అగ్ని మహా పురాణము
292 - అథ గవాయు ర్వేదః
ధన్వన్తరి రువాచః
ధన్వంతరి చెప్పెను. రాజు గోవులను బ్రాహ్మణులను పాలించవలెను. ఇపుడు గోశాంతిని చెప్పెదను. గోవులు పవిత్రమైనవి మంగళ ప్రదమైనవి. లోకము లన్నియు గోవులలో ప్రతిష్ఠితములై యున్నవి. గోమయము గోమూత్రము, అలక్ష్మీ నాశకములు. వాటి శరీరమును గోకుట, కొమ్ముల మర్దించు, నీళ్ళు త్రాగించుట ఇవి కూడ అలక్ష్మీ నివారకములు. గోమూత్రము గోమయము, క్షీరము, దధి, ఘృతము, గోరోచన, ఇవి ఆరును సేవించుటకు ఉత్తమమైనవి దుస్స్వప్నాదలను తొలగించును. గోరోచన విషమును రాక్షసులను నశింప చేయును. గోవునకు గ్రాసమిచ్చు వాడు స్వర్గమును పొందును. ఎవని యింటిలో గోవులు దుఃఖించు చుండునో, ఆతడు నరకమునకు పోవును. ఇతరుల గోవుకు గ్రాసము నిచ్చువాడు స్వర్గమును పొందును. గోహితము కోరువాడు, బ్రహ్మ లోకమును పొందును. గోదానము, గోమాహాత్మ్య కీర్తనము, గోరక్షణము చేసిన వాడు తన కులమును ఉద్దరించును. గోవుల శ్వాస తగిలి భూమి పవిత్ర మగును. వాటి స్పర్శచే పాపములు నశించును. ఒక దివమున గోమూత్ర గోమయ, క్షీర, దధి, మృత, కుశోదకములను, ఉపవాసము చేసినచో చండాలుడు కూడ పరిశుద్దుడగును. పూర్వము దేవతలు కూడ అశుభము లన్నింటిని తొలగించు కొనుటకు ఈ విధ ముగ చేసిరి. పైన వస్తువులను వేరువేరుగా మూడేసి రోజులు భక్షించినచో దానికి “మహాసాంతపన” వ్రతము యని పేరు. ఇది సర్వ కొమములను సిద్ధిప చేసి పాపములను తొలగించును. పాలు మాత్రము త్రాగి ఇరువది యొక్క దినములున్నచో అని కృచ్చ్రని వ్రతము. దీనినాచరించిన నరోత్తములు పాపరహితులై సర్వ కామములను పొంది స్వర్గమునకు పోవుదురు. మూడు దినములు ఉష్ణ గోమూత్రమును, మూడు దినములు ఉష్ణఘృతమును, మూడు దినములు ఉష్ణ క్షీరమును, పిదప మూడు దినములు వాయువును మాత్రము భక్షించుటకు తప్త కృచ్చ్ర వ్రతమని పేరు. ఇది సమస్త పాపములను తొలగించి బ్రహ్మ లోకమును ఇచ్చును. ఈ వస్తువులను చల్లగా చేసి, భుజించినచో దానికి శీతకృచ్చ్ర మని పేరు. బ్రహ్మ చెప్పిన ఈ వ్రతము బ్రహ్మ లోక ప్రదము.
ఒక మాసము గోమూత్రముతో స్నానము చేయుచు గోరసము పై జీవించుచు, గోవులను అనుసరించుచు, అవి భుజించిన పిమ్మట భుజించవలయును జట్లు గోవ్రతముచేసిన వాడు పాపరహితుడై గో లోకమును చేరును. గోమతీ విద్యా జపముచేత కూడ గోలోకము లభించును. ఆ లోకము నందు మానవుడు విమానమున ఆప్సర సరితో కలసి. నృత్య గీత ములతో సేవింపబడుచు ఆనందించును. గోవులు సురభి స్వరూపములు గగ్గులు గంధము కలవి అవి సమస్త ప్రాణులకు ఆధార భూతములు. పరమ మంగళ మయములు. గోవులే శ్రేష్ఠమైన యన్నముగను ఉత్తమ హవిస్సు గను దేవతలకు ఉపకరించును. అవి సకల ప్రాణు: ను పవిత్రింప చేయు మూత్ర క్షీరాదికమును గ్రహించి వాటిని స్రవించు చుండును. మంత్ర పూత మగు హవిస్సుతో స్వర్గము నందున్న దేవతలను తృప్తి పరచును, ఋషులు తమ అగ్ని హోత్రము లందు గోవులను హోమము నందు ఉపయోగింతురు. సమస్త భూతములకును గోవులు ఉత్తమ శరణము. గోవు-> చాల పవిత్ర మైనవి, మంగళకరమైనవి. స్వర్గ సోపానములు, ధన్యములు, సనాతనములు సురభి కుమార్తెలగు లక్ష్మీ ప్రదములైన గోవులకు నమస్కారము. బ్రహ్మసుతులకు, నషస్కారము. ఒకే కులము బ్రాహ్మణులు, గోవులు యని రెండు విధము లుగా చేయబడినది. ఒక దాని యందు మంత్రములు, మరియొక దాని యందు హవిస్సు ఆధారపడి యున్నవి. ఈ జగ తంతయు దేవ, . బ్రాహ్మణ, గోసాధు, పతివతల పై నిలిచి యున్నది. . ఆందుచే వారందరును పూజ్యతములు. గోవులు వీరు త్రాగు స్థానము తీర్థము. గంగా దినదులు గోస్వరూపములు. గోమాహాత్మ్యమును చెప్పితిని. ఇపుడు వాటి చికి త్సను వినుము.
కొమ్ములకు రోగము వచ్చునపుడు శృంగ వేర బలా మాసి, కల్కముతో సిద్ధము చేయబడిన సైంధవము చేర్చిన తైలమును తేనె కలిపి ఉపయోగించవలయును. కర్ణరోగమునందు మంజిష్ఠా హింగు, సైంధవములతో సిద్ధమగు- తైలం మును ఉపయోగించవలయును లేదా వెల్లుల్లి వేసి కాచిన తై లము ఉపయోగించవలయును. దంత శూలమునందు బిల్వమూల అపామార్గధాతకీ, పాటల. కుటజముల లేపము చేయవలయును. ఇవి దంతశూలమును పోగొట్టును. దంతశూలమును హరించు ద్రవ్యములను ఘృతమునందు ఉడికించి ఇచ్చినచో ముఖరోగమును తొలగించును. జిహ్వారోగములందు సైంధవము ప్రశస్తము. గల గ్రహరోగమున శుంఠి ద్వివిధ హరిద్ర, త్రిఘ, మంచిది. హృద్రోగ వస్తిరోగ, పాతరోగ క్షయరోగములందు, గోవులకు ఘృతమిశ్ర త్రిఫలాను పానము ప్రశస్తము. అతిసారమున ద్వివిధ హరిద్ర పాఠ ఇవ్వవలెను. అన్ని విధముల కోష్టరోగములందును. ఇతరావయవ రోగములందును కాసశ్వాసాది సాధారణరోగము లందును. శుతి బారంగీలను ఇవ్వవలెను. విరిగిన ఎముక అతుకులకు లవణ యుక్తమగు ప్రియంగువును. పూయ వలయును. తైలము వాతరోగముహరించు పిత్త రోగమున తైరిపక్వమగు మధు యష్టిని, కఫరోగమున మధు సహిత యోషమును, రక్త వికారమున దృఢమైన నఖమూల భస్మము హితకరములు. భగ్న క్షతమునందు తైల మృతములందు వేయించిన హరితాళము ఇవ్వవలెను. మాషములు తిలలు, గోధుమలు. పాలు, మృతము, వీటిని లవణము కలిపి పిండముగా చేసి, లేగ దూడలకు ఇచ్చినచో, పుష్టి కలుగును. విషాణి బలప్రవము, గ్రహ భాధనివృత్తికి ధూపమును ప్రయోగించవలయును. గ్రహజనిత రోగ నివృత్తి కి, దేవదారు వచా' మాంసీ, గగ్గులు, హింగు, సర్షపముల ధూపము హితకరము ఈ ధూపమువేసిన ఘంట గోవుల కంఠమునందు కట్టవలయును అశ్వగంధ తిలలతో నవనీత భక్షణము చేయించుటచే ఆవుపాల నిచ్చును. ఇంటిలో మదమత్తమగు వృషభమునకు తెలక పిండి ఉత్తమమైన రసాయనము.
అగ్ని రువాచః
శాంతికొదకై పంచమినాడు గోపురీషముపై లక్ష్మిని వాసుదేవుని, గంధాదులతో పూజించవలయును. దీనికి అపరాశాంతియని పేరు. ఆశ్వీయుజ, శుక్ల పూర్ణిమనాడు, శ్రీహరిని పూజించవలయును. హరిరుద్ర బ్రహ్మ సూర్య అగ్ని లక్ష్ములను ఘృతముతో పూజించవలయును. దధితిని గోవులను పూజించి అగ్ని ప్రదక్షిణము చేయవలయును. గృహ బహిర్భాగమువ గీతవాద్య ధ్వనులతో వృషభ యుద్ధమును ఏర్పరచవలయును. గోవులకు లవణమును బ్రాహ్మణు లకు దక్షిణలను ఇవ్వవలెను. మకరసంక్రాంత్యాది పర్వములందు లక్ష్మి సహితుడగు శ్రీ మహా విష్ణువును స్థండిలము పై నిర్మించిన పద్మ మధ్యమున పూజించవలయును. దిక్కులందు కవుల కేసర ముల పై దేవతలను పూజించవలయును. కమల బహిర్భాగమున మంగలమయులగు బ్రహ్మసూర్య, బహురూప, బలిఆ కాళ, విశ్వరూపులను రుద్దిసిద్దిశాంతి, రోహిణ్యాది దిగ్గేసువులను చంద్రశివులను, పులగముతో పూజించవలయును, కలశ సపద్మపత్రములపై దిక్పాలురను పూజించవలయును. అగ్నియందు సర్షప, ఆక్షత, తండుల, క్షీరవృక్ష సమిధలను హోమముచేసి బ్రాహ్మణులకు సూరేసిసువర్ణములను కంచు మొదలగు దానిని దానము చేయవలయము. పిదప క్షీరాదులతో గూపిన గోవులను పూజించి శాంతి నిమిత్తమై వాటిని విడువలయును. అగ్ని దేవుడు పలికెను. శాలిహోత్రుడు సుశ్రుతునకు ఆశ్వ ఆయుర్వేదమును పాలకాప్యుడు అంగరాజునకు గజాయ్వరేదమును ఉపదేశించెను.
అగ్ని మహాపురాణమున గవాయుర్వేద కథనమను రెండవందల తొంబది రెండవ అధ్యాయము సమాప్తము.
