అగ్ని మహా పురాణము
374 - అథ ధ్యానమ్
అగ్ని రువాచః
అగ్ని దేవుడు పలికెను. “ధ్యై - చింతాయాం” అని ధాతువు చెప్పబడినది. విక్షేపము లేని మనస్సుతో మాటి మాటికి విష్ణువును చింతించుట ధ్యానము. సమస్త ఉపాధి విముక్తమును సమనస్కమను అగు ఆత్మ బ్రహ్మచింతా లగ్నమై వుండుట ధ్యానము. ధ్యేయముపై నిలచి యున్నదియు, సదృశ ప్రత్యయములు మాత్రము కలదియు ఆగు మనస్సు ఇతర ప్రత్యయము లేకుండగ వుండుట కూడ ధ్యానము. ఏ ప్రదేశ్ము వందై వను చిత్తమును ద్యేయము నందు నిలిపి ఏకైక జ్ఞానము కలిగి యుండుట ధ్యానము. ఇట్టి ధ్యానము నందు లగ్నుడై స్వదేహమును త్యజించిన వాడు కులమును, స్వజన మిత్రులను ఉద్దేశించి హరి సారూప్యమును పొందును. ఈ విధముగా ముహూర్తకాలము గాని, ఆర్థ ముహుర్తము గాని శ్రద్ధా పూర్వకముగ హరిని ధ్యానించువాడు. ఏ గతిని పొందునో ఆ గతిని సకల మహా యజ్ఞముల చేత కూడ పొంద శక్యము గాదు.
ధ్యాత, ధ్యానము, ధ్యేయము, ధ్యాన ప్రయోజనము అను ఈ చతుష్టయును తెలుసుకొని తత్త్వవే త్తయై యోగాభ్యా సము చేయవలెను. యోగాభ్యాసము వలన అష్టవిధ ఐశ్వర్యములు, ముక్తి కలుగును. జ్ఞాన వైరాగ్యవంతుడు, శ్రద్ధాళువు, క్షమాశీలుడు, విష్ణు భక్తుడు, సర్వదా ధ్యానము చేయువాడు అగుసాధకుడే ధ్యాత. పర బ్రహ్మ, మూ ర్తము మూ ర్తము అని రెండు విధములు. హరి ధ్యానము చింతనము, సర్వజ్ఞుడైన శ్రీ మహావిష్ణువు సకలుడు నిష్కలుడు అని తెలుసుకొన వలెను. ఆణిమాద్యైశ్వర్య ప్రాప్తియు ముక్తియు ధ్యానమునకు ప్రయోజనము. కర్మఫలము నిచ్చువాడు విష్ణువు. అందుచే ఆ పరమేశ్వ రుని ధ్యానించవలెను. వడచునపుడు, నిలిచినపుడు, నిద్ర పోవుచున్న పుడు, మేల్కొన్నపుడు, కండ్లు తెరచినపుడు, మూసి నపుడు, శుచిగా వున్నను, ఆశుచిగా వున్నను సర్వదా పరమేశ్వరుని ధ్యానించవలెను. తన దేహము ఆనెడు మందిరము మధ్య మనస్సులో హృదయపీఠ మధ్యము నందు కేశవుని స్థాపించి ధ్యాన యోగమతో పూజించవలెను. ధ్యాన యజ్ఞము చాల శ్రేష్టమైనది. సకల దోష రహితమైనది. అట్టి య జ్ఞము చేసి ముక్తి పొందవలెను. బాహ్య శుద్ధి మాత్రము గల యజ్ఞములచే ముక్తి లభింపదు. ధ్యానము హింసాదోష రహితమగుటచే చిత్తశుద్దికి ఉత్తమ సాధనము. అందువలన ధ్యాన యజ్ఞము ఉత్తమమైనది, మోక్ష ఫలము నిచ్చును. అందువలన ఆశుద్దమైనదియు ఆనిత్యము బాహ్య సాధనములు కలదియు ఆగు యజ్ఞాది కర్మను త్యజించి యోగాభ్యాసము చేయవలెను. ప్రారంభమున వికారయుక్తము, ఆవ్య క్తము భోగ్య భోగ సమన్వితము, ఆగు గుణత్రయమును క్రమముగ హృదయము నందు ధ్యానించవలెను. తమో గుణమును రజోగుణముచే ఆచాదించీ రజో గుణముచే సత్వ గుణమును ఆచ్చాదించవలెను. ప్రారంభమున వరుసగా కృష్ణ, ర క్షసిత ముబగు మూడు మండలము లమ ధ్యానించవలెను. సత్వోపాధి గుణాతీతుడగు ఇరువది యైదవ తత్త్వము పురుషుడు. అశుద్ధములగు మొదట చెప్పిన గుణాదులను క్రమముగ త్యజించి శుద్ధ మగు ఈ పురుష తత్వమును ధ్యానించవలెను. పురుషుని పైన నాభి నుండి ఒక దివ్య పంజకము ప్రకటమై యున్నది. ఆది ఐశ్వర్య రూపము. ఆది పండ్రెండు అంగుళముల విస్తారముతో పరిశుద్ధమై వికసించి శ్వేత వర్ణముతో నుండును. నాభి కందము నుండి పుట్టిన దాని మృణాలము ఎనిమిది అంగుళముల పొడవు గలది. దాని ఎని మిది పత్రములే ఎనిమిది అణిమాది గుణములు. దాని కర్ణిక జ్ఞానము. దాని నాళము ఉ త్తదు వైరాగ్యము. విష్ణు ధర్మమే దాని కందము. ఈ విధముగా పద్మమును భావన చేయవలెను. ధర్మ జ్ఞాన వైరాగ్య రూపము శివైశ్వర్యమయము, శ్రేష్ఠము అగు ఆ పద్మాసనమును తెలుసుకొన్న వాడు సర్వ దుఃఖములను దాటును.
ఆ పద్మము యొక్క కర్ణికా మధ్యమున శుద్ధ దీపశిఖా వంటి ఆకారము కలవాడును, అంగుష్ఠ మాత్ర ప్రమాణము కలవాడును నిర్మలుడును ఓంకార స్వరూపుడును, కందపుష్పము వలె గోళాకారముగల తారారూపము కలవాడును ఆగు పర మేశ్వరుని ధ్యానించవలెను. లేదా ఈ కమలము పైన ప్రకృతి పురుషుల కంటే ఆతీతుడగు పరమాత్మవున్నట్లు ధ్యానము చేయుచు ఆ పరమాత్మ కిరణసముదాయముతో నలువైపుల ప్రకాశింప చేయునట్లు భావించుచు ధ్యానించవలెను. పరమాక్షర మగు ఆ ఓంకారమును సర్వదా ధ్యానించవలేను, సాధకుడు మనస్సును స్థిరము చేసుకొనుటకై ముందుగా స్థూలమును ధ్యానించవలెను. మనస్సు స్థిరమైన పిమ్మట దానిని సూక్ష్మము పై నిలుపుట శక్యమగును. నాభికమలమున దశాంగుల దీర్ఘమగు. వాళము వున్నది. దానిపై పండ్రెండు అంగుళముల విస్తారముగల అష్టదళ పద్మము వున్నది. కర్ణికా కేసరములు గల దావీపై సూర్య, సోమ, ఆన్ని మండలము లున్నవి. ఆ అన్ని మండల మధ్యమున శంఖ, చక్ర, గదా, పద్మ మాల ధరించిన చతుర్భుజుడగు విష్ణువుగాని, శార్ణ అక్షవలయ, పాశాంకుశ ములను కూడ ధరించిన అష్ట భుజ విష్ణువుగాని వున్నట్లు భావించవలెను. ఆతని విగ్రహము సువర్ణ వర్ణమై లేదా శ్వేత వర్ణమై వుండును. ఆతడు పీతాంబర ధారియై, తీవత్స, కౌస్తుభ - వనమాలా, సువర్ణహార, మకర కుండల రత్నోజ్వల కిరీటములను ధరించి యుండును. ఈ విధముగ సర్వా భరణ రూషితుడగు ఆతని ఆకారము జానెడు వున్నట్లు గాని, ఇచ్చాను సారము ఆంతకంటే అధిక వరంగా వున్నట్లుగాని భావన చేయవచ్చును. నేనే జ్యోతిరాత్మాయగు బ్రహ్మను ఓంకార రూపమగు దేవుడను, విముక్తుడను, అని ధ్యానము చేయ వలేమ. ధ్యానము చేసి ఆలసినవాడు మంత్రమును జపించవలెను. జపము వలన అలసినవాడు ధ్యానము చేయవలెను. ఈ విధమంగ జపధ్యానాదులు చేయువానికి విష్ణువు ప్రసన్నుడగును. యజ్ఞమున్నియు జపయజ్ఞము యొక్క పదునారవ వంతుకు కూడ సరితూగవు. ఇపము చేయువానిని వ్యాధులు కాని, ఆధులుగాని, గ్రహములు కాని, పీడించవు. జపమువలన భుక్తిని ముక్తి ని మృత్యు జయమును పొందను.
ఆగ్ని మహా పురాణమున ధ్యాననిరూపణమవు మూడు వందల డెబ్బది నాల్గవ అధ్యాయము సమాప్తము.
