అగ్ని మహా పురాణము

15 - అథ పాణ్డవ చరిత వర్ణనమ్.

అగ్నిరువాచః

యుధిష్ఠిరే తు రాజ్యస్థే ఆశ్రమాదాశ్రమా న్తరమ్

ధృతరాష్ట్రా వనమగాద్గాన్గారీ చ వృథా ద్విజ.

అగ్ని వలికెను : ఓ ద్విజుడా  యుధిష్టురుడు రాజ్యము చేయుచుండగా ధృతరాష్ట్రుడును, గాంధారియు, కుంతియు, ఆరణ్యమునకు వెళ్ళి ఒక ఆశ్రమమునుండి మరి యొక ఆశ్రమమునకు సంచరించుచుండిరి.

విదుర స్వగ్ని నా దగ్ధో వనజేన దివం గతః

ఏవం విష్ణుర్భువో భారమహరద్దానవాదికమ్.

ధర్మాయాధర్మనాశాయ నిమిత్రీకృత్య పాణ్డవాన్

స విప్రశాపవ్యాజేన ముసలేనాహనత్కులమ్.

యాదవానాం భారకరమ్-

విదురుడు దావాగ్నిచే దగ్దుడై మృతి చెందెను. ఈ విధముగ మహావిష్ణువు పాండవులను నిమి త్తముగ చేసి కొని, ధర్మరక్షణముకొరకును, అధర్మవినాశ మునకును పూనుకొని దానవాదిక మగు భూభారమును హరించెను. విప్రశావ మను వంకచే, ముసలముచే, భూధారకర మగు యాదవకులమున నశింపచే నెను.

వజ్రం రాజ్యేఽభిషేచయత్

దేవాదేశాత్రధా సే స దేహం త్యక్త్వా స్వయం హరిః.

ఇంద్రలో కే బ్రహ్మలోకే పూజ్యతే స్వర్గవాసీభిః

బలభద్రోన నమూర్తిః పాతాల స్వర్గమీయివాన్.

శ్రీ కృష్ణుడు వజ్రుని రాజ్యాభిషిక్తుని చేసి దేవతల ఆదేశముచే, ప్రభాసషేత్రమునందు తన దేహమును పరిత్య జించి, ఇంద్రలోక బ్రహ్మలోక ములందు స్వర్గ వాసులచే పూజింపబడెను. బలరాముడు, ఆది శేష రూపధారి యై పాతాళ స్వర్గము చేరెను.

అవినాశీ హరిర్దేవో ధ్యానిభిర్ద్యేయ ఏవ సః

వినా తం ద్వారకాస్థానం ప్లావయామాస సాగరః.

వినాశరహితు డగు ఆ శ్రీ హరి యోగులచే ధ్యానింపబడు వాడు. ఆట్టి శ్రీ కృష్ణుడు లేని ద్వారకను సముద్రము ముంచివే నెను.

సంస్కృత్య యాదవాన్ పార్థో దత్తాదకధనాదికః

స్త్రియోష్టావక్రతా పేన భార్యా విష్ణోశ్చ యాః స్థితాః.

పున స్తచ్చావతో నీతా గోపాలైర్లగుడాయుధై 

అర్జునం హి తిరస్కృత్య పార్టః శోకం చకార హ.

వ్యా నేనాశ్వాసితో మేనే బలిం మే కృష్ణసన్నిధౌ

హస్తినాపురమాగత్య పార్థః సర్వం న్యవేదయత్.

యుధిష్ఠిరాయ స భ్రాత్రే పాలకాయ నృణాం తదా

అర్జునుడు యాదవులకు పేత సంస్కారాదులు చేసి ఉదక ధనాదిదానములు చేసెను. ఆష్టావక్రుని శాపముచే విమభార్వలుగా అయిన స్త్రీలను, మరల ఆతని బావము చేతనే, కఱ్ఱలు ఆయుధములుగా గల గోపాలకులు అర్జునుని ఓడించి తీసికొని పోయిరి. అర్జునుడు బాల శోకించెను. వ్యాసుడాతనిని ఊరడించెను. . కృష్ణుడున్న ప్పుడే నా బలము అని అతడు గ్రహించెను. అతడు హస్తినాపురమునకు వచ్చి, రాజ్యపాలకు డైన యుధిష్ఠిరునకు ఇది యంతయు చెప్పెను.

తద్దనుస్తాని చాస్త్రాణి స రథస్తే చ వాజినః.

వినా కృష్ణన తన్నష్టం దానం చాశ్రోత్రియే యథా

కృష్ణుడు ఈ లోకమును విడచి వెళ్ళిపోయిన తోడనే ఆర్జునుని అదే ధనస్సు, అవే అస్త్రములు, అదే రథము, అవే గుఱ్ఱములు, అవన్ని యు శ్రోత్రియుడు కాని వానికి ఇచ్చిన దానము వలె నష్ట మైపోయెను.

తచ్ఛ్రుత్వా ధర్మరాజస్తు రాజ్యే స్థావ్య పరీక్షితమ్.

ప్రస్థానం ప్రస్థితో ధీమాన్ ద్రౌపద్య భ్రాతృభిః

సహ సంసారానిత్యతాం జ్ఞాత్వా జవన్నష్టశతం హరేః

ధర్మరాజు ఆ వార్త విని, పరీక్షిత్తును రాజ్యపాలనకై నియోగించి, ఈ సంసార మనిత్య మను విషయము గ్రహించినవాడై, ద్రౌపదియు, సోదరులును వెంట రాగా, మహావిష్ణుని అష్టోత్తరశతనామములు జపించుచు మహా ప్రస్థాన మున బయలుదేరెను.

మహాపథే తు పలితా ద్రౌపదీ సహదేవకః

నకులః ఫల్గునో భీమో రాజా శోకవరాయణః.

ఇంద్రానీతరథారూఢః సానుజః స్వర్గమా ప్తవాన్

దృష్ట్వా దుర్యోధనాదీంశ్చ వాసుదేవం చ హర్షితః.

ఏత త్తే భారతం ప్రోక్తం యః పఠేత్స దివం. వ్రజేత్ .

ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే మహాభారతాఖ్యానం నామ పఞ్చదశోధ్యాయః.

ఆ మహాప్రస్థానమునందు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడును వడిపోయిరి. రాజు తాతురు డయ్యెను. ఆతడు ఇంద్రుడు తీసికొని వచ్చిన రథము నధిరోహించి, సోదర సహితుడై స్వర్గము చేరెను. అచట దుర్యోధ నాదులను, వాసు దేవుని చూచి సంతసించెను. నీ కి భారతకథను చెప్పితిని. దీనిని పఠించినవారు స్వర్గమునకు వెళ్లెదరు.

ఆగ్ని మహాపురాణములో మహాభారతాఖ్యానమను పంచదశాధ్యాయము సమాప్తము.