అగ్ని మహా పురాణము

104 - అథ ప్రాసాదలక్షణమ్.

ఈశ్వర ఉవాచః-

వక్ష్యే ప్రాసాదసామాన్యలక్షణం తే శిఖిధ్వజ

చతుర్భాగే కృతే జేతే భిత్తేర్భాగేన విస్తరాత్.

ఆద్రిభాగేన గర్భః స్యాత్పిణ్ణికా పాదవి స్తరాత్

పఞ్చ భాగీకృతే క్షేత్రే హ్య నర్భాగే తు పిణ్డికా.

సుషిరం భాగవి స్తీర్ణం భిత్తయో భాగవి స్తరాత్

భాగౌ ద్వౌ మధ్యమే గర్భే జ్యేష్టభాగద్వయేన తు.

  త్రిభిస్తు కలశీ గర్భ శేషో భిత్తిరితి క్వచిత్

షోడా భ కేఒథవా మేతే భిత్తిర్భాగే కవి స్తరాల్.

గర్భో భాగేన విస్తీర్ణో భాగద్వయేన పిజ్జికా

విస్తారాద్ద్విగుణో వాపి సపాద ద్విగుణోపి వా.

అర్ధార్ధ ద్విగుణో వాపి త్రిగుణః క్వచిదుచ్చుయః

జగతివి స్తరార్దన త్రిభాగేన క్వచిద్భవేత్ నేమిః

పాదోనని స్త్రీల్టా ప్రాసాదస్య సమ స్తతః

పరిధిస్త్ర్యంశకో మద్యే రథకాంక్షత్ర కారయేత్.

చాముణ్డం శైరవం తేషు నాద్యేశం చ నివేశయేత్

ప్రాసాదాద్యేన దేవామప్టో వా చతురోఽపివా.

 ప్రదక్షి జహాః కుహ్యత్ర్పాశాదాదిషు  వా సవా

అబిత్యాః పూర్వతః స్థాప్యాః స్కళ్మోగ్నిర్వాయుగోచరే.

ఏవం ఉమాడూ న్యస్యాః: స్వస్యాం స్వస్యాం దిశి ఫిరాః.

చైతుల శిఖరం కృత్వా కనాసా ద్విభాగి.

తృతీయా వేదికా త్వగ్నేః స కణోమలసారకః

వై రాజః పుష్పకశ్చాత్యః కైలాసో మణిక స్తథా.

 త్రివిష్టపం చ పళ్చైవ మేరుమూర్ధని సంస్థితాః

చతురస్రస్తు తత్రోద్యో ద్వీతీయోఽపి తదాయతః .

వృత్తో వృత్తాయతశ్చాన్యో హ్యష్టానశ్చాపి పఞ్చమః

ఏకై కో నవధా భేదై శ్చత్వారింశచ్చ పఞ్చ చ.

పరమేశ్వరుడు పలికెను; మయూరధ్వజా! ఇపుడు. ప్రాసాద్ధసామాన్యలక్షణము చెప్పెదను, చతురశ్ర క్షేత్రమును నాలుగు భాగములు చేయగా, గోడల విస్తారము. ఒక భాగ మండవలెను, మధ్యభాగము; గర్భము - ఒక థాగమున పిండిక ఉండవలెను. ఐదు భాగముల వేత్రము లోపలి భాగమున పిండిక ఉండవలెను. ఒక భాగము విస్తోరమ కాళీగా ఉండవలెను. ఒక భాగము విస్తారము గోడలకొరకు ఉపయోగించవలెను. మధ్యమగర్భమునందు రెండు భాగములు, జ్యేష్ఠగర్భమునందు కూడ రెండు భాగములు ఉండవలెను. కాని-మూడుభాగములలో కనిషగర్భమ, మిగిలిన ఎనిమిదవ భాగము గోడలు అను పద్ధతి కూడ ఉన్నది. క్షేత్రమును ఆరు భాగములుగా విభజించినపుడు ఒక భాగము విస్తారము గర్భము కొరకను, రెండు భాగములు - పిండిక కొరకును వినియోగింపబడును. గోడల ఎత్తు వెడల్పుకండి. రెట్టింపు గాని, రెండును పావును ఆధికము గాని, రెండున్నర రెట్లుగాని, మూడు రెట్లు గాని ఉండు పద్దతి కూడ కనబడు చున్నది. కొన్ని చోట్ల ప్రాసాదముచుట్టు గోడల సగము లేదా మూడు వంతుల వైశాల్యము గల జగతి నాల్గవ వంత విస్తారము గల నేమి కానపచ్చు చున్నది. మధ్యయందు మూడవ వంతు పరిధి ఉండును. అచట రథము నిర్మించి దానిపై చాముండభైరవుని, నాటేశుని స్థాపించవలెను. ప్రాసాదము సగమ విస్తారములో నాల్గు వైపులందును, వెలుపల, దేవతల కొరకై, ఎనిమిది. లేదా నాలుగు పరిశ్రమలు ఏర్పరుపవలెను. ప్రాసాదాదులందు వీటి నిర్మాణము ఇచ్ఛాధీనము. పర్వదిక్కునందు ఆదిత్యులను, వాయవ్యమున స్కంద-ఆగ్నులను, యమాడిదేవతలను వారి వారి దిక్కులందున స్థాపించవలెను. శిఖరమును వాలుగు భాగములుగ చేయగా క్రింది రెండు భాగములకు “తకవాసిక' అని పేరు. మూడవ భాగమున వేది ప్రతిష్ట, దాని ముందు భాగము ‘అమలసారము' అని ప్రసిద్ద మైన కంఠము. మేరుశిఖరముపై వై రాజము, పుష్పకము, కైలాసము, మణికము, త్రివిష్టపము ఆను ఐదు ప్రాసాదములు మాత్రమే ఉన్నవి. వీటిలో మొదటి దైవ వైరాజము చతురస్రము. పుష్పకము. చతురస్రాయతము. కైలాసము వృత్తాకారము. మణికము వృత్తాయతము. త్రివిష్టపము అష్టకోణాకారము వీటిలో ఒక్కొక్క దానికి తొమ్మిదేసి భేదము లుండుటచే మొత్తము నలుబదియైడు భేదము లగును.

ప్రాసాదః ప్రథమో మేరుర్ద్వితీయో మందర స్తథా

 విమానం చ తథా భద్ర సర్వతోభద్ర ఏవ చ.

చరుకో ననికో నన్దిర్వర్ధమానస థాపరః

శ్రీవత్స శ్చేతి వై రాజాన్వవాయే చ సముత్తితాః.

వలభీగృహరాజశ్చ శాలాగృహం చ మద్దిరమ్

విశాలశ్చ సమో బ్రహ్మమన్దిరం భువనం తథా.

ప్రభవః శిబికా వేశ్మ నవై తే పుష్పకోద్భవాః

వలయో దున్దుభిః పద్మో మహాపద్మక ఏవ చ.

వర్ధనీ వాన్య ఉష్ణీషః శ జ్ఞశ్చ కలశ స్తథా

ఖవృక్షశ్చ తథా పేతే వృత్తాః కైలాససంభవా.

గజో2థ వృషభో హంసో గరుత్మానృక్షనాయకః

భూషణ్ భూధర శాన్యే శ్రీజయః పృథివీధరః.

వృత్తాయలాత్సముద్భూతా నవైతే మట్టికాహ్వయాత్

వజం చక్రం తథా చాన్యత్స్వస్తికం వజస్వస్తికమ్.

చిత్రం స్వస్తిక అడ్డం చ గదా శ్రీకణ ఏవ చ

విజయో నామతశ్చైతే త్రివిష్టపసముద్భవా.

నగరాణామిమాః సంజ్ఞా లాటాదీనాబ్లమాస్తథా

వాగ్ధనోన్నతం చూలం పృథులం చ విభాగత.

దశధా వేదికాం కృత్వా పశ్చిభిః స్కన్దవి స్తరః

త్రిభిః కణం తు కర్తవ్యం చతుర్బిస్తు ప్రచణ్ణకమ్.

 దిక్షు ద్వారాణి కార్యాణి న విదిషు కదాచన

పిణ్డికా కోణవిస్తీర్ణా మధ్యమానా హ్యుదాహృతా.

మేరువు, మందరము, విమానము, భద్రము, సర్వతోభద్రము, రుచకము, నందకపరు, . వర్ధమానము, నంది, శ్రీవత్సము అను తొమ్మిది ప్రాసాదములు వేరాజకులమునకు సంబంధించినవి. వలభి, గృహరాజము, అలాగృహము, మందిరము, విశాలచమసము, బ్రహ్మమందిరము, భువనము, ప్రభవము, శివివేళ్మ అన తొమ్మిది ప్రాసాదములు - పుష్పకకలమునకు సంబంధించినవి. వలయము, దుందుభి, పద్మము, “మహాపద్మము, వర్దని, ఉజ్జీవము, శంఖము, కలశము, ఖవృక్షము అను తొమ్మిది వృత్తాకార ప్రాసాదములు కైలాసకులమునం దుత్పన్న మైనవి. గజమా, వృషభము, హంసము, గరుత్మంతము, ఋక్షనాయకము, భూషణము, భూధరము, శ్రీజయము, పృథ్వీధరము అను తొమ్మిది వృత్తాయతప్రాసాదములు మణికము నుండి ఆవిర్భవించినవి. వజ్రము, చక్రము, స్వస్తికము, వజస్వస్తికము, చిత్రము, స్వస్తికఖడ్గము, గద, శ్రీకంఠము, విజయము అను తొమ్మిది ప్రాసాదములు త్రివిష్టపము నుండి ఆవిర్భవించినవి. నగరములకు కూడ ఇవే పేర్లు, లాటాదులకు కూడ ఈ సంజ్ఞలే. చూలము శిఖరకంత ప్రమాణములో సగ ముండవలెను. దాని లావు కంఠము లావులో మూడవ వంతు ఉండవలెను. వేదిని పది భాగమలు చేసి ఐదు భాగములతో స్కంధవిస్తారముమ, మూడు భాగములతో కంఠమును, నాలుగు భాగములతో దాని ఆండమును నిర్మించవలెను. ద్వారములు పూర్వాదిదిక్కులందు ఉంచవలెను గాని విదిశలయందుంచరాదు. పిండికా విస్తారము కోణమువరకును వెళ్ళవలెను. మధ్యభాగము దగ్గర దాని సమాప్తి కావలెను.

క్వచిత్పఞ్చ మభాగేన మహతాం గర్భపాదతః

ఉచ్ఛాయా ద్విగుణా స్తేషామన్యథా వా నిగద్యతే.

షష్ట్యధికాత్సమారభ్య ఆజ్గులానాం శతాదీప

ఉత్తమాన్యపి చత్వారి ద్వారాణి దశహానితః.

తీజ్యేవ మధ్యమాని స్యుస్త్రీజ్యేవ కనీయాంస్యధః

ఉచాయాఫ్ఘన విస్తారో హ్యుచాయోభ్యధిక శ్రోధా.

చతుర్భిరష్టభిర్వాపి దశభిరజులే స్తతః

ఉచ్ఛాయాత్పాదవి సీర్ణాం విశాఖా శ్రదుదుమ్బరే.

విస్తరార్ధేన బాహుల్యం సర్వేషామేవ కీర్తితమ్

ద్విపఇసప్తనవభిః శాఖాభిర్ద్వార మిష్టదమ్.

అథఃశాఖాచతుర్థాంశ ప్రతీహారౌ నివేశయేత్

మిథునై, పాదవర్ణాభిః శాఖా శేషం విభూషయేత్.

స్తమ్భవిద్దే భృత్యతా స్యాద్వృక్షవిద్దే త్వభూతిలా

కూపవిద్దే భయం ద్వారే తేత్రవిద్దే ధనక్షయః.

ప్రాసాదగృహశాలాదిమార్గవిద్దేషు బన్దనమ్

సభావిద్దేన దారిద్య్రం వర్ణవిద్దే నిరాకృతిః.

ఉలూఖలేన దారిద్య్రం శిలావిద్దేన శత్రుతా

ఛాయావిద్దేన దారిద్య్రం వేధదోషో న జాయతే.

భేదాదుత్పాటనాద్వాపి తథా ప్రాకారలక్షణాత్

సీమాయా ద్విగుణత్యాగాద్వేధదోషో న జాయతే.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే సామాన్యప్రాసాదలక్షణం నామ చతురధికశతతమోధ్యాయః.

కొన్నింట ద్వారముల ఎత్తు గర్భము నాల్గవ భాగముకంటె గాని, ఐదవ భాగముకంటె గాని రెట్టింపు ఉండునట్లు ఉంచవలెను. లేదా మరొకవిధముగ కూడ చేయవచ్చును. నూట అరవై అంగుళముల ఎత్తునుండి పదేసి ఆంగుళములు తగ్గించుచు నిర్మించిన నాలుగు ద్వారములు ఉత్తమము అని చెప్పబడినవి. నూట ఇరువది, నూటపది, నూరు అంగుళముల ఎత్తు ద్వారములు మధ్యమములు. తొంబది, ఎనుబది, డెబ్బది అంగుళముల ఎత్తు ద్వారములు కనిష్టములు, ద్వారము వెడల్పు పోడవులో సగ ముండవలెను. ఎత్తు చెప్పినదానికంటె, మూడు, నాలుగు, ఎనిమిది లేదా పది అంగుళములు -కూడ ఉన్నను కథప్రదమే. విస్తారము ఎత్తులో నాల్గవ వంతు ఉండవలెను. ద్వారశాఖల (ప్రక్కకమ్ముల), వెడల్పు లేదా మొత్తము అన్ని కమ్ముల వెడల్పు ద్వారము వెడల్పులో నాల్గవవంతు ఉండవలెను. మూడు, ఐదు, ఏడు లేదా తొమ్మిది ఐతో నిర్మించిన ద్వారము అభీష్టఫలముల నిచ్చును, క్రింది శాఖ నాల్గవభాగము పై -ద్వారపాలులను స్థాపించవలెను. మిగిలిష్ణ, శాఖలను స్త్రీపురుషమిథునము ఆకారములతో అలంకరించవలెను. ద్వారమునకు ఎదురుగా స్తంభము వచ్చినచో సంభవేధ దోషము. దానివలన గృహస్వామి దాసు డగును, వృక్షముచే వేధ యైనచో ఐశ్వర్యనాశనము. కూపవేధ వలన భయప్రాప్తి, క్షేత్రవేధచే ధనహాని కలుగును. ప్రాసాద గృహ శాలాదుల మార్గముచే ద్వార వేధ కలిగినచో బంధనము, సభచేవేధ ఏర్పడి, నచో దారిద్ర్యము, వర్ణవేధచే తిరస్కారము, ఉలూఖలవేధచే దారిద్ర్యము, శిలావేధచే శత్రుత్వము, ఛాయావేధచే నిర్ధవత ప్రాప్తించును. వీటి నన్నింటిని ఖండించివేసినను, పెకలించినను వేధదోష ముండదు. వీటిమధ్య ప్రాకారము కట్టించినను దోషముండదు. ఈ వస్తువులు సరిహద్దునుడి రెట్టింపు దూరమునం దున్నను వేధదోష ముండదు.

అగ్ని మహాపురాణమునందు సామాన్యప్రాసాదలక్షణవర్ణనమను నూటనాల్గవ అధ్యాయము సమాప్తము.