అగ్ని మహా పురాణము

Table of Contents

207 - అథ కౌముదవ్రతమ్

ఆగ్ని రువాచః-

అగ్ని దేవుడు చెప్పెను : ఇపుడు కౌముద వ్రతమును గూర్చి చెప్పెదను. దీనిని ఆశ్వయుజ శుక్లపక్షమునందు ప్రారంభించవలెను. వ్రతము చేయువాడు ఏకాదశీదివసమున ఉపవాసము చేసి ఒక మాసము శ్రీమహావిష్ణువును పూజించ వలెను. “నేను ఆశ్వయుజ శుక్ల పక్షమునందు ఒక పూట మాత్రమే భోజనము చేయుచు శ్రీమన్నారాయణుని మంత్రము జపించుచు, భుక్తిముక్తిప్రాప్తి కొరకై ఒక మాసము పర్యంతము కౌముదవ్రతమును అనుష్టించెదను”. అని సంకల్పించ వలెను. వ్రతము సమాప్త మైన పిదప ఏకాదశీదివసమున ఉపవాసము చేసి ద్వాదశిసమయమున శ్రీ మహావిష్ణువును పూజించ వలెను. శ్రీ మహావిష్ణువు విగ్రహము పై చందనము, అగరు, కేసర మకు అనులేపనము చేసి, కమల-ఉత్పల-కహ్లర-మాలతీపుష్పములతో విష్ణువును పూజించవలేను. వాక్సంయమముతో తైలపూర్ణ దీపము వెలిగించి, రెండు వేళలయందును పాయసము, అపూపములు, లడ్డులు నైవేద్యము చేయవలెను. “ఓం నమో భగవతే వాసుదేవాయ” అను ద్వాదశాక్షర మంత్రమును నిరంతరము జపించవలెను. పిదప బ్రాహ్మణభోజనము చేయించి క్షమాప్రార్థనాపూర్వకముగ వ్రతవిసర్జనము చేయవలెను. దేవజాగరణీ ఏకాదశి వరకు, ఒకమాసము ఉపవాసము చేయుటచే కౌముద ప్రతము పూర్ణ మగును. పూర్వో క్షమాసోపవాసము గూడ ఇన్ని దినములే జరుగును. కాని ఈ కౌముదవ్రతముచే దానికంటే అధికఫలము లభించును.

అగ్ని హామపురాణమునందు కౌముదవ్రతవర్ణన మను రెండువందల ఐదవ అధ్యాయము సమాప్తము.