఆర్ధపదముపై నున్న పాపమును యవాన్నముచేతను, ఆర్ధపదము పై నున్న రోగమును గంజిచేతను, ఒక పదముపై ఉన్న నాగమును నాగపుష్పము చేతమ, రెండు పదములపై మన్న ముఖ్యుని భక్ష్యపదార్థముల చేతను, ఒక పదము పై నున్న భల్లాటుని పెసల అన్నముచేతమ, ఒక పదము పై ఉన్న సోముని తేనెతో కూడిన పాయసముచేతను, రెండు పదములపై నున్న ఋషిని శాలూకముచేతమ, ఒక పదము పై ఉన్న అదితినీ లోపికచేతను, అర్ధపదము పై నున్న దితిని పూరీలచేతను తృప్తిపరుపవలేమ. ఈశాన్యదిశయం దున్న ఈశునికి క్రింద ఆర్ధపదము పై నున్న ఆపునిపాలచేతమ, క్రింద అర్ధపదముపై నున్న ఆపవత్సుని దధిచేతను తృప్తిపరుపవలెను, తూర్పున నాలుగు కోష్టముల పై నున్న మరీచిని లడ్డూలచే తృప్తి పరుపవలెను. బ్రహ్మకు పై నున్న కోణమందు ఆర్ధ పదముపై ఉన్న సావిత్రునకు రక్తపుష్పములు నివేదించవలెను. దాని క్రింద నున్న ఆర్ధకోణమునం దున్న సవితకు కశోదకము లియవలెను. నాలుగు పదముల పై ఉన్న వివస్వంతునకు రక్తచందనమును, నైరృతీదిక్కున నున్న కోణమునందలి ఆర్ధకోష్ఠమునం దున్న సురాధిపతి యైన ఇంద్రునకు పసుపునీళ్ళతో అర్ఘ్యమును ఇవ్వవలెను. దాని అర్ధభాగమునందే కోణమునందలి కోష్టమునం దున్న ఇంద్రజయునకు నెయ్యి అర్ఘ్యముగా ఇవ్వవలెను. చతుష్పదమునందలి మిత్రునకు గుణయుక్త మగు పాయసము సమర్పింపవలేను. వాయవ్య కోణమున అర్ద కోష్ఠముపై నున్న రుద్రునకు పక్వమాంసమును ఇవ్వవలెను, దాని క్రింద ఆర్దకోష్టమునం దున్న యమునకు (రుద్రదాసునకు) (ద్రాక్షమొదలగు) ఆర్ద్రఫలము లివ్వవలేను. చతుష్పదమునం దున్న పర్వతమునకు మాంసాన్నమును, మాషమును బలి ఇవ్వవలెను. మధ్యలో నున్న నాలుగు కోష్ట్రములందును బ్రహ్మకొరకై తిలతండులము లుంచవలెను. చరకిని మాంసమృతములచేతను, కుమారస్వామిని పులగముచేతను, రక్తముచేతను, విదారీని రక్త కమలములచేతను, కందర్పుని ఒక ఫలము ఆన్నముచేతను, పూతనను ఫలపిత్తములచేతను, జంభకుని మాంసర క్తములచేతను, పాపర క్షసుని పిత్త-రక్త-ఆస్థులచేతను, పిలిపిత్సుని మాలికలచేతను, రక్తము చేతను తృప్తిపరుపవలేను. పిదప ఈశానాది దిక్పాలకులకు రక్తమాంసమును, సమర్పింపవలేను. ఆయా వస్తువులు లభింపనపుడు ఆక్షతలు సమర్పింపవలేను. రాక్షస-మాతృకా-గణ-పిశాచ-పితృ-క్షేత్రపాలాదులకుగూడ ఇచ్ఛానుసారముగా బలిప్రదానము చేయవలెను.

అహుత్వైతాన సంతర్ప్య ప్రాసాద్దీన్న కారయేత్

బ్రహ్మస్థానే హరిం లక్ష్మీం గణం పశ్చాత్సమర్పయేత్.

మహేశ్వరం వాస్తుమయం వర్ధన్యాసహితం ఘటమ్

బ్రహ్మాణం మధ్యతః కుమ్భే బ్రహ్మాదీంశ్చదిగీశ్వరాన్.

దద్యాత్పూర్ణాహుతిం పశ్చాత్స్వస్తి వాచ్యప్రణమ్య చ

ప్రగృహ్యకర్కరీం సమ్యజ్మఙ్గలం తు ప్రదక్షిణమ్.

సూత్రమార్గేణ హే బ్రహ్మం స్తోయధారాంచ భ్రమయేత్

పూర్వవత్తేన మార్గేణ సప్తమీజాని వాపయేత్.

ప్రారమ్భం తేనమార్గేణ తస్యఖాతస్య కారయేత్

తతోగర్తం ఖనే న్మధ్యే హస్తమాత్రప్రమాణతః.

చతురఙ్గులకంచాధశ్చోపలిప్యార్చయేత్తతః

ధ్యాత్వాచతుర్భుజం విష్ణమర్ఘ్యం దద్యాత్తు కుమ్భతః.

కర్కర్యాపూరయే చ్ఛ్వభ్రం శుక్లపుష్పాణిచన్యసేత్

దక్షిణావర్తకం శ్రేష్ఠం బీజైర్మృద్భిశ్చపూరయేత్.

అర్ఘ్యదానం వినిష్పాద్య గోవస్త్రాదీన్ దదేద్గురౌ

కాలజ్ఞాయ స్థపతయే వైష్ణవాదిభ్య అర్చయేత్.

తతస్తు ఖానయేద్యత్నాజ్ఞలాన్తం యావదేవతు

పురుషాధః స్థితం శల్యం న గృహేదోషదం భవేత్.

అస్థిశల్యేభిద్యతేవై భిత్తిర్వై గృహిణోఽసురామ్

యన్నామశబ్దం శృణుయాత్తత్ర శల్యం తదుద్భవమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే అర్ఘ్యదానశల్యయోః కథనం నామ చత్వారింశోఽధ్యాయః.

వాస్తు హోమ బలిప్రదానాదులచే ఈ దేవతలకు తృప్తి కలిగించకుండ ప్రొసాదాదినిర్మాణము చేయరాదు. బ్రహ్మస్థానమున శ్రీహరి-లక్ష్మీ-గణదేవతలను పూజింపతలెను. పిమ్మట భూమిని, వాస్తుపురుషుని, వర్ధనీ (మూకుడు) యుక్తకలశములను పూజింపవలెను. కలశమధ్యమున బ్రహ్మను దిక్పాలకులను పూజింపవలెను. స్వస్తివాచనముచేసి, ప్రణమించి, పూర్ణాహుతి చేయవలెను. ఓ బ్రహ్మదేవా! పిమ్మట గృహస్వామి రంధ్రములుగల ఒక జలపాత్రహ స్తమున ధరించి విధిపూర్వకముగా దక్షిణావర్తమండలములు చేయుచు సూత్రమార్గమున జలధారను త్రిప్పవలెను. పిమ్మట వెనుకటి వలే అదే మార్గమున ఏడు బీజములు నాటవలెను. ఆదే మార్గమున గొయ్యి తవ్వుట ప్రారంభింపవలెను. పిమ్మట మధ్య యందు ఒక హస్తము వెడల్పు నాలుగు అంగుళములు లోతుగల గొయ్యి తవ్వవలెను. దానిని అలికి పూజాప్రాంభము చేయవలెను. అన్నింటికంటును ముందుగ వాలుగుభుజములు ధరించిన శ్రీ మహావిష్ణువును ధ్యానించి కలశ తో ఆర్య ప్రదానము చేయవలెను, పిదప జారీతో నీళ్లుపోసి ఆ గొయ్యినింపి దానిలో తెల్లని పుష్పములు వేయవలెను. శ్రేష్టమైన ఆదక్షిణావర్తగర్తమును విత్తనములతోడను, మట్టితోడను నింపవలెను. ఈ విధముగ అర్ఘ్యప్రదానకార్యము ముగించి, ఆచార్యునకు గోవస్తాదిదానము లీయవలెను. జ్యోతిష్కుని, స్థపతినిగూడ యథోచితముగ సత్కరించి విష్ణుభక్తులను, సూర్యుని పూజింపవలెను. పిమ్మట భూమిని ప్రయత్నపూర్వకముగ, నీరువచ్చునంతవరకును తవ్వవలెను. మనిషిలోతు క్రింద శల్యములున్నను గృహమునకు దోషములేదు. శల్యములున్న చో ఇంటి గోడ విరిగిపోవును. గృహపతికి సుఖము ఉండదు. తవ్వుచున్నపుడు ఏ జంతువు పేరు వినబడునో ఆ జంతువు శల్యమే ఆక్కడ నుండునని తెలియవలెమ.

ఆగ్నేయమహాపురాణమునందు అర్ఘ్యదాన-శల్యముల కథనమను నలువదవ అధ్యాయము సమాప్తము.