అగ్ని మహా పురాణము

Table of Contents

259 - అథ ఋగ్విధానమ్

అగ్ని రువాచః

పుష్కర ఉవాచః

అగ్ని దేవుడు పలికెను ; పుష్కరుడు పరశురామునకు చెప్పిన ఋగ్యజుః సామాథర్వ విధానమును చెప్పెదను. దీని ప్రకారము జప హోమములు చేసినచో భుక్తిముక్తులు లభించును. పుష్కరుడు పలికెను. ఒక్కొక్క వేదమునకు సంబంధించిన చేయవలసిన కర్మలను మీకు చెప్పెదను. ముందుగ భుక్తి ముక్తి ప్రదమగు ఋగ్విధానమును వినుము. జల మధ్యమునందు కాని హోమసమయమున గాని గాయత్రీ జపము చేయు వానికి సకల మనో వాంఛితములు లభించును. ప్రాణాయామ పూర్వకముగా చేసినచో విశేషముగా లభించును. రాత్రిమాత్రమే భుజించుచు అనేక పర్యాయములు స్నానము చేసి దశ సహస్ర గాయత్రీ జపము చేయువాని పాపములన్నియు నశించును. హవిస్సును భుజించుచు లక్ష గాయత్రీ జపము చేసిన వానికి ముక్తి లభించును. ప్రణవము పరబ్రహ్మ స్వరూపము. దాని జపము సర్వపాప వినాశ కము. బొడ్డులో తు నీటిలో నిలచి ఓంకారమును నూరు పర్యాయములు జపించి అభిమంత్రించిన జలమును త్రాగిన వాడు ముక్తుడ గును. ఓంకార ములో వున్న ఆ ఉ మ్ అను మూడు మాత్రలు మూడు వేదములు, ముగ్గురు దేవతలు, మూడు అగ్నులు, భూః మొదలైన మహావ్యాహృతులే ఏడు లోకములు. వీటితో కలిసిన గాయత్రితో చేసిన హోమము సర్వఫలదాయకము. గాయత్రి మంత్రము మహా వ్యాహృతులు ఇవన్నియు, జపయోగ్యమైన మహామంత్రములు. ఓ రామ! జలములో మునిగి అఘమర్షణ మంత్రమును జపించినచో సర్వపాపములు తొలగును. “అగ్నిమీళే పురోహితం” అనుసూక్తము అగ్ని దేవతాకము. శిరస్సు పై అగ్నిని ధరించి ఒక సంవత్సరము పాటు ఈ సూ క్షమును , జపించుచు హోమము త్రికాల స్నానము హోమము చేయుచు భిక్షాన్నము తినవలెను. ఈ ఋక్కు నకు తరవాత వున్న వాయ్వాది దేవతా సూక్తమును ఏడింటిని నిత్యము నియమ పూర్వకముగా జపించువాడు మనోవాంఛితములను పొందును. మేధకాముడు "సదసస్పతి (ఋ. 1.18-6; ఇత్యాది ఋక్త్రయమును ప్రతిదినము జపించవలెను.

"ఆంబయో యంత్యధ్వభిః” (ఋ. 1-23-18) ఇత్యాది తొమ్మిది ఋక్కులు ఆకాల మృత్యువును తొలగించును. జధుకు గాని, అడ్డుకొన బడిన వాడుగాని, “శునశ్శేపోయమహ్వద్గృభీతః” (ఋ1-24-12) ఇత్యాది ఋక్త్రయమును జపించవలెను. వీటి జపముచే సర్వపాప విముక్తుడగును. రోగి రోగ విముక్తుడగును. శాశ్వతకామముల సిద్ధిని, బుద్ధిమంతు డగు మిత్రుని కోరువాడు “ఇండస్య" ఇత్యాదికములగు పదునారు ఋక్కులను ప్రతి దినము జపించవలెను. "హిరణ్య స్తూప" ఇత్యాది మంత్రమును జపించు వాడు శత్రువులను బాధించును. "ఏతే పంథా" అను మంత్రమును జపించువాడు మార్గమున జేమవంతుడగును. రుద్ర సంబద్ధములగు ఆరు ఋక్కులతో ప్రతిదినము ఈశ్వరుని స్తుతించువాడును రౌద్రచెరువును సమర్పించు వాడును పరమ శాంతిని పొందును. ఉద్వయ నమసః” ఉదుత్యంజాతవేదసం” అను ఋక్కులచే ప్రతి దినం ఆదిత్యుని ఉపస్థానము చెప్పువాడును సూర్యునుద్దేశించి ఏడు జలాంజలులను ఇచ్చువాడును మానసిక దుఃఖ విముక్తుడగును. "ద్విషంతం” ఇత్యాది ఋక్కు మొదలు "యద్వి ప్రా" అను మంత్రము వరకు జపధ్యానములు చేయవలెను. ఇట్లు చేయుటచే అపరాధి ఏడు రాత్రులలో ఇతరుల ద్వేషమునకు పాత్రుడగును. ఆరోగ్యము కోరువాడు, పురీష్యాసోఒగ్నయః” అను ఋక్కును జపించవలెను. శత్రుబాధ నివారణార్థమై ఈ ఋక్కులోని అర్ధ భాగమును జపించవలెను. దీనిని సూర్యోదయ సమయమున జపించినచో దీరాయువు మధ్యాహ్నమున జపించినచో తేజస్సు సూర్యాస్తమయ సమయమున జపించినచో శత్రువినాశము కలుగును. "నవయః" ఇత్యాది సూక్తములను జపించు వాడు శత్రువిజేతయగును. పదకొండు సుపర్ణ సూ క్షములను జపించువాడు సర్వకామములను పొందును. ఆధ్యాత్మికముంగు  ఆను మొదలగు ఋక్కులను జపించువాడు మోక్షమును పొందును.

            “ఆనోళద్రాఃఅను ముక్కను జపించుచే 'ఓర్చాయవు "థ అచునుస్తే హస్తములో నిండు గ్రహిలచి “త్వంఫోమ” ఆనుటకు చదువుచు భక్లపక్షద్వితీయ-చంద్రునివదర్శనము-చేరువలేను, ' ఇట్టే చేయుటచే నిశ్చక యముగ వస్త్రవ5ను ప్లాండను ఉద్ఘాయుర్దాయము కోరువాడు “ఇక్కండి: ఉల్మాడీ-కేతనూక్తమవుదశ్వదాక పిచ ఇషికము వేంచేసినట్లు జాతిగడ్డి తనను పాపమనండి వేరు చేసుకొనును. యాత్రికుడు తవేదసే  ఆను మంగళ మయమగు ఋక్కున మార్గమునందు జపించ వలన సర్వరయ విముక్తుడై మముగ ఇంకకి తిరిగివచ్చును. శ్రీ సుఖముగా ప్రసవించును." ఇడ్రం"  ఇత్యాది ఋక్కు జపీంచుచు ఏడు పర్యాయములు వైశ్వదేవము చేసి పనుమధ్యాహ్న సమయమున “అపశచమం' ప్రభాత కాలమనే వీనిని జపించినచో దుస్వప్నములు నశించును. ప్రముదినే' ఆజ్యహోము చేసినవాడు సమస్త పాపవిముక్తుడగును. ఇమాలి"  "అను ఋ ను ' జపించువాడు సర్వం అన్ని తొమములను పొందును. మూడు దినములు "ఉపవాసము చేసి పవితుడై "మానసోకే ఉమను పంచచు ఉత: సంస్కృతములగ ఉదుంబర సమిధలను హోమము చేసే వాడు మృత్యుపాశములన్నింటిని చీడీ ఈరొకహీనుడగును. రెండుజేయుట వత్తఈ ఋక్కుతో శివుని స్తుతకీద? శిఖ మువేసుకొనిన ఈడు నిప్పంట మునే శకం ప్రోకు అజేయును. "క్షమన సమిధగ్రహించే ప్రతిడినము ముసంధ్యలు దిక్చూచిత్రం దేవాంజీ ఇత్యాదోమతము సూర్యోపస్థానముచే మ పాకం-మనో వాంఛ ధనమును కోందరు కీశ్వప్నే సభ్యుష్యాఅను - యక్కడే ప్రాతఃకాలషధ్యాహ్న అధాహ్నములందు పీచులడే సర్వదుస్వప్నము కళించును. మంచి పూజనోము " లభించును. "ఉభేషునామిరోదసి (అను' కత్రము' 'రాక్షస ఇనోకము "ఉభయాసోజోతవేదః" అది ఋక్కులను జపించు వాడ-మహారధిక ఫలములను పొందను. “తమాగమ్మ సోమరయe అను మంత్రమును జపించువాడు ఆత అయి భయము నుండి -భీమకడగను.

ఇక శృథాస్తవయస: ఆరు ముక్కును జపించువాడు; తన ఇతిలో కేవశత్తను ప్రొదును ఇమంనుసోషం" అను: ఋకును జపింఛువాడు సర్వకామములను పొందును పితుంనస్తోషం లభించున "ఆగ్నేవయసు పఒఅను పరలోకమ్మఉత్తమమార్గమంచును. సుంకమను పర్వదా జపించువాడు వీరమార్గమును పొందును. “కంకతోన కంకతో ఆ సూక్తు విషములను పొగొట్టను. “యోజితః ఏవ ప్రథమో”, అన సూక్తమును జపించువానికి సమస్తమములు లభించును. “గణానాంత్వా" ఆను అను చేయువానికి అన్నము, అజ్వధానమ్. ఈ  సూక్తమాత జపించచ్చే శ్రేష్టమైన జడ పదార్థముల; ఇభించును. "రాజన్అను ఋక్కు దుస్వప్నను అమలశమిమతే నను. మార్గముల్తో ప్రయాణమై వెళ్లుచున్నడు ప్రశస్తుడుగాని అక్షశస్థుడుగానియగు క్షత్రువు కనబ్దడినపుడు కలుగును, ఇరువదిరైండు. ఆధ్యాత్మిక సక్షములను పర్వము  ఆక్కీ ఆడ ఊ అడ అంధునియుషుప్త్యర్వకముగ జ్ఞషించువానికి సమస్త మనోరథమాలు సిల్డించును. "కృణువపాకి జపించు నాడు శత్రువులను సంహరించును. రాక్షసులనుకూడ నశింపచేయును "ప్లరి" ఇత్యాది సూక్తముతో ప్రతిదినము అగ్న్యుపస్థానము చేయువానిని విశ్వతోముఖుడగ'ఆ' స్వ గతిన్ని విపుల నుండియు రక్షించును. "హంసగుచిషత్"  ఇత్యాదీ మంజదువుచు సూరన చూచినచో (కవితుడగనీ. శశాడు

కృషి చేయనున్న వాడు క్షేత్రమధ్యమగ మును యథావిధిగా స్థాలీపాక హోమము చేయవలెను. ఇంద్ర, మరుత్, పర్జన్య, థగులకు, స్వాహాంతముగ హోమము చేయవలెను. కృషీవలుడు నాగలిని లింగ మాను విహరింపచేసినట్లు విహరింప చేయవలెను. ఆ సమయమున “శునాసిరావిమాం” 4.57-5 అను మంత్రమునుకూడ జపించవలెను. పిన్ముట గంధమాల్య నమస్కారాదులతో అచట నున్న ఆధిష్టాన దేవతలను పూజించవలెను. ఇట్లు చేయు ఓ చే విత్తనములు చల్లుట, పంటకోయుట, కళ్లములోనికి తీసుకువచ్చుట మొదలగు కర్మలన్ని యు ఆమోఘముగ జరిగిపోవును. కృషి సర్వదా వృద్ధి పొందును. “సముద్రాద్మూర్మధుమాన్ (4.58-1) అను సూక్త మును జపించుటచే ఆగ్ని నుండి సమస్త కామమును పొందును. “విశ్వానినోదుర్గః” (5-4-9-10) ఇత్యాది ఋగ్వయమును జపించుచు అగ్నిని పూజించువాడు సమస్త ఆపదలును తొలగి అక్షయమగు కీర్తి పొందును. అత్యధికమగు లక్ష్మియు విజయము కూడ ఆతనికి లభించును. “ఆగ్నేత్వం” (5-24-1) అను ఋక్కుచే అగ్నిని స్తుకించువానికి మనోవాంఛిత ధనము లభించును. సంతానము కోరు వాడు మూడు వరుణదేవరా ఋక్కులను నిత్యము జపించవలెను. “స్వస్తినఇంద్రః” (1-89-6.8) మొదలగు మూడు ఋక్కులను సర్వదా ప్రాతః కాలమున జపించినచో అది గొప్ప స్వ స్యయనము. “స్వస్తిపంథామనచరేమ” (5.51-15) అను ఋక్కును చదువుటచే మార్గమున యాత్ర సుఖముగా జరుగును. “విజిహిష్వవనస్పతే” (6-78-5) అను మత్రము జుపించు. చే శత్రువులు రోగ గ్రస్తు గుదురు. గర్భవేదనతో “ధపడు స్త్రీకి గర్భమోక్షణము కలుగును. వర్షము కోరువాడు ఉపవాసముండి తడి బట్టలు ధరించి ఈ అచ్చావద” (5-83) ఇత్యాది సూక్తమును ప్రయోగించినచో వెంటనే వర్షము వచ్చును. పరధనము కోరు వాడు “మనసుకామ” శ్రీ సూక్తం (10) ఇత్యాది మంత్రమును జపించవలెను. సంతారము కోరువాడు పుత్రవ్రతమును అవలంబించి “కర్ధమేన” (శ్రీ సూక్తం 11) అను మంత్రముతో స్నానము చేయవలెను. రాజ్యము కోరువాడు “ఆశ్వ పూర్వాం” (శ్రీసూక్తం 3) అను మంత్రమును జపించుచు స్నానము చేయవలయును. బ్రాహ్మణుడు యథావిధిగా కోహిత చర్మము పైనను క్షత్రియుడు వ్యాఘ్రచర్మము పైవను వైశ్యుడు ఛాగ (మేక) చర్మము పైనను స్నానము చేయవలయును. ఒక్కొక్క మంత్రమునకు పడి వేంచొప్పున హోమములు చేయవలెను. అక్షయ గోధనము కోరువాను గోశాలలో “ఆగావః” (6-28-21) అను ఋక్కును జపించుచు లోకమాతయైవ గోవునకు నమస్కరించి గోచర భూమివరకు దాని వెనుక వెళ్ల వలెను. రాజు “ప” ఇత్యాది ఋక్రయముతో తన దుందుభులను అభిమంత్రించినచో తేజోబలుపన్నుడై శత్రువును వశము చేసుకోనును. దస్యువులు చుట్టుముట్టినప్పుడు చేతిలో తృణము గ్రహించి రక్షమ్న సూక్తమును (10-87) జపించ వలెను. “యేకేచజ్మా” (6-52-15) అను ఋక్కును జపించుటచే దీర్ఘాయువు లభించును. రోజు జీమూత సూక్తముతో సేవాంగములన్నింటినీ వాటి వాటి చిహ్నములనుసరించి అభిమంత్రించినచో యుద్ధమునందు శత్రువులను నశింపచేయకలుగును “ప్రాగ్నయే” (7-5) ఇత్యాది సూక్తత్రయమును జపించుటచే ఆషయధనము లభించును. “అమీవహా” (7-55) ఆను సూక్తము పఠించి రాత్రి భూతముల స్థాపన చేయవలెను. సంకటములందున విషమమునందును దుర్గమస్థలములందును బంధనమునందును బంధయుక్తావస్థయందును పారిపోవునపుడును, పట్టుబడినపుడు సహాయము కోరువాడు ఈ సూక్తమును జపించవలెను. మూడు దినములు నియమపూర్వకముగ ఉపవాసముచేసి పాయసము పండించి “త్ర్యంబకం యజామహే” (7-59-12) అను మంత్రముతో మహాదేవుని ఉద్దేశించి అగ్నిలో నూరు హోమములుచేసి దానితోనే పూర్ణాహుతి ఇచ్చినచో నూరు సంవత్సరములు సుఖముగా జీవించును. దీర్ఘాయువు కోరువాడు స్నానముచేసి “తచ్చతుర్దేవహితం” (7-66-16) అను సూక్తముతో సూర్యుని ఉదయించునపుడును ఆకాశ మధ్యమునందున్నపుడును ఉపస్థానము చేయవలెను. వపాణత్యాది ఋక్చతుష్టయమును పఠించు వాడు భయముక్తుడగును. “ఇంద్రాసోమాతపతం” (7-104) మొదలగు సూక్తము శత్రు వినాశకరము. అజ్ఞానముచే వ్రతభంగమైనను వ్రాత్యుని సంసర్గముచే పతితుడై నను ఉపవాసముచేసి “త్వమగ్నేవ్రతపా” (8-11-1) అను ఋక్కుతో ఆజ్య హోమము చేయవలెను. “ఆదిత్య” “సమాజా” అను రెండు ఋక్కులను జపించు వారు వాదమునందు విజయము పొందును. మహీ ఇత్యాది ఋశ్చతుష్టయమును జపించుటచే మహాభయ విముక్తుడగును. “యది” ఇత్యాది ఋక్కును జపించుటచే సర్వకామసిద్ధి కలుగును. ఇంద్రునికి సంబంధించిన నలుబది రెండు ఋక్కులను జపించుటచే శత్రువులు నశింతురు. “వాచం మహి” అను ఋక్కును జపించుటచే ఆరోగ్యము లభించును. పవిత్రుడిగా వుండి “శంనోభవ” (8-48-4-5) అను రెండు ఋక్కులను జపించుచు భోజనము చేసి హృదయమును హస్తము స్పృశించు వాడు ఎన్నడును వ్యాధిగ్రస్తుడుకాడు స్నానముచేసి “ఉతమేదం” అను వుంత్రముతో హోమముచేయువాడు శత్రువులను సంహరించును. “శంనోఅగ్ని” (7-35) అను సూక్తముతో హోమము చేసినవాడు ధనవంతుడగును. “కన్యా వాఖాయతి” (8-91) అను సూక్తము జపి. చుటచే దిగ్భ్రమరోషము తొలగిపోవును.

సూర్యోదయ సమయమున “యదద్యకచ్చ” (8-93-4) ఆను ఋక్కును జపించుటచే సకల జగత్తు వశమగును. “యద్వాక్” (8-100-10) ఇత్యాది ఋక్కును జపించుటచే వాక్కు సంస్కృతమగును. “వాచోవిదాం” (8-101-16)  అను మంత్రమును జపించువాడు వాక్శక్తిని పొందును. పావమానీ ఋక్కులును వైఖానస ఋక్కులు ముప్పదియు, అతి పవిత్రమైనవి. ఓ ఋషి శ్రేష్ఠా! “పరస్య” మొదలగు ఆరువదిరెండు ఋక్కులుకూడ అతి పవిత్రమైనవి “స్వాదిష్ట్యా” మొదలగు అరువదిఏడు సూక్తములు సర్వ కల్మషములను నశింపచేయును, పవిత్రింపచేయును మంగలముకిల్గించును. “పావమానీ” ఋక్కులు ఆరువందలపది వున్నవి. వీటిని జపించువాడును, హోమము-చేయువాడును మృత్యుభయమును జయించును. పాప భయ వినాశము కోరువాడు “ఆపోహిష్ఠాః” (10-9-1-3) ఇత్యాది ఋక్కులను నీటిలో నిలబడి జపించవలేను. ఎడారిలో ప్రాణాంతకభయము ఏర్పడినపుడు నియమపూర్వకముగ “ప్రదేవత్రా బహ్మణే” (10-30-1) ఆను మంత్రమును జపించు వాడు భయవిముక్తుడై దీర్ఘాయువును పొందును. “ప్రావేపా” (10–34-1) అను ఋక్కును సూర్గ్యోదయ సమయమున మనసా జపించవలెను. దీనివలన ద్యూతమున విజయము లభించును. “మాప్రగాను” (10-57-1) అను ఋక్కుతూ జపించు టచే దారితప్పినవాడు సరియైన దారిని పొందును తన ప్రియమిత్రుని అయర్దాయము. క్షిణమైనచో “యత్తేయమం” (1-58-1) అను మంత్రమును జపించుచు వాని శిరస్సును స్పృశించవలెను. ఇద్దు దినములు 1000 పర్యాయము లు ఈ విధముగ చేయుటచే ఆతనికి దీర్ఘాయువు లభించును. “ఇదమిత్థారౌద్రం” (10-61-1) అను ఋక్కుతో వైయ్యి ఆజ్య హోమములు చేయవలెను. పశముడు గోళాలయందును, ధనకాముడు చతుష్పథమునందును చేయవలేను. “వయఃసుపర్ణా” అను ఋక్కు జపించువానికి లక్ష్మి లభించును. “హవిష్యన్తం” (10-88-1) అను మంత్రమును జపించువాడు పాపవిముక్తుడగును. ఆతని రోగములు నశించును. జఠరాగ్ని వృద్ధిపొందును. స్వస్త్యయనకరమగు యాఓషధయః. అను మంత్రము సర్వవ్యాధివినాశకము వృష్టికాముడు “బృహస్పతే అతి” (3-28-15) అను మంత్రమును ప్రయోగించవలెను ‘సర్వత్ర’ ఇత్యాది మంత్రముచే గొప్ప శాంతిలభించును సంతానకాము కుసాంకశ్య సూక్తజవము మంచిది. “ఆష్ఫూరద్రేభిః వసుభిః” (10-125-1) అను ఋక్కు జపించువాడు ప్రవచనమునందు సమర్థుడగును “రాత్రీత్యఖ్యదాయతి” (10-127-1) అను మంత్రమును జపించువానికి పునర్జన్మ వుండదు రాత్రియందు “రాత్రిసూక్తము” నుజపించువారు రాత్రినీ సుఖముగా గడుపును. “కల్పయంతీ” ఇత్యాది మంత్రమును జపించు శత్రువినాశకుడిగను. కోడాయణ సూక్తములిగోప్ప ఆయుర్దాయమును, తేజస్సును ఇచ్చును. “ఉతదేవాః” (10-137-1) అను మంత్రము రోగనాశకమం దీనిని ప్రతధారణ పూర్వకముగ జపించవలేను. అగ్ని థయము కలిగినపుడు “ఆయమగ్నేజరితా” (10-142-1), ఉత్యాది మంత్రమును జపించవలెను. అరణ్యములలో “అర డ్యాన్య రణ్యాని” (10-146–1) అను మంత్రము జపించుటచేథయము తొలగును. “బ్రాహ్మిణి” తీసుకొని బ్రహ్మసంబంధమైన రెండు సూక్తములను జపించవలెను. బ్రాహ్మీలతను శతావరీలతను. వేర్లు వేరుగ ఉదకముతోగాని, మృతముతో గాని, తీసుకున్నచో మేధాలక్ష్ములు లభించును. “శాశఇత్థా” (10-152-1) అను ఋక్కుశత్రువినాశకము. యుద్దమున విజయము కోరువాడు దీనిని జపించవలెను “బ్రహ్మణాగ్నిః” (10-162-1) అను ఋక్కు గర్భమృత్యునివారకము.

పవిత్రుడై “ఆపేహి” (10-164) అమ సూక్తమును జపించినచో దుస్వప్నములు నశించును. “యేనేడం” ఇత్యాది ఋక్కును జపించుటచే సమాధిస్థుడగును “మయోర్భూర్వాత” (10-169-1) అను గోవునకు మంగళకరమగు ఋక్కుచే ఇంద్రజాలమా నూతి శాంబరీమానుకొని, జయించవచ్చును. “మహిత్రీణాం” (10-185-1) అను కళ్యాణ కరమగు ఋక్కును మార్గమునందు జపించవలెమ. “ప్రాగ్నయే” (10-187-1) అను మంత్రమును జపించుటచే ద్వేష పాత్రుడగు శత్రువు వశించును. “వాస్తోష్పతే” మొదలైన నాలుగు మంత్రములతో గృహదేవతలను పూజించవలెను. ఇంత వరకు జపవిధానము చెప్పబడినది. ఇపుడు హోమ విధానమును తెలుసుకొనవలెను. హోమాంతమున దక్షిణ ఇవ్వవలెను. హోమముచే పోపశాంతి, అన్నముచే హోమశాంతి సువర్ణదానముచే ఆన్నశాంతి కలుగును. బ్రాహ్మణ ఆశీస్సులు ఎన్నడును వర్థమాకావు యజమానుడు అన్నివైపుల బయట స్నానము చేయవలయును. తెల్ల ఆవాలు, యవలు, ధాన్యము, పాలు, నెయ్యి, పెరుగు, పాలచెట్ల సమిధలు, వీటితో హోమము చేయుట సర్వకామప్రదము. ఆభిచార ప్రయోగమున ముళ్ళతోకూడిన సమిధలు, రాజికలు, రక్తము, విషము, హోమము చేయవలయును. హోమసమయమున శిలోంఛవృత్తులచే లభించిన అగ్నమున, సక్తవుల పాలు, పెరుగు, ఫలమూలములు భుజించవలెను. ఇంతవరకు ఋగ్విధానము చెప్పబడినది.

ఆగ్ని మహాపురాణమునందు బుగ్విధానమను రెండువందల యేబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.