అగ్ని మహా పురాణము
104 - అథ ప్రాసాదలక్షణమ్.
పరమేశ్వరుడు పలికెను; మయూరధ్వజా! ఇపుడు. ప్రాసాద్ధసామాన్యలక్షణము చెప్పెదను, చతురశ్ర క్షేత్రమును నాలుగు భాగములు చేయగా, గోడల విస్తారము. ఒక భాగ మండవలెను, మధ్యభాగము; గర్భము - ఒక థాగమున పిండిక ఉండవలెను. ఐదు భాగముల వేత్రము లోపలి భాగమున పిండిక ఉండవలెను. ఒక భాగము విస్తోరమ కాళీగా ఉండవలెను. ఒక భాగము విస్తారము గోడలకొరకు ఉపయోగించవలెను. మధ్యమగర్భమునందు రెండు భాగములు, జ్యేష్ఠగర్భమునందు కూడ రెండు భాగములు ఉండవలెను. కాని-మూడుభాగములలో కనిషగర్భమ, మిగిలిన ఎనిమిదవ భాగము గోడలు అను పద్ధతి కూడ ఉన్నది. క్షేత్రమును ఆరు భాగములుగా విభజించినపుడు ఒక భాగము విస్తారము గర్భము కొరకను, రెండు భాగములు - పిండిక కొరకును వినియోగింపబడును. గోడల ఎత్తు వెడల్పుకండి. రెట్టింపు గాని, రెండును పావును ఆధికము గాని, రెండున్నర రెట్లుగాని, మూడు రెట్లు గాని ఉండు పద్దతి కూడ కనబడు చున్నది. కొన్ని చోట్ల ప్రాసాదముచుట్టు గోడల సగము లేదా మూడు వంతుల వైశాల్యము గల జగతి నాల్గవ వంత విస్తారము గల నేమి కానపచ్చు చున్నది. మధ్యయందు మూడవ వంతు పరిధి ఉండును. అచట రథము నిర్మించి దానిపై చాముండభైరవుని, నాటేశుని స్థాపించవలెను. ప్రాసాదము సగమ విస్తారములో నాల్గు వైపులందును, వెలుపల, దేవతల కొరకై, ఎనిమిది. లేదా నాలుగు పరిశ్రమలు ఏర్పరుపవలెను. ప్రాసాదాదులందు వీటి నిర్మాణము ఇచ్ఛాధీనము. పర్వదిక్కునందు ఆదిత్యులను, వాయవ్యమున స్కంద-ఆగ్నులను, యమాడిదేవతలను వారి వారి దిక్కులందున స్థాపించవలెను. శిఖరమును వాలుగు భాగములుగ చేయగా క్రింది రెండు భాగములకు “తకవాసిక' అని పేరు. మూడవ భాగమున వేది ప్రతిష్ట, దాని ముందు భాగము ‘అమలసారము' అని ప్రసిద్ద మైన కంఠము. మేరుశిఖరముపై వై రాజము, పుష్పకము, కైలాసము, మణికము, త్రివిష్టపము ఆను ఐదు ప్రాసాదములు మాత్రమే ఉన్నవి. వీటిలో మొదటి దైవ వైరాజము చతురస్రము. పుష్పకము. చతురస్రాయతము. కైలాసము వృత్తాకారము. మణికము వృత్తాయతము. త్రివిష్టపము అష్టకోణాకారము వీటిలో ఒక్కొక్క దానికి తొమ్మిదేసి భేదము లుండుటచే మొత్తము నలుబదియైడు భేదము లగును.
మేరువు, మందరము, విమానము, భద్రము, సర్వతోభద్రము, రుచకము, నందకపరు, . వర్ధమానము, నంది, శ్రీవత్సము అను తొమ్మిది ప్రాసాదములు వేరాజకులమునకు సంబంధించినవి. వలభి, గృహరాజము, అలాగృహము, మందిరము, విశాలచమసము, బ్రహ్మమందిరము, భువనము, ప్రభవము, శివివేళ్మ అన తొమ్మిది ప్రాసాదములు - పుష్పకకలమునకు సంబంధించినవి. వలయము, దుందుభి, పద్మము, “మహాపద్మము, వర్దని, ఉజ్జీవము, శంఖము, కలశము, ఖవృక్షము అను తొమ్మిది వృత్తాకార ప్రాసాదములు కైలాసకులమునం దుత్పన్న మైనవి. గజమా, వృషభము, హంసము, గరుత్మంతము, ఋక్షనాయకము, భూషణము, భూధరము, శ్రీజయము, పృథ్వీధరము అను తొమ్మిది వృత్తాయతప్రాసాదములు మణికము నుండి ఆవిర్భవించినవి. వజ్రము, చక్రము, స్వస్తికము, వజస్వస్తికము, చిత్రము, స్వస్తికఖడ్గము, గద, శ్రీకంఠము, విజయము అను తొమ్మిది ప్రాసాదములు త్రివిష్టపము నుండి ఆవిర్భవించినవి. నగరములకు కూడ ఇవే పేర్లు, లాటాదులకు కూడ ఈ సంజ్ఞలే. చూలము శిఖరకంత ప్రమాణములో సగ ముండవలెను. దాని లావు కంఠము లావులో మూడవ వంతు ఉండవలెను. వేదిని పది భాగమలు చేసి ఐదు భాగములతో స్కంధవిస్తారముమ, మూడు భాగములతో కంఠమును, నాలుగు భాగములతో దాని ఆండమును నిర్మించవలెను. ద్వారములు పూర్వాదిదిక్కులందు ఉంచవలెను గాని విదిశలయందుంచరాదు. పిండికా విస్తారము కోణమువరకును వెళ్ళవలెను. మధ్యభాగము దగ్గర దాని సమాప్తి కావలెను.
కొన్నింట ద్వారముల ఎత్తు గర్భము నాల్గవ భాగముకంటె గాని, ఐదవ భాగముకంటె గాని రెట్టింపు ఉండునట్లు ఉంచవలెను. లేదా మరొకవిధముగ కూడ చేయవచ్చును. నూట అరవై అంగుళముల ఎత్తునుండి పదేసి ఆంగుళములు తగ్గించుచు నిర్మించిన నాలుగు ద్వారములు ఉత్తమము అని చెప్పబడినవి. నూట ఇరువది, నూటపది, నూరు అంగుళముల ఎత్తు ద్వారములు మధ్యమములు. తొంబది, ఎనుబది, డెబ్బది అంగుళముల ఎత్తు ద్వారములు కనిష్టములు, ద్వారము వెడల్పు పోడవులో సగ ముండవలెను. ఎత్తు చెప్పినదానికంటె, మూడు, నాలుగు, ఎనిమిది లేదా పది అంగుళములు -కూడ ఉన్నను కథప్రదమే. విస్తారము ఎత్తులో నాల్గవ వంతు ఉండవలెను. ద్వారశాఖల (ప్రక్కకమ్ముల), వెడల్పు లేదా మొత్తము అన్ని కమ్ముల వెడల్పు ద్వారము వెడల్పులో నాల్గవవంతు ఉండవలెను. మూడు, ఐదు, ఏడు లేదా తొమ్మిది ఐతో నిర్మించిన ద్వారము అభీష్టఫలముల నిచ్చును, క్రింది శాఖ నాల్గవభాగము పై -ద్వారపాలులను స్థాపించవలెను. మిగిలిష్ణ, శాఖలను స్త్రీపురుషమిథునము ఆకారములతో అలంకరించవలెను. ద్వారమునకు ఎదురుగా స్తంభము వచ్చినచో సంభవేధ దోషము. దానివలన గృహస్వామి దాసు డగును, వృక్షముచే వేధ యైనచో ఐశ్వర్యనాశనము. కూపవేధ వలన భయప్రాప్తి, క్షేత్రవేధచే ధనహాని కలుగును. ప్రాసాద గృహ శాలాదుల మార్గముచే ద్వార వేధ కలిగినచో బంధనము, సభచేవేధ ఏర్పడి, నచో దారిద్ర్యము, వర్ణవేధచే తిరస్కారము, ఉలూఖలవేధచే దారిద్ర్యము, శిలావేధచే శత్రుత్వము, ఛాయావేధచే నిర్ధవత ప్రాప్తించును. వీటి నన్నింటిని ఖండించివేసినను, పెకలించినను వేధదోష ముండదు. వీటిమధ్య ప్రాకారము కట్టించినను దోషముండదు. ఈ వస్తువులు సరిహద్దునుడి రెట్టింపు దూరమునం దున్నను వేధదోష ముండదు.
అగ్ని మహాపురాణమునందు సామాన్యప్రాసాదలక్షణవర్ణనమను నూటనాల్గవ అధ్యాయము సమాప్తము.
