అగ్ని మహా పురాణము

Table of Contents

84 - అథ నిర్వాణదీక్షావిధానమ్:

ఈశ్వరుడు చెప్పెను. గురువు ప్రాతఃకాలమునందు లేచి, స్నానాదులు పూర్తి చేసికొని, మీరేమి స్వప్నములు చూచితి రని శిష్యులను ఆడుగవలేను. పెరుగు, పచ్చిమాంసము, మద్యము మొదలగువాటిని భుజించినట్లు గాని, చూచి నట్లుగాని స్వప్నము వచ్చినచో అది ఉత్తమము, శుభసూచకము. అట్లే ఏనుగు, గుజము ఎకుట, శ్వేతవస్త్రాదులను చూచుట గూడ శుభప్రదము. తైలము పూసికొని నట్లు స్వప్నము చూచినచో ఆశుభము. దాని శాంతికొరకై అఘోరమంత్ర ముతో హోమము చేయవలెను. ప్రాతఃకాల మధ్యాహ్న కాల నిత్యకర్మలు పూర్తిచేసుకొని యజ్ఞమండపమున ప్రవేశించి, యధాశాస్త్రముగ ఆచమనము చేసి, నై మత్తిక కర్మ కూడ నిత్యవిధి వలెనే చేయవలెను. ఆధ్వశుద్ధి చేసుకొని తనపై హస్త ముంచుకొనవలెను. కలశ పై నున్న శివుని పూజించి, క్రమముగ ఇంద్రాది దిక్పాలకుల పూజ చేయవలెను. మండలమునందును, వేదియందును శివునిపూజింపవలెను. పిమ్మట తర్పణములు, అగ్నిపూజ, పూర్ణాహుతివరకును హోమములు, మంత్రతర్పణములు చేయవలెను.దుఃస్వప్న దోష నివారణార్థమై ‘హూం'తో సంపుటితము చేసిన అస్త్రమంత్రముతో (హూం ఫట్ హూం)నూట ఎనిమిదిహోమములుచేసి మంత్రదీపనము చేయవలెను. వేదీకలశలమధ్య అంతర్బలి చేసి, శిష్యుల ప్రవేశార్థమై ఇష్టదేవతానుజ్ఞ పొంది గురువు మండపమునుండి బైటకు వెళ్ళవలెను. ఆచట, సమయదీక్షలోవలెనే మండలారోపణాదికము చేసి సంపాత హోమము. సుషుమ్నా నాడీరూపమగు కుశమును శిష్యునిహ స్తములోనుంచుట మొదలగుకార్యములను పూర్తిచేయవలెను. నివృత్తి కళాసాన్నిధ్యముకొరకై మూలమంత్రముచే మూడు ఆహుతు లిచ్చి, కుంభము పై నున్న శివుని పూజించి కలాపాశమయ మగు సూత్రమును సమర్పింపవలెను. పిమ్మట పూజింపబడిన శిష్యుని ఊర్ధ్వదేహము కుడి భాగమున వాని శిఖకు ఆ సూత్రమును కట్టి కాలి బొటనవేలివరకును వ్రేలాడు నటుల ఉంచవలెను. ఆ విధముగ ఆ పాశమును ఉంచి, దానిలో నివృత్తి కళావ్యాప్తి జరిగి నట్లు భావన చేయవలెను. దానియందు నూటఎనిమిది భువనములు చూడవలెను.

కపాల- అజ-అహిర్బుధ్న్య-వజ్రదేహ-ప్రమర్ధన-విభూతి - అవ్యయ-శాస్తృ - పినాకి - త్రిదళాధిపు లను పదిమంది రుద్రులు తూర్పు దిక్కున నుందురు. అగ్ని రుద్ర - హుతాశ - పింగల - ఖాదక-హర-జ్వలన-దహన-బభ్రు-భస్మాంతక. క్షపాన్లకు లను పదిమంది రుద్రులు ఆగ్నేయమున నుందురు. దమ్య-మృత్యుహర -ధాతృ-విధాతృకర్తృ-కాల-ధర్మ-అధర్మ-సంయోక్తృ వియోజకు లను పదిమంది రుద్రులు దక్షిణమున నుందురు. నైరృత్య-మారుత-హన-క్రూర దృష్టి-భయానక ఊర్ధ్వకేక -విరూపాక్ష ధూమ్ర-లోహిత దంష్టలను పదిమంది రుద్రులు నైరృతిదిక్కునం దుందురు. బల- ఆతిబల-పాళహస్త-మహాబల- శ్వేత-జయభద్ర-దీర్ఘబాహు-జలాంతక వడవాస్య భీములను పదిమంది రుద్రులు పశ్చిమమునం దుందురు. శీఘ్ర-లఘు-వాయువేగ-సూక్ష్మ తీక్ష.క్షమాంతక.పంచాంతక పంచశిఖ-కపర్ది-మేమవాహనులను పదిమంది రుద్రులు వాయవ్యమునం దుందురు. జటాముకుటధారి_నానారత్న ధర, నిధీశ రూపవత్-ధన్య-సౌమ్యదేహ-ప్రసాదకృత్ప్రకామ–లక్ష్మీవత్ - కామరూపు లను పదిమంది రుద్రులు ఉత్తరమునం దుందురు. విద్యాధర-జ్ఞానధర-సర్వజ్ఞవేదపారగ మతృవృత్త-పింగాక్ష- భూతపాలబలిప్రియ-సర్వవిద్యావిధాతృ-సుఖదుఃఖకరు లను పదిమంది రుద్రులు ఈశాన్యమునం దుందురు. అనంత_పాలక ధీర పాతాళాధిపతి-వృష-వృషధర-వీర-గ్రసన-సర్వతోముఖ-లోహితులను పదిమంది రుద్రులు క్రింది దిక్కునందు పాతాలలోకమునం దుందురు. శంభు-విభు-గణాధ్యక్ష-త్ర్యక్ష-త్రిదశ వందిత-సంవాహ వివాహ-నథ-విప్పు-విచక్షణు లను పదిమంది రుద్రుణp ఊర్థ్వదిక్కునం దుందురు. హుహుక కాలాగ్ని రుద్రహాటకకూష్మాండ సత్య-బ్రహ్మ-విష్ణు-రుద్రు లను ఎనమండుగురు రుద్రులు బ్రహ్మాండ కటాహము మధ్య నుందురు. ఈ రుద్రుల పేర్లను బట్టియే నూటఎనిమిది భువనముల పేర్లు ఏర్పడిన వను విషయమును గుర్తుంచుకొనవలెను.

(ఒకటి రెండు శ్లోకాలు మూలపాఠంలో లోపించినట్లున్న ఈ అనువాదం హిందీపాఠాన్ని అనుసరించి ఇవ్వబడినది) సద్భావేశ్వర, మహాతేజః, యోగధిపతే, ముంచ ముంచ. ప్రమథ ప్రమథ, శర్వ శర్వ, భవ భవ, భవోద్భవ, సర్వభూత సుఖప్రద, సర్వసాంనిధ్యకర, బ్రహ్మవిష్ణురుద్ర పర, అనర్చితానర్చిత, అసంస్తుతాసంస్తుత, పూర్వస్థిత, సాక్షిన్ సాక్షిన్, తురు తురు, పతణ్ణి పతజ్ఞ, పిజ్జ పిజ్జి, జ్ఞాన జ్ఞాన, శబ్ద శబ్ద, సూక్ష్మ సూక్ష్మ, శివ-సర్వ, సర్వద, ఓం నమో నమః, ఓం నమః, శివాయ, నమో నమః ఇవి ఇరువదియెనిమిది పదములు. స్కందా! వ్యాపక మైన ఆకాశము మనస్సు, “ఓం నమో షట్ - ఇది అభీష్టమంత్రవర్ణము, అకారలకారములు (ఆం లం) బీజములు. ఇడా పింగళలు రెండు నాడులు ప్రాణాపానము లనునవి రెండు వాయువులు ఝణము, ఉపస్థ అనునవి రెండు ఇంద్రియములు. గంధము విషయము. దీనియందు గంధాదు లగు నాలుగు గుణములున్నవి. ఇది పృథ్వీతత్త్వముతో సంబంధించినది. పీతవర్ణము, దీని మండలాకారము చతురస్రము. నాలుగు వైపులా వజ్రముచే చిహ్నిత మైనది. ఈ పార్థివమండల విస్తారము నూరు కోట్ల యోజనములు. పదునాలుగు యోనులు కూడ దీనియందే ఆంతర్గతము లని గ్రహించవలెను. మొదటి ఆరును మృగాదియోనులు, తరువాతి ఎనిమిది దేవయోనులు. మొదటిది మృగయోని, రెండవది పడియోని, మూడవది పశయోని, వాల్గవది సర్పాదియోని, ఐదవది స్థావర యోని, ఆరవది మనుష్యయోని. ఎనిమిది దేవయోనులు వరుసగ పిశాచ-రాక్షస-యక్ష-గంధర్వ-ఇంద్రసోమ-ప్రజా పతి- బ్రహ్మలకు సంబంధించినవి. ఈ ఎనిమిది యోనులకును పార్థివతత్త్వముపై అధికార మని చెప్పబడినది.

లయము ప్రకృతియందును, భోగము బుద్దియందును అగును. బ్రహ్మ ' కారణము పిమ్మట జాగ్రదవస్థవర కును. సమ స్తభువనాది గర్భిత యగు నివృత్తికళను ధ్యానము చేసి, తదీయమంత్రముచే వినియోగము చేయవలెను. “ఓం హం హ్రం హాం నివృత్తికలాపాళాయ హుం ఫట్ స్వాహా” అనునది దాని మంత్రము. పిదప “ఓం హం హోం హోం నివృత్తి కలాపాయ హరాం ఫట్ స్వాహా” అను మంత్రముచే ఆంకుశ ముద్రాప్రదర్శన పూర్వంముగ, పూరక ప్రాణాయామముతో ఆ కళను. ఆకర్షించవలెను. పిదప ఓం హూం హోం హాం హూం నివృత్తికలాపాళాయ హుం ఫట్ స్వాహా” అనుమంత్రముచే సంహార ముద్రా కుంభక ప్రాణాయామములతో దానిని నాభి క్రింది భాగమునకు తీసికొనిపోయి “ఓం హం నివృత్తికలాపాళాయ నమః” అను మంత్రముచే, ఉదృవముద్రా రేచక ప్రాణాయామములతో దానిని కుండమునందు ఏదైన ఒక ఆధారముపై నుంచవలెను. పిమ్మట”ఓం హం నివృత్తికలాపాళాయ నమః అను మంత్రముచే ఆర్ఘ్యప్రధానపూర్వకముగ పూజించి దాని చివర “స్వాహా చేర్చితర్పణముచేసి, సంవిధానముకొరకై వేరువేరుగా మూడు హోమములు చేయవలెను. పిమ్మట “ఓం హం బ్రహ్మణే నమః” అను మంత్రముచే బ్రహ్మను ఆవాహన చేసి, పూజించి, దాని చివర “స్వాహా చేర్చి మూడు హోమములచే బ్రహ్మను సంతృప్తుని చేయవలేమ. అనంతరము “ఓ బ్రహ్మదేవా! ఈ ముముక్షువునకు, నీ అధికారమున, దీక్ష ఇచ్చుచున్నాను. నీవు సర్వదావీనికి అనుకూలుడవుగ నుండుము. అని ప్రార్థించవలెను.పిదప, రక్తవర్ణ యగు వాగీశ్వరిని, హృదయమంత్రముతో, తన మనస్సులోనే ఆవాహన చేయవలెను. ఆ దేవి ఇచ్ఛా-జ్ఞాన-క్రియారూపిణి. ఆరు ఆధ్వలకును ఏకై కకారణము. వెనుక చెప్పిన విధానమున వాగీశ్వరికి పూజాతర్పణములు చేయవలెను. సమ స్తయోనులను విముఖము చేయువాడును, హృదయములో నుండువాడును అగు వాగీశ్వరదేవుని కూడ పూజించి తర్పణము చేయవలెను. ఆదియందు బీజముతోడను, అంతమునందు అస్త్రమంత్రముతోడను కూడిన అస్త్రమంత్రముతో శిష్యుని హృదయ తాడనము చేసి, ఆతనిలో ప్రవేశించినట్లు భావన చేయ వలేను. హృదయమునందు, నివృత్తికళలోపల నున్న, ఆగ్ని కణసదృశమగు పాశ బద్ధ మైన శిష్యజీవచైతన్యమును జ్యేష్ఠతో విశ క్షము చేయవలెను. “ఓం హాం హూం హః హూం ఫట్” అనునది విథానమంత్రము. “ఓం హం స్వాహా అను మంత్రముచే, పూరక ప్రాణాయామ అంకుశ ముద్రలతో, ఆ జీవచైతన్యమును హృదయమునందు ఆకర్షించి, ఆత్మ మంత్రముచే పట్టుకొని, దానిని లన ఆత్మలో చేర్చవలెను. “ఓం హం హం హాం ఆత్మనే నమః” అనునది ఆత్మ మంత్రము.

మాతాపితరుల సంయోగమును భావన చేయుచు, రేచక ప్రాణాయామముతో బ్రహ్మాదికారణములను క్రమముగ త్యజించుచు జీవచైతన్యమును శివరూపాధిష్టానమునందు చేర్చి, గర్భాధానముకొరకై, దానిని గ్రహించి ఒకే సమయమున అన్ని యోనులందును, పామా-ఉద్భవముద్రలతో వాగీశ్వరయోనియందును ఉంచవలెను. పిమ్మట “ఓం హం హం హామ్ ఆత్మనే నమః” అను మంత్రముతో పూజను, ఐదు పర్యాయములు తర్పణమును చేయవలెను. అన్ని యోనులయందును, ఈ జీవచైతన్యమునకు, హృదయమంత్రముచే దేహసాధనము చేయవలెను. శ్రీ శరీరాదులు పుట్టుటకు కూడ అవకాశ మున్నది గాన పుంసవనసంస్కారము చేయ నవసరము లేదు. దైవవశముచేత ఆంధాదిక రీలోత్పత్తి కూడ సంభావ్యము గాన సీమంతోన్నయసము కూడ అనావశ్యకము. శిరోమంత్రము (స్వాహా) చే ఒకే సమయమున సకలజీవ నించి నట్లు భావవ చేయవలెను. శివమంత్రముతో కూడ ఈ విధముగనే భావన చేయవలెను. కవచమంత్రముతో భోగ మును, అస్త్రమంత్రముతో విషయమునందును ఆత్మయందు మోహరూప మగు లయమను అభేదమును భావన చేయవలెను. పిదప శివమంత్రముతో ప్రోతశ్శుద్ధిని, హృదయమంత్రముతో తత్వశోదనమును చేసి గర్భాధానాది సంస్కారముల నిమిత్తమై వరుసగ ఐదేసి హోమములు చేయవలెను. మాయజనిత - మలజనిత - కర్మజనితాం పాశ బంధములు తొలగుటకై హృదయవంత్రముచే శుద్ధి చేసి, అగ్నిలో నూరు హోమములు చేయవలెను. మలశ క్తిని లయింపచేయుటకును, పాశములు తొలగించుకొనుటకును స్వాహాంత మగు అస్త్రమంత్రముతో ఐదేసి హోమములు చేయవలెను. “ఓం పం పం పం నివృత్తిక లాపాశాయ హః హూం ఫట్” అను మంత్రము మచ్చరించుచు, అస్త్రమంత్రజపాభిమంత్రిత మగు ఖడ్గమైన కళాశస్రముతో అంతఃకరణములో నున్న మలాదిపాశములను ఏడు పర్యాయములు భేదించవలెను.

పాశము బంధించకుండ ఉండుటకు దానిని ఆశ్రమంత్రముతో, రెండు చేతులతో నలిపి, గోలాకారము చేసి, నేతితో నింపిన స్రువములో పడ వేయవలెను. కలామయ మగు అస్త్రముచేత గాని, దేవతాస్త్రమంత్రముచే గాని దానిని కాల్చివేసి భస్మము చేయవలెను. పిమ్మట పాశాంకురము తొలగిపోవుటకు నాలుగు హోమములు చేయవలెను. “ఓం హః ఆస్త్రాయ హూం ఫట్ స్వాహా” అనునది హోమమంత్రము. పిదప అస్త్రమంత్రముతో ఎనిమిది హోమములు చేసి ప్రాయశ్చిత్తము చేయవలెను. పిమ్మట విధాతను ఆవాహన చేసి పూజాతర్పణములు చేయవలెను. “ఓం హాం శబ్దస్పరెడ్డి శుం బ్రహ్మన్ గృహాణ స్వాహా” అను మంత్రముతో మూడు హోమములు చేసి శిష్యునకు అధికారము సమర్పింప వలెను. శివుని ఆజ్ఞను ఈ విధముగ బ్రహ్మ కు తెలుపవలెను. “ఓ బ్రహ్మా! ఈ పిల్లవాని పాశము లన్ని యు దగ్ధము లైనవి. ఈతని మరల బంధనములలో పడవేయుటకై నీ విచట ఉండరాదు”. ఇట్లు చెప్పి, బ్రహ్మ ను పంపివేసి, సంహార ముద్రా కుంభక ప్రాణాయామములతో, రాహువు యుక్తచందైక దేశమువలె నున్న ఆత్మను, ఆత్మ మంత్ర ముచ్చరించుచు కుడినాడి ద్వారా మెల్ల మెల్లగా తీసికొని, రేచక ప్రాణాయామ ఉద్భవముద్రలతో వెనుకటి సూత్రమునందు చేర్చవలెను మరల దానిని పూజించి గురువు అర్ఘ్యపాత్రలో నున్న అమృతోపమజలబిందువులను గ్రహించి, శిష్యుని పుష్టి తృపులకొరకే శికముపై నుంచవలెను. పిమ్మట మతాపితరుల విసర్జనము చేసి ఔషడంత మగు అస్త్రమంత్రముతో, విధిదూ ర్తికొరకైచుచు పూర్ణాహుతి ఇవ్వవలెను. ఇట్లు చేయుటచే నివృత్తికళ శుద్ద మగును. “ఓం హూం హాం ఆముకస్య ఆత్మనో నివృత్తి కలాడద్ధిరస్తు స్వాహా ఫట్ నౌషట్” అనునది పూర్ణాహుతి మంత్రము.

అగ్నిమహాపురాణములో, నిర్వాణదీక్షయఁదు నిర్వాణకళాశోధన మను ఎనుబదినాల్గవ అధ్యాయము సమాప్తము.