అగ్ని మహా పురాణము

8 - అథ కిష్కిందాకాణ్డ వర్ణనమ్

నారద ఉవాచః -

రామః వప్పూసరో గత్వాశోచత్స శబరీం తతః

 హనూమతాథ సుగ్రీవం నీతో మిత్రం చకార హ.

కిష్కిందాకాణ్డవర్ణనము. నారదుడు పలికెను. రాముడు పంపాసరస్సు చేరి దుఃఖించెను. పిమ్మట శబరివద్దకు వెళ్లాను. పిమ్మట హనుమంతుడు సుగ్రీవుని వద్దకు తీసికొనిపోగా ఆతనిని తన మిత్రునిగ చేసికొనెను.

 నవ తాళాన్వినిర్భిద్య శ రేణై కేన వశ్యతః

 పాదేన దున్దుభేః కాయం చిక్షేవ దశయోజనమ్.

సుగ్రీవుడు చూచుచుండగా ఒక బాణము చేత ఏడు తాళవృక్షములను భేదించి, దుందుభి శరీరమును పది యోజ నముల దూరము విసరెను.

 తద్రిపుం వాలినం హత్వా భ్రాతరం వై రకారిణమ్

కిష్కిందాం కపిరాజ్యం చ రుమాం తారాం సమర్పయత్.

 ఋశ్యమూకే హరీశాయ కిష్కిన్డేశోఽబ్రవీత్స చ

 సీతాం త్వం ప్రాప్స్య సే యద్వత్తథా రామ కరోమి తే

ఆతని సోదరుడును, వై రము చేయుటచే శత్రువును అగు వాలిని చంపి అక్యమూక ముపై ఉన్న ఆతనికి కిష్కింధను, వానర రాజ్యమును, రుమను, తారను ఇచ్చెను. సుగ్రీవుడు ఇట్లు పలికెను. “రామా! నీకు సీత లభించు నట్లు చేసెదను,

తచ్ఛ్రుత్వా మాల్యవత్ వృష్ఠే చాతుర్మాస్యం చకార సః

 కిష్కిన్టాయాం చ సుగ్రీవో యదా నాయాతి దర్శనమ్

  తదాబ్రవీత్తం రామోక్తం లక్ష్మణో వ్రజ రాఘవమ్

న స సజు చితకి వస్ధ యేన వాలీ హతో గతః.

సమయే తిష్ట సుగ్రీవ మా వాలిపథమన్వగా.

రాముడు ఆ మాటలు విని మాల్యవత్పర్వతము పై వర్షాకాలము నాలుగు మానములును గడ పెను. కిష్కింధలో ఉన్న సుగ్రీవుడు మరల కనబడక పోగా లక్ష్మణుడు రాముడు చెప్పిన విధమున ఆతనితో ఇట్లు చెప్పెను. “నీవు రాముని దగ్గరకు వెళ్లుము. వాలి రామునిచే నిహతుడై వెళ్లిన మార్గము ఇంకను మూసివేయబడలేదు. సుగ్రీవా! మాటమీద నిలబ డుము. వారి మార్గమును అనుసరించకుము”.

 సుగ్రీవ ఆహ సంసక్తి గతం కాలం న బుద్ధవాన్

 ఇత్యుక్త్వా స గతో రామం నత్వోవాచ హరీశ్వరః.

వానరాధిపతి యైన సుగ్రీవుడు “కార్యాసక్తుడనైన నేను.గడచిన కాలమును గుర్తించ జాలకపోతిని” అని పలికి రాముని వద్దకు వెళ్లి నమస్కరించి ఇట్లు పలికెను.

సుగ్రీవ ఉవాచః-

 ఆనీతా వానరాః సర్వే సీతాయాశ్చ గవేషణే,

త్వన్మతాత్ర్పేషయిష్యామి విచిన్వన్తు చ జానకీమ్

పూర్వాదౌ మాసమాయాను మాసాదూర్థ్వం నిహన్ని తాన్.

సుగ్రీవుడు పలికెను: వానరులనందరిని పిలిపించితిని, నీ అభిలాష ప్రకారము వారిని సీతాన్వేషణము నిమి తమై వంపగలను. వారు తూర్పుదిక్కు మొదలైన ట్రిక్కులందు సీతను. మానములోపున ఆన్వేషించవలెను. మాసము దాటి నచో వారిని చం పెదను.

ఇత్యుక్తా వానరా పూర్వవశ్చిమోత్తరమార్గ గాః

 జగ్మూ రామం ససుగ్రీవమవక్య స్తస్తు జానకీమ్.

ఈ విధముగా ఆజ్ఞాపింపబడిన వానరులు తూర్పు-పశ్చిమము, ఉత్తరము వైపు వెళ్లి అచట సీతను గానక రామ సుగ్రీవుల వద్దకు తిరిగి వచ్చిరి.

రామాజ్గులీయం సజ్గృహ్య హనుమాన్ వానరై  సహ

దక్షిణే మార్గయామాస సుప్రభాయా గుహంతి కే.

హనుమంతుడు రాముని అంగుళీయకమును తీసికొని, వానర సమేతుడై దక్షిణ దిక్కునందు సుప్రభ గుహ నమీవమున అన్వేషించెను.

మాసాదూర్ధ్వం చ విన్జ్యస్థా ఆవశ్య న్తస్తు జానకీమ్

 ఊచుర్వృథా మరిష్యామో జటాయుర్ధన్య ఏవ సః.

 సీతార్థే యోఒత్యజత్ప్రాణాన్ రావణేన హతో రణే

మాసము దాటిన తరవాత కూడ వింధ్యపర్వతమునందు ఉండి సీతను చూడజాలని ఆ వానరులు. ఇట్లు అనుకొనిరి. “మన మందరము వ్యర్థముగా మరణించనున్నాము. యుద్ధమునందు రావణునిచే చంపబడి, సీత నిమిత్తమై ప్రాణములు విడచిన ఆ జటాయువు ధన్యుడు కదా?”

 తచ్ఛ్రుత్వా ప్రాహ సమ్పాతిర్విహాయ కపిభక్షణమ్.

భ్రాతాసౌ మే జటాయుర్వై మయోడ్డీనోరమణ్డలమ్

ఆర్కతాపాద్రడితో గాద్దగ్ధపక్షోఽహమభ్రగః.

రామవార్తాశ్రవాత్పషో జాతా భూయోథ జానకీమ్

ప్యూమ్యశోకవనికాగతాం లఙ్కాగతాం కిల.

 శతయోజనవి సీర్ణే లవణాజ్ఞా త్రికూట కే

జ్ఞాత్వా రామం నసుగ్రీవం వానరా కథయను వై. 

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే రామాయణే కిష్కిన్దాకాణ్డ వర్ణనం నామాష్టమోఽధ్యాయః.

ఆ మాటలు విని నంపాతి వానరులను భక్షించుట మాని ఇట్లు పలికెను. ఆ జటాయువు నాసోదరుడు. నాతో కలిసి సూర్య మండలము వైపు ఎగిరెను. ఆతనిని నేను సూర్యుని వేడిమినుండి రక్షించగా భూమి పై పడెను. ఆకాశము పై నున్న నా రెక్కలు కాలిపోయినవి. రాముని కథ వినుటచే నా రెక్కలు మరల మొలచినవి. ఓ వానరులారా! శత యోజనవిస్తీర్ణమైన లవణ నముద్రమున, త్రికూటవర్వతము పై నున్న లంకాపట్టణమునందు ఆశోకవనములో ఉన్న జానకి నాకు కనబడుచున్నది. ఈ విషయము తెలిసికొని రామసుగ్రీవులకు తెలుపుడు.

అగ్ని మహాపురాణమునందు రామాయణ కథలో కిష్కిన్ధాకాండ వర్ణనమను అష్టమాధ్యాయము సమాప్తము.