అగ్ని మహా పురాణము

265 - అథ దిక్పాలాది స్నానమ్

ఆగ్నిరువాచః

సర్వార్థ సాధనం స్నానం వక్ష్యేశాంతికరం శృణు

స్నాపయేచ్చ సరిత్తీరే గృహాన్విష్ణుం విచక్షణః.

దేవాలయే జ్వరార్త్యాదౌ వినాయక గ్రహార్దితే

విద్యార్థినో హ్రదేగేహే జయకామన్య తీర్ధకే.

పద్మిన్యాం స్నాపయేన్నారీం గర్భోయస్యాః స్రవేత్తథా

ఆశోక సన్నిధౌ స్నాయాజ్ఞాతో యస్యావినశ్యతి.

పుష్పార్థినాంచ పుష్పాడ్యే పుత్రార్థినాంచ సాగరే

గృహసౌభాగ్య కామానాం సర్వేషాం విష్ణుసన్నిధౌ.

వైష్ణవే రేవతీ పుష్యే సర్వేషాం స్నానముత్తమమ్

స్నాన కామస్య సప్తాహం పూర్వముత్పాదనం స్మృతమ్.

పునర్నవాం రోచనాం చ శీతాంగం గురుణీత్వచమ్

మధూకం రజనీద్వేచ తగరం నాగకేసరమ్.

అంబరీం చైవ మంజిష్ణాం మాంసీయాసకకర్దమైః

ప్రియంగు సర్షపం కుష్ఠం బలాం బ్రాహ్మించ కుంకుమమ్.

పంచగవ్యం సక్తుమిశ్రం ఉద్వర్త్య స్నానమాచరేత్

ఆగ్ని దేవుడు పలికెను. పరశురామ ఇపుడు సకల కార్యసిద్ధిని ఇచ్చు కాంతికర మగు స్నానమును గూర్చి చెప్పేదను వినుమా. గృహములకు, శ్రీమహావిష్ణువునకు నదీతీరమున స్నానము చేయించవలెను. జ్వరపీడాదులు కలుగు నపుడు, విహాయక గ్రహబాధ కలిగినపుడును దేవాలయమునందు స్నానము చేయించవలెను. విద్యకోరువాడు జలాశయము వందు కాని, ఇంటిలోకాని స్నానము చేయించవలెను. విజయమకోరువాడు తీర్థజలమున స్నానము చేయించవలెను. గర్భస్రావధితో బాధపడుతున్న స్త్రీకి పుష్కరిణిలో స్నానము చేయించవ రెను. పుట్టిన వెంటనే శిశువులు మరణించు స్త్రీకి ఆశోకవృక్ష సమీపమాన స్నానము చేయించవలేను. రజోదర్శనము కోరు స్త్రీలు పుషములతో నిండిన వనమునందును, పుత్రులను కోరు స్త్రీలు సముద్రమానందును, సౌభాగ్యమును గోరు స్త్రీలు, గృహమునందును స్నానము చేయవలెను. పైన చెప్పిన వారందరును విష్ణు ప్రతిమ సమీపమున స్నానము చేయవలెను. శ్రవణ, రేవతి, పుష్య నక్షత్రములందు అందరికిని స్నానము ఉత్తమము. కావ్య స్నానము చేయువారికి ఒక సప్తాహము ముందుగ నే ఉత్సాదనము విధింపబడినది. పునర్నవ, గోరోచనము, శతాంగ ము, గురుణి, బెరడు, మధూకము, రెండు విధములగు పసుపు, తగరము, నాగ కేసరమ, అంబరి మంజిష్ఠ, జటామాంసి, యాసకము కర్డమము ప్రియంగువు, తెల్ల ఆవాలు, కుష్ఠము, బల బ్రాహ్మి కుంకుమను, సత్తువులు కలిపిన పంచగవ్యములు వీటితో శరీరము నలుచుకొని, స్నానము చేయవలెను.

మండలే కర్ణికాయాంచ విష్ణుం బ్రహ్మాణమాచరేత్.

దక్షే వామే హరం పూర్వం పత్రే పూర్వాది కేక్రమాత్ లిఖేదింద్రాదికాన్దేవాన్సాయుధానహబాంధవాన్.

స్నానమండల కాన్దికు కుర్యాన్చైవ విదికుచ

విష్ణు బ్రహ్మేశ శక్రాదీం స్తద స్త్రాణ్యర్చ్య హోమయేత్.

 ఏకైక స్య త్వష్టశతం సమిధస్తు తిలాన్వృతమ్

 భద్రః సుభద్రః సిద్ధార్థ కలశాః పుష్టివర్ధనాః. 

అమోఘః చిత్రభానుశ్చ పర్జన్యోఒథ సుదర్శనః

స్థాపయేత్తు మటానే తానాశ్వి రుద్ర మరుద్గణమ్.

 విశ్వేదేవా స్తథా దైత్యావసవో మునయ స్తథా

ఆవేళయను సుప్రీతా స్తథాన్యా ఆపి దేవతాః.

 ఔషధీర్ని షా పేతుంభే జయ తిం విజయం జయామ్

శతావరీం శతపుష్పాం విష్ణకాంతాపరాజితామ్.

 జ్యోతిష్మతీమతి సలాం చందనోశీర కేసరమ్

కస్తూరి కాచ కర్పూరం వాలకం పతకం త్వచమ్. 

జాతీఫలం లవంగం చ మృత్తికాం పంచగవ్యకమ్

 భద్రపీఠే స్థితం సాధ్యం స్నా పయేయుర్విజాబలాత్.

రాజాభి షేక మంత్రోక్త దేవానాం హోమకాః పృథక్

 పూర్ణాహుతిం తతో దత్త్వా గురవే దక్షిణాం దదేల్.

 ఇంద్రోఽభిషిక్తో గురుణాపురా దైత్యాంజమానహ

దిక్పాల స్నానం కథితం సంగ్రామాదౌ జయాదికమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే దిక్పాలాది స్నానం నామ పంచషష్ట్యధిక ద్విశతతమోఽధ్యాయః.

పిమ్మట తామపత్రము పై పద్మమండలము నిర్మించి దానికర్ణిక యందు, విష్ణువును పూజించవలెను. దానికుడి భాగమున బ్రహ్మను, ఎడమప్రక్క. శివుని హర్వాది దిగ్గళుమలందు ఆయుధ కరివారాది సహితులగు దిక్పాలకులను ఉంచి హర్వాడి దిశ లండను, ఆగ్నేయాది విదిశలందును, ఎనిమిది స్నానమండలములు నిర్మించవలేను. 'ఆమండలముల పై ఆయుధ సహితులగు విష్ణు, బ్రహ్మ, శివ, ఇంద్రాదులను పూజించి, వారి నుద్దేశించి హోమము చేయవలెను. ఒక్కొక్క దేవతకు నూటయెనిమిది ఆహుతులు సమిధలతోను తిలలతోను, మృతముతోను ఇవ్వవలెను. పిదప భద్ర, సుభద్ర, సిద్దార్థ, పుష్టివర్ధన ఆమోఘ చిత్రభాను, పర్జన్య, సుదర్శనమాలను యెనిమిదిక శల స్థాపించి వాటిపై, ఆశ్విని, రుద్ర. మరుద్గణ - విశ్వేదేవ దైత్య - వసుదుర్గా - మునులను ఇతర దేవతలను ఆవాహన చేసి “మీరందరును ప్రసన్నులై ఈకల శముల పై ఉండుడు అని ప్రార్థించవలెను. ఆకలశలలో, జయంతి, విజయ, జయ, శతావరి, శతపుష్ప, విష్ణు క్రాంత, ఆపరాజిత, జ్యోతిష్మతి, ఆతిబల చందన, ఆశీర, కేసర, కస్తూరి, కర్పూర, పాలక, పత్రక, త్వచ "జాతీ ఫల, లవంగములను, మృత్తి కను, పంచగవ్యములను వేయవలెను. పిమ్మట బ్రాహ్మణులు సాధ్యుడగు మనుష్యుని భద్ర పీఠముపై కూర్చుండ బెట్టి, బలపూర్వకముగా స్నానము చేయించవలెను. రాజ్యాభిషేక మంత్రములలో చెప్పబడిన దేవతలకు వేరు వేరుగా హోమములు చేయించవలెను. పిదప హర్ణాహుతి ఇచ్చి గురువుకు దక్షిణా ఇవ్వవలెను. పూర్వము బృహస్పతి ఇంద్రునకు ఆభి షేకము చేయించగ, ఆతడు దైత్యులను చంపెను. ఇంతవరకు విజయాదిక మును ఇచ్చు దిక్పాలస్నానవి ను చెప్పితిని.

అగ్ని మహాపురాణమున దిక్పాలాది స్నానమను రెండు వందల అరువది ఐదవ అధ్యాయము సమాప్తము.