అగ్ని మహా పురాణము

Table of Contents

309 - అథ త్వరితా పూజా

ఆగ్ని రువాచః

అగ్ని దేవుడు పలికెను. త్వరితవిద్య యొక్క ఆంగములు భుక్తి ముక్తి ప్రదాయకములు వాటిని చేప్పెదను. ఓం ఆధారశ క్ర్యైనమః" మొదలు "ఆస్త్రాయ ఫట్ నమః" వరకును చెప్పినవి అంగన్యాస మంత్రములు. “ఓంత్వరితా విద్యాం" మొదలు "ప్రచోదయాత్" వరకు త్వరితాగాయత్రి, పిదప పీఠమునందలి కమల కర్ణికయొక్క కేసరమునందు ఈ క్రింది ఆంగదేవతలను పూజించవలెను. - ప్రణీతాయైనమః" మొదలు “క్షేమంకర్యైనమః" వరకు మంత్రములతో ఆయా అంగ దేవతలను పూజించవలెను. త్వరితా విద్యకు తోతలా, త్వరితా తూర్ణాయని మూడు పేర్లు. దీని ఆక్షరము లను శిరోభ్రూలలాట కంఠ హృదయ, నాలి, గుహ్య ఊరు, జాను. జంఘా, చరణములపై న్యాసము చేసి సమస్త విద్యతో వ్యాపకన్యాసము చేయవలెను. ఈమెను పార్వతి శబరి ఈశ , వరదా భయహస్తికా, మయూరవలయా పిచ్చ మౌళి, కిసల యాంతుక, సింహాసనస్థ మయూరబరచ్చ తసమన్విత, త్రినేత శ్యామల, దేవి, వనమూలావిభూషణ, విప్రా కర్ణాభరణ, క్షత్రకేయూరరూషణ, వైశ్యవాగ కటిబంధ, వృషలాహికృత నూపుర యను రూపమున ధ్యానించి పదివేలు జపము చేయవలెను. ఈశ్వరుడు కిరాత రూపుడైనపుడు గౌరి ఆరూపమును ధరించినది. ఈదేవిని జపించి ధ్యానముచేసి పూజించినచో సర్వసిద్ధులు లభించును. విషాదులు తొలగిపోవును. పూర్వా దళములలోపల కర్ణికయందు ఎనిమిది సింహాసనముల పై ఈ దేవతలను క్రమముగా పూజించవలెను. హృదయాది ఆంగషట్కముతో కూడిన గాయత్రి ప్రణీతలను పూజించవలెను. పూర్వాది దళిములందు హుంకారాదులను పూజించవలెను. దశాగ్రభాగ మున దేవీ సమ్ముఖ మున ఫటారిని పూజించవలెను. శ్రీ బీజముతో పూజించవలెను. హుంకారి మొదలగు వారి ఆయుధ వర్ణాదులు ఆయా దిక్కుల దిక్పాలకుల ఆయుధ వర్ణాదులతో సమానములు. ఫటా మాత్రము ధనుర్బాణమును ధరించి యుండును. మండ ద్వారమున జయా విజయలను పూజించవలెను. వారు సువర్ణయష్టి ధరించి యుందురు. వారికి బయట బర్బరి; యను. కింకరిని పూజించవలెను. ఆమె ముడితమస్తక యై కర్ర ధరించి యుండును. పిదప హోమద్రవ్యము తో యోన్యాకృతి యగు కుండ మన హోమము చేయవలయును. తెల్లని ధాన్యమును హోమము చేసినచో సువర్ణము గోధూమం చేత పుష్టి సంప. దలు. యవ ధాన్య తిలల చే సర్వసిద్ది ఈ తినాశనములు కల్గును. అ.క్షములతో హోమము చేసినచో శత్రువుకు ఉప్మాదము త్వరితామంత్రాది శాల్మలీ బీజములచే మారణము, జంబూ ఫలములచే ధనధాన్య ప్రాప్తి, నీలోత్పలముంచే తుష్టి "రక్తాత్పలములచే మహాపుష్టి, కందములచే అభ్యుదయము కలుగును, మల్లికా పుష్పములు హోమము చేసినచో నగరమున క్షోభ కలుగును. కుముదము లచే జనప్రియత్వము లభించును. అశోక కుసుమములచే పుత్రప్రాప్తి, పాటలా పుష్పములచే ఉత్తమాంగనా ప్రాప్తి , ఆమ్ర ఫలములచే, ఆయుర్దాయము, తిలలచే లక్ష్మి, బిల్వలచే ఐశ్వర్యము, చంపకములచే ధనము, కలుగును. మధుక పుష్ప బిల్వ ఫలములు కలిపి హోమము చేసినచో సర్వజ్ఞత్వము లభించును. త్వరితా మంత్రము మూడు లక్షలజపము, హోమ ధ్యాన పూజలు చేసినచో ఆభిలషిత ఫలము లభించును. మండలములపై త్వరితా దేవిని అర్చించి త్వరితా గాయత్రితో ఏబది హోమములు ఇవ్వవలెను. పిదప మూలమంత్రమతో పల్లవములు మూడు వందలు హోమములు చేసి దీశాగ్రహణము చేయ వలయును. దీక్షకు పూర్వము పంచగవ్య ప్రాశన చేయవలెను. దీక్షా సమయమున చెరువు మాత్రమే భుజించవలయును.

ఆగ్ని మహాపురాణమున త్వరిత పూజా విధివర్ణనమను మూడు వందల తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.