అగ్ని మహా పురాణము
178 - అథ తృతీయావ్రతాని.
ఆగ్ని రువాచః-
అగ్ని దేవుడు చెప్పెను. ఇపుడు భుక్తి ముక్తి ప్రడము లగు తృతీయా వ్రతములను చెప్పెదను. లలితాతృతీయ నాడు చేయు మూల గౌరీ వ్రతమును వినుము. పరమేశ్వరుడు చైత్ర శుక్ల తృతీయ దివసమున పార్వతిని వివాహ మాడెమ. అందుచే ఆ దివసమున తిలమిశ్ర జలముతో స్నానమాచరించి. పార్వతీసమేతుడగు పరమేశ్వరుని బంగారము, ఫలములు మొదలగు వాటితో పూజించవలేను. నమోస్తు పాటలాయే అని చెప్పి పార్వతి పాదములను, శంకరుని పాదములను వూజించవలేను. శివాయ నమః అని శివుని, జయాయై నమః అని పార్వతిని అర్చించవలెను. త్రిపురఘ్నాయ నమః “భవాన్యై నమః” అని చెప్పుచు క్రమముగా శివపార్వతుల జమలను పూజించవలెను. “రుద్రేశ్వరాయ నమః “విజయాయై నమః” అని చెప్పుచు శివపార్వతుల మోకాళ్ళు పూజించవలెను. “ఈశాయై నమః” “శంకరాయ నమః” ఆని చెప్పుచు వరుసగా పార్వతీ శివుల కటి భాగమును, “కో రవ్యై నమః “ “శూలపాణయే నమః” అని చెప్పుచు కుక్షి ప్రదేశములను, “మజ్గలాయై నమః” “తుభ్యం నమః” అని చెప్పుచు వారి ఉదరమును పూజించవలెను. “సర్వాత్మనే నమః” “ఈశాన్యై నమః” అని చెప్పుచు వరుసగా శివపార్వతుల స్తములను, దేవాత్మనే నమః” “ప్రోదిన్యై నమః” అని చెప్పుచు కంఠప్రదేశ మును, “మహాదేవాయ నమః” అనన్తాయై నమః” అని హస్తములను, “త్రిలోచనాయ నమః” “కాలానల ప్రియాయై నమః” అని భుజములను, “మహేశాయ నమః”, “సౌభాగ్యాయై నమః” అని వారి ఆలంకారము లను పూజించవలెను. పిదప “అశోక మధువాసిన్యై నమః” “ఈశ్వరాయ నమః” అని చెప్పుచు వరుసగా పార్వతీ పరమేశ్వరుల ఓష్ఠములను, “చతుర్ముఖ ప్రియాయై నమః” “హరాయ స్థాణవే నమః” అని ముఖములను పూజించవలేను. “అర్ధనారీశాయ నమః” “అమితాజ్ఞాయై నమః” అని వరుసగ శివపార్వతుల నాసికలను, “ఉగ్రాయ నమః” “లలితాయై నమః” అని కనుబొమ్మలను పూజించవలెను.
“శిర్వాయ నమః” “వాసన్యై నమః” అని చెప్పుచు వరుసగ శివపార్వతుల తాలుప్రదేశమును పూజించవలెను. “శ్రీకణనాధాయై నమః” “శితిక జ్ఞాయ నమః” అని చెప్పుచు వరుసగా పార్వతీ పరమేశ్వరుల కేశపాశములను పూజించవలెను. “భీమోగ్రాయ నమః” “సురూపియ్యై నమః” అని చెప్పుచు శివపార్వతుల శిరస్సులను పూజించవలెను. “సర్వాత్మనే నమః” అని చెప్పి పూజను ఉపసంహరించవలెను. చైత్రము మొదలు పండ్రెండు మాసములందు వరుసగా మల్లిక, అశోకము, కమలము, కుందము, తగరము, మాలతి, కదంబము, కరవీరము, బాణము, ఆమ్లానము, కుంకు మము, సిందువారము - ఈ పుష్పములతో శివపూజ చేయవలెను. ఉమామహేశ్వర పూజానంతరము వారి ఎదుట - మృతమిశ్ర నిష్పావము, కుసుంభము దుగ్దము, జీవకము, దూర్వలు, చెరకు కర్ర, ఉప్పు, కొత్తిమిరి అను ఎని మిది సౌభాగ్యద్రవ్యములను ఉంచవలెను. చైత్రమాసమున పర్వత శిఖరాగ్ర జలము త్రాగి పార్వతీ పరమేశ్వరుల సం ముఖమున శయనించవలెను. ప్రాతః స్నానముచేసి, పార్వతీపరమేశ్వరుల పూజ చేసి, బ్రాహ్మణ దంపతులను అర్చించి “లలితా ప్రియతాం మమ” అని చెప్పుచు ఆ అష్ట సౌభాగ్యద్రవ్యములను దానము చేయవలెను, వ్రతమాచరించువాడు, చైత్రాగిమాసములందు వరుసగా వ్రతదినములలో, పర్వత శిఖర జలమును, గోమయమును, మందారమును, బిల్వపత్రము లను, ఘృతమిశ్రమగు పెరుగును, గోమూత్రమును, మృతమును. నల్లని తిలలను, పంచగవ్యములను భుజించవలెను. సౌభాగ్యాష్టకము దానము చేయు సమయమున, చైత్రాదివసములందు, వరుసగా “ప్రీయతాం మమ” అనుదానికి “లలితా, విజయా, భద్రా, భవానీ, కుముదా, శివా, వాసుదేవీ, గౌరీ, మంగళా, కమలా, సతీ” అనునవి చేర్చవలెను. వ్రతము ముగిసిన తరువాత ఏదైన ఒక ఫలమును పరిత్యజించవలెను. గురువునకు తలగడలతో గూడిన శయ్యను, స్వర్ణ నిర్మిత మగు ఉమామహేశ్వరమూర్తి ని, గోసహిత వృషభమును దానము చేయవలెను. గురువునకును, బ్రాహ్మ ణదండ తులకును వస్తాదులతో సత్కారము చేసిన వాడు భుక్తిముక్తులను పొందును. “సౌభాగ్యశయనము” అను ఈ వ్రతమును ఆచరించుటచే మనుష్యుడు సౌభాగ్య - ఆరోగ్య - రూప - దీర్ఘాయువులను పొందును.
భాద్రపద - వైశాఖ - మార్గశీర్ష శుక్ల తృతీయలందు గూడ ఈ వ్రతము చేయవచ్చును. “లలితాయై నమః” అని చెప్పుచు పార్వతీపూజ చేయవలెను. ప్రతి పక్షమునందును ఈవిడముగా పూజించి వతాంతమునందు ఇరువది నలుగురు దంపతులకు వస్త్రదానము చేయువాడు భుక్తి ముక్తులను పొందును. ఇది సౌభాగ్యశయన వ్రతము రెండవవిధి. ఇపుడు సౌభాగ్యవ్రతమును గూర్చి చెప్పెదను. ఫాల్గుణాది మాసముల శుక్ల పక్ష తృతీయలయందు వ్రతము చేయువాడు ఉప్పు పరిత్య జించవలెను. వ్రతము సమాప్తమైన పిమ్మట బ్రాహ్మణదంపతి పూజ చేసి, “భవానీ ప్రియతామ్” అని చెప్పి శయ్య, సంపూర్ణ సామగ్రి చేర్చి గృహము దానము చేయవలెను. ఇది సౌభాగ్య తృతీయా వ్రతము, ఇది పార్వత్యాదిలోక ముల నిచ్చును. మాఘ - భాద్రపద - వైశాఖ తృతీయలందు గూడ ఈ విధముగనే చేయవలెను. చైత్రమునందు దమనక తృతీయావ్రతమాచరించి దమనక పుష్పముతో పార్వతిని పూజించవలెను. మార్గశీర్షమున ఆత్మ తృతీయావ్రత మాచరించ వలెను. దానియందు పార్వతీ పూజ చేసి బ్రాహ్మణులకు యథేచ్చగా భోజనము పెట్టవలేను మార్గశీర్ష తృతీయతో ప్రారంభించి, క్రమముగా పౌషాదిమాసములందుపై వ్రతమును ఆచరించి “గౌరీ, కాలీ, ఉమా, భద్రా, దుర్గా, కాంతి, సరస్వతీ వైష్ణవీ, లక్ష్మీ, ప్రకృతి, శివా, నారాయణీ” అను నామములకు ప్రీయతామ్ ఆని చేర్చి చెప్పవలెను. ఈ విధముగా వ్రతము చేయువాడు సౌభాగ్యమును స్వర్గమును పొందును.
అగ్ని మహాపురాణమునందు తృతీయా వ్రతవర్ణనమను నూటడెబ్బది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
