అగ్ని మహా పురాణము

Table of Contents

315 - అథ స్తంభనాది మంత్రాః

అగ్ని రువాచః

            అగ్నిదేవుడు పలికెను. ఇపుడు స్తంభనమోహన వశీకరణ, విద్వేషణ ఉచ్చాటన ప్రయోగములను విష వ్యాధి ఆరోగ్య మారణ కమన ప్రయోగములను చేప్పెదను. భూర్జ పత్రము పై ఆరు అంగుళముల కూర్మ చక్రమును తాడన ముతో వ్రాయవలెను. దాని వణఖ ముఖము నందును, పాదము లందును మంత్ర న్యాసము చేయవలెను. పాదములందు క్రీం, ముఖమునందు హీం, గర్భ స్థానమున త్వరితా విద్యను వ్రాసి పృష్ఠ భాగమువ సాధ్య నామము వ్రాయవలెను, మాలామంత్రములతో వేష్టితముచేసి ఆయంత్రమును ఇటుక పై స్థాపించి దానిని కప్పి కూర్మ పీఠము నందున్న కరాళ మంత్ర ముతో అభిమంత్రించవలెను. మహా కూర్మమును పూజించి శత్రువునుద్దేశించి చర్మోదకమును చిమ్మి శత్రువును స్మరించుచు వానిని ఏడు పర్యాయము ఎడమ పాదముతో తన్న వలెను. అపుడు శత్రువునకు ముఖ భాగ స్తంభనము కలుగును.

            భైరవ మూర్తి వ్రాసి దాని నలు వైపుల “ఓం శత్రు ముఖ మొదలు, స్వాహా, వర కును వున్న మూలో క్త మంత్రమును వ్రాయవలెను. పిదప వట్ యనియు ప్రయోగోద్దేశ్యమును వ్రాసి ఆమంత్రమును జపించుచు, భైరవుని వామహస్తమున న మును దక్షిణ హస్తమున శూలమును వ్రాసి ఆ మోర మంత్రమును వ్రాయవలెను. దీని వలన యుద్ధమునందు శత్రువులు స్తంభితులగుదురు. “ఓంనమో భగవత్యై మొడలు స్వాహా వర కుమ వున్న మూలోక పుత్ర మును జపించుచు గోరోజనాదికముతో తిలకము ధరిం. నచో మానవుడు సమస్త జగత్తును మోహింపచేయును. “ఓం, ఫేం మొదలు స్వాహా వరకును వున్న మూలోక మంత్రముతో తిలకము ధరించినవాడు రాజాదులను వశము చేసుకొనుము. గర్గభధూళి తీసుకుని శవముపై వేసిన పువ్వులు శ్రీరజోయుక్త వస్త్రఖండము తీసుకొని రాత్రి శత్రువు శయ్యాదులపై విసరి నచో స్వజన విద్వేషము కలుగును. ఆవుడెక్క కొమ్మ గుర్రపుడెక్క, సర్ప శిరస్సు వాటిని నూరి కలిపి శత్రువు ఇంటిపై వేసినచో వారి ఉచ్చాటనము కలుగును. పచ్చని కరవీర శివ, మారణ ప్రయోగము నందు ఉపయుక్తమైనది. సర్పము, రక్తము, చుంచు రక్తము కరవీర బీజము, మారణ సాథకములు. చచ్చిన తొండ తుమ్మెద పీత, తేలు, వీటిని చూర్ణము చేసి తైలములో వేసి ఆ తైలమును శరీర మనకు పూసినచో కుష్టరోగము కలుగును.

“ఓం నవగ్రహాయ” మొదలు స్వాహా వరకుమ వున్న మూలోక్త మంత్రమును భూర్ణ పత్రము పై కాని నవగ్రహ ప్రతిమపై గాని వ్రాసి నూరు జిల్లేడు పూవులతో పూజించి ఆ యంత్రమున శ్మశానమున పొతినచో గ్రహములు శత్రువును నశింపచేయుము. ఓం కుంజరీ" మొదలు గృష్ణత వరకునువున్న మూలోక్త మంత్రమును భూర్ణ పత్రము పై వ్రాసి శత్రు పదస్థానమున శత్రునామము వ్రాసి శ్మశానమునందు ఆయంత్రమును పూజించినచో శత్రువు నశించును.

ఆగ్ని మహాపురాణముచే స్తంభన మంత్ర నిరూపణమను మూడువందల పది హేనవ అధ్యాయమ సమాప్తము.