అగ్ని మహా పురాణము

149 - అథ లక్షహోమకోటిహోమః

ఈశ్వర ఉవాచః-

హోమాద్రణాదౌ విజయా రాజ్యా పిర్విఘ్న నాశనమ్

కృచ్ఛేణ శుద్ధిముత్ఫాద్య ప్రాణాయామళ తేన చ.

అనర్జలే చ గాయత్రం జప్త్వా షోడశధా చరేత్

ప్రాణాయామాంశ్చ పూర్వాహే జుహుయాత్సావ కే హవిః.

భైక్ష్యయావకభక్షి చ ఫలమూలాశనోపి వా

క్షీరసక్తుఘృతాహార ఏకమాహారమాశ్రయేత్.

యావత్సమా పిర్భవతి లక్షహోమస్య పార్వతీ

దక్షిణాయాగహోమా నే గావో వస్త్రాణి కాళ్చానమ్.

సర్వో త్పాతసముత్పత్తి పజ్చభిర్దశభిర్ద్విజై

నాస్త్రి లోకే న ఉత్పాతో యో హ్యనేన న కామ్యతి.

మాల్గల్యం పరమం శాస్త్రి శ్రుతస్మాదతిరిచ్యతే

కోటిహోమం తు యో రాజా కారయేత్పూర్వవద్ద్విజై.

న తస్య శత్రవః శంకె జాతు తిష్టని కర్షి చిల్

న తస్య మారకో దేశ వ్యాధిర్వా జాయతే క్వచిత్.

అతివృష్టిరనావృష్టిర్మూషకా గల రకాః

రాక్షసాద్యాశు అమ్య సర్వే చ రికవో రణే.

కోటీహో మే తు వరయే ద్బ్రాహ్మణాన్వింశతిం తథా

శతం చాథ సహస్రం వా యథేష్టాంభూతిమాప్నుయాత్.

కోటిహోమం చ యః కుర్యాద్విజో భూపోథవా చ విట్

యదిచ్ఛేత్ర్పాప్నుయాత్తత్తత్సశరీరో దివం వ్రజేత్.

గాయత్ర్యాగ్రహమ నైర్వా కూష్మాణేజాత వేద సైః

ఐన్డవారుణవాయవ్యయామ్యాగ్నేయైశ్చ వైష్ణవై.

శా కేయె శామ్భ  సౌదైర్మ నౌక్తోమార్చనాత్తతః

అయుతేనాల్పసిద్ధిః స్యాలక్షహోమోఖిలార్తినుత్.

సర్వపీడాదినాశాయ కోటిహోమోఖిలార్థదః

యవక్రొహితిలక్ష్మీ రఘృతకుశ ప్రసాతి (కాశి)కాః.

పజ్కజోశిర బిల్వామదలా హోమే ప్రకీర్తితాః

అష్టహ సప్రమాణేన కోటిహోమేషు ఖాతకమ్.

(తస్మాదర్గ ప్రమాణేన కోటిహోమేషు ఖాతకమ్.)

తస్మాధర్గ ప్రమాణేన లక్షహోమే విధీయతే

హోమోయుతేన లక్షీణ కోట్యాజ్యాద్యైః ప్రకీర్తితః.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే యుద్ధజయార్ణవే ఆయుతలక్షకోటి హోమో నామైకోనపఞ్చాశ దధిక శతతమోధ్యాయః.

పరమేశ్వరుడు పలికెను : హోమము చేయుటచే యుద్దమునందు విజయము కలుగును; విఘ్నము నశించును. ముందుగా కృచ్చవ్రతము చేసి దేహమును శుద్దము చేసికొనవలెను, నూరు ప్రాణాయామములతో శరీరమును శుద్ధము చేసి కొని జలమునందు నిలిచి గాయత్రీజపము చేసి పదునారు ప్రాణాయామములు చేయవలెను. పూర్వాహ్లమునందు ఆగ్నిలో ఆహుతులు సమర్పించవలెను. భిక్షా ప్రాప్త మగు యవనిర్మితభోజ్యపదార్థములను, ఫలమూలములను, క్షీర మును, పేలాల పిండిని, మృతమును యజ్ఞకాలమున ఆహారముగా తీసికొనవచ్చును. పార్వతీ! లక్షహోమములు పూర్తి యగునంతవరకు ఒక పర్యాయమే భోజనము చేయవలెను. లక్షహోమములు పూర్ణాహుతి చేసిన పిమ్మట గోవులను, వస్త్రములను, సువర్ణ మును దక్షిణగా ఇవ్వవలేను. ఏ విధమైన ఉత్పాతములు కనబడినను ఐదుగురు లేదా పదిమంది ఋత్విక్కులతో పైన చేప్పిన యజ్ఞము చేయించవలెను. ఈ లోకములో దీని చే శాంతించని ఉత్పాత మేదియు లేదు. దీనిని మించిన మంగళకర మైనది మరేదియు లేదు. పూర్వోక్త విధానము ప్రకారము ఋత్విక్కులచే ఈ యజ్ఞము చేయించిన రాజు. ఎదుట శత్రువు రణ రంగమున నిలువజాలడు, ఆతని రాజ్యములో అతివృష్టి, అనావృష్టి, ఎలుక లబాధ, మిడతలజాధ, చిలుకలవాధ, భూత రాక్షసాదులు, యుద్ధమునందు సమ స్తశత్రువులు నశించును. కోటిహోమముల కొరకు ఇరువదిమంది గాని, వందమంది. గాని, వేయిమంది గాని, బ్రాహ్మణుల వరణము చేయవలెను. దీనిచే యజమానునకు, అభిష్టధనవై భవప్రాప్తి కలుగును. కోటిహోమాత్మక యజ్ఞము చేసిన బ్రాహ్మణుడు కాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని ఏది కోరిన ఆది పొందగలుగును. అతడు సశరీరముగ స్వర్గమునకు వెళ్లును. హోమ పూజాదులు గాయత్రీమంత్ర - గ్రహమంత్ర . కూష్మాండమంత్ర ఆగ్ని మంత్ర - ఐంద్రమంత్ర - వారుణ - వాయవ్య - యామ్య ఆగ్నేయ వైష్ణవ - శాక్త - శైవ - సూర్యమంత్రములు. వీటిలో చేయు పద్దతి చెప్పబడినది. అయుతహోమము చే అల్ప మైన సిద్ది కలుగును. లక్షహోమము సకలదుఃఖములను తొలగించును. కోటిహోమము సకలక్లేశములను నశింపచేయును, సకలపదార్ధములను ఇచ్చును. యవ - ధాన్య - తిల- క్షీర - ఘృత . కుశ - ప్రాసాతికా . కమల . తల . బిల్వ - ఆమదలములు - హోమమనకు తగిన పదార్ధములు. కోటి హోమమునకు ఎనిమిది హస్తముల లోతు ఆగ్ని కుండమును, లక్షహోమమునందు నాలుగు హస్తముల లోతు అగ్నికుండమును నిర్మింపవలెను. ఆయుత - లక్ష - కోటిహోమములందు ఆజ్యము ఉవయోగించవలెను.

అగ్ని మహాపురాణమునందు యుద్ధజయారవమున ఆయుతలక్షకోటిహోమ మమ నలుబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.