అగ్ని మహా పురాణము
157 - అథ శావాశౌచాధికమ్.
పుష్కర ఉవాచః-
పుష్కరుడు చెప్పెను : ఇపుడు ప్రేతశుద్ధి-సూతికాశుద్ధులను గూర్చి చెప్పెదను. సపిండులలో (మూలపురు ముడు మొదలు ఏడవ తరమువరకు ఉన్న వారిలో) మరణాశౌచము పది దినములు. జననాశౌచము కూడ అంతే. పరశు రామా! ఇది గ్రాహ్మణుల విషయమున చెప్పిన ఆశాచము. క్షత్రియులకు 11 రోజులు, వైశ్యులకు 15 రోజులు, శూద్రులకు ఒక మాసము అశౌచము. శూద్రులకు చెప్పినఈ అశౌచము అనులోమజునకు స్వామి ఎన్ని దినముల ఆశౌచము పాటించునో సేవకులకు గూడ అన్ని దినములే. జననాశౌచము క్షత్రియ-వైశ్య-శూద్రులకు గూడ పది దినములే. పరశురామా! బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులకు ఈ విధముగ నే శుద్ధి యగును. కొందరి మతమున వైశ్య-శూద్రులకు జననాశౌచము పదునై దు దినములు. బాలకుడు దంతోత్పత్తికి పూర్వమే మరణించినచో జననాశాచమునకు సద్యః శుద్ది కలుగును. దంత ములు వచ్చిన తరువాత చూడాకరణమునకు పూర్వము మరణించినచో ఏకరాత్రాశౌచము; యజ్ఞోపవీతధారణమునకు పూర్వమైనచో త్రిరాత్రాశౌచము; అనంతరము దశరాత్రైశాచము. మూడు సంవత్సరముల లోపు బాలుడుమరణించినచో శూద్రు నకు ఐదు దినముల తరువాత ఆశౌచనివృత్తి. మూడు సంవత్సరముల పిమ్మట నైనచో పదునొక దినముల తరువాతను, ఆరు వర్షములు దాటిన తరువాత నైనచో ఒక మాసము తరువాతను నివృత్త మగును. చూడాకర్మ జరుగ ని కన్య మరణించి నపుడు ఒక రాత్రి మరణాశౌచ మగును. చూడాకర్మ జరిగిన పిమ్మట నైనచో బంధువులకు మూడు దినముల పిమ్మట శుద్ధి యగును. వివాహిత స్త్రీల మరణాశౌచము పితృకులమువారికి ఉండదు. తండ్రి యింటిలో పుత్రిక బిడ్డను కన్నచో ఆ జాతాశౌచము ఒక్క రాత్రిమాత్రమే ఉండును. ఆ శ్రీ మాత్రము పది రోజుల తరువాత శుద్ధురాలగును. వివాహితకన్య పితృగృహమున మరణించినచో పితృకులమువారికి అశౌచము మూడు రాత్రు లుండును. సమానఅశౌచమునకు ముందు శుద్ధి చేసికొనవలెను, అసమానాశాచమునకు అనంతరము చేసికొనవలెను, అని ధర్మరాజు చెప్పెను.
దేశాంతరములో నున్న వాడు జాతమరణాశౌచములను విన్న చో పది రోజులలో మిగిలిన రోజులకు మాత్రమే ఆశౌచము పట్టవలెను. పది రోజుల తరవాత విన్న చో మూడు రోజులు పట్టవలెను. సంవత్సరము దాటిన తరువాత విన్న చో స్నానమాత్రముచే శుద్దుడగును. మాతామహుడు గాని, ఆచార్యుడు గాని మరణించినచో మూడు రాత్రులు ఆశా చము పరశురామా! గర్భస్రావము ఎన్నవ మాసమున జరిగినదో అన్ని రాత్రులు గడచిన పిమ్మట స్త్రీకి శుద్ధి యగును. సపిండ బ్రాహ్మణకులమునందు మరణాశౌచము వచ్చినచో అందరికిని పది రోజులలో శద్ధి, క్షత్రియులకు పదునొకండు రోజులలోను, వైశ్యునకు పదునైదు రోజులలోను, శూద్రునకు ఒక మాసమునకును శుద్ధి (శ్రాద్దమునందు) ఉచ్చిష్ట సమీపమున వేదిని ఏర్పరచి, దాని సంస్కారము చేసి, దాని పై కుశ లు పరచి, కుశముల పైననే పిండప్రదానము చేయవలెను. ఆ సమ యమున ఏకాగ్రచిత్తు డై పితరుల నామగోత్రములు చేప్పుడు పిండప్రదానము చేయవలెను. బ్రాహ్మణులు భుజించిన తర వాత వారికి ధన మిచ్చి సత్కరించి, పూజించి, నామగోత్రోచ్చారణపూర్వకముగ అక్షతసహితజలము విడువవలెను. నాలుగు అంగుళముల వెడల్పు, ఆంతే లోతు, గల జానెడు గొయ్యి తవ్వి అచట మూడు వికరువులు తయారు చేసి, వాటి దగ్గర మూడు అగ్ను లను ప్రజ్వలింపచేయవలెను.
వాటి అన్నింటియందును మూడేసి, లేదా నాలుగేసి హోమములు చేయవలెను. పిదప అచట వెనుకవలెనే వేరు వేరుగా పిండముల నీయవలెను. పిండములను అన్న ము, పెరుగు, తేనె, మినుగులు వీటితో చేయవలెను. సంవత్సరము మధ్య అధిక మాసము వచ్చినచో దాని కొక పిండము అధికముగా చేయవలెను. లేదా పండ్రెండు మాసముల మాసిక శ్రాద్దము లన్నియు పండ్రెండవ రోజుననే పూర్తి చేయవలెను. ఆ సంవత్సరమునందు అధిక మాసము రానున్నచో ద్వాదహశ్రాద్ధదినమునందే ఆమాసముకొరకై ఒక పిండము అధికముగా ఇవ్వవలెను. సంవత్సరము పూర్తి యైన పిమ్మట శ్రాద్ధమును సామాన్య శ్రాద్ధము వలెనే చేయవలెను. సపిండికరణ శ్రాద్ధమునందు ప్రేతకు పిండము వేరుగా నిచ్చి, పిదప మూడు తరముల పితరులకుశ్రీమదగ్ని మహాపురాణము మూడు పిండములు వేరువేరుగా ఇవ్వవలెను. ఈ విధముగా నాలుగు పిండములను ఏకాగ్రతతో ఇవ్వవలెను. పరశురామా! పిండముల పూజ చేసి, దానము చేసి, “పృథివీతే పాత్రమ్” “యే సమానాః” ఇత్యాదిమంత్రమును పఠించుచు యథోచితకర్మ చేసి, ప్రేతపిండమును మూడు భాగములు చేసి, వాటిని వరుసగా పితృ - పితామహ - ప్రపితామహాపిండములందు కలప వలేను. అంతకు ముందు ప్రేతార్ఘ్య పాత్రలను పిత్రాద్యర్ఘ్య పాత్రలతో కలిపివేయవలెను. ఈ రెండు పనులు వేరు వేరుగ చేయుట మంచిది. శూద్రునకు ఈ శ్రాద్ధకర్మ మంత్రరహితముగ చేయవలెను. స్త్రీల సపిండీకరణమును ఆ సమయమునందు ఈ విధముగనే చేయవలెను. పితృదేవతలకు ప్రతి సంవత్సరము శ్రాద్దము చేయవలెను. ప్రేమకు మాత్రము సాన్నోదకకుంభ దానము ఒక సంవత్సరము పాటు చేయవలెను. వర్షాకాలమునందు గంగానదిలోని ఇసుక లెక్క పెట్టవచ్చునేమో కాని అతీతులగు పితరులను లెక్క పెట్ట శక్యము కాదు. కాలము నిరంతరగమన శీలము. స్థిరత్వ మనునది కాలమునం దేన్నడును ఉండదు. అందుచే కర్మలను తప్పక చేయవలెను.
మరణించిన వాడు దేవత్వమును పొంది యున్నను, నరకములో శ్రాద్ధమును ఆచటనే తప్పక పొందును. మరణించిన వానిని గూర్చి ఏడ్చువాడు తనకు కాని, మరణించిన వానికిగాని ఉపకారము చేసినవాడు కాజాలడు. పర్వతము నుండి దుమికి, ఆగ్నిలోపడి, ఉరి వేసికొని, నీటిలో పడి, ఆత్మహత్యచేసికొన్న వారి మరణాశౌచము బంధువులకు తగలదు. పిడుగుపడి గాని, యుద్ధములో శస్త్రఘాతమువలన గాని మరణించినవారి వలన గూడ మరణా శాచము ఉండదు. యతులకును, యజ్ఞదీక్షితులకును, రాజాజ్ఞాపాలకులకును ఆశాచ ముండదు. వీరు శవయాత్రలో వెళ్ళినచో స్నానముచే గుద్దు లగుదురు. మైథునము తరవాతను జ్వలించుచున్న శవముయొక్క ధూమము తగిలినను వెంటనే స్నానము చేయవలెను. మరణించిన బ్రాహ్మణుని ఈడుని చేత మోయించగూడదు. అట్లే శూద్రుని బ్రాహ్మణుని చేత మోయించగూడదు. అట్లు చేయుటచే - ఇద్దరికిని దోషము. అశబ్రాహ్మణశ వమును మోసి అంత్యేష్టికి తీసికొని వెళ్ళినవాడు స్వర్గమము పొందును. అనాథ ప్రేత శంస్కారార్థమై కాస్ట్ మిచ్చువాడు యుద్ధమునందు విజయము పొందును. శవమును చితిపై ఉంచి, దహించి, బంధువులు చితికి అపసవ్యంగా పరిక్రమణము చేసి, సచేలస్నానము చేసి, ప్రేతనిమిత్తము మూడేసి పర్యాయములు ఇలాంజలి ఇవ్వ వలెను. గృహద్వారమునందు మొదట తాతిపై పాదములుంచి ఆగ్ని లో ఆక్షతలు వేసి, వేపాకులు నమలి, ఇంటిలో ప్రవేశించవలెను. అందరికి దూరముగా చాప వేసికొని నిద్రించవలెను. ఆ కుటుంబములోని వారు ఆ రోజున కొన్న ఆహారమును స్వల్పముగా భుజించవలెను. పది రోజులవరకును రోజుకు ఒక్కొక్కటి చొప్పున పిండము నీయవలెను. పడవ రోజున ఒక పిండము నిచ్చిన తరువాత క్షారము చేయించుకొనుటచే పరిశుద్దుడగును. పదవ రోజున ఆవాలను, తిలలను శరీర మునకు పూసుకొని, నీటిలో మునిగి స్నానము చేసి నూతన వస్త్రములు ధరించవలెను. దంతోత్పత్తి కి పూర్వమే మరణించిన బాలునకును, గర్భస్రావముచే పోయిన శిశువునకును దాహసంస్కార జలాంజలులు ఉండవు. శవదాహానంతరము నాల్గవ రోజున ఆస్థిసంచయము చేయవలెను. ఆస్థి సంచయము తరువాత అంగ స్పర్శ విహితము.
అగ్ని మహాపురాణమునందు శాతాశౌచాదిక మను నూటఏబదిఏడవ అధ్యాయము సమాప్తము.
