అగ్ని మహా పురాణము

Table of Contents

69 - అథ స్నానవిధానమ్

అగ్ని దేవుడు పలికెను: ‘బ్రహ్మ దేవా! ఇపుడు నేను స్నానోత్సవమునుగూర్చి సవిస్తరముగ చెప్పెదను. ప్రాసాము ఎదుట మండపము క్రింద మండలముపై కలశములు ఉంచవలెను. ప్రారంభమునందు అన్ని కర్మలు చేయు నపుడును శ్రీహరి ధ్యానము, పూజాహోమములు చేయవలెను. పూర్ణాహుతితో పాటు వెయ్యి లేక సూటఎనిమిది హోమము చేయవలెను. స్నా నద్రవ్యములు తీసికొని వచ్చి కలశ విన్యాసము చేయవలెను. కంఠసూత్రయుక్త కుంభములను ఆధివాసనము చేసి మండ లము పై ఉంచవలేను.

చతురస్రమండలము నిర్మించి దానిని పండ్రెండు రేఖలచే విభజించవలను ప్రక్క నున్న రేఖను తుడిచివేయ పలెను. ఈ విధముగ ఆ మండలముపై నాలుగు దిక్కులందును తొమ్మిదేసి కోష్టకములు స్థాపించి వాటిని పూర్వాదీక్రమమున వరిపిండి మొదలైన వాటితో నింపవలెను. పిమ్మట విద్వాంసుడు కుంభముద్రతో పూర్వాది దిక్కులం దున్న నవకమునందు కలశ లుంచవలెను. పుండరీకాక్ష మంత్రముతో వాటిలో దర్భ లుంచవలెను. సర్వరత్నములును ఉంచిన ఉదకపూర్ణకుంభమును మధ్యభాగమునం దుంచి, మిగిలిన ఎనిమిది కుంభములలో క్రమముగ యవ-ద్రోహి తిల. నీహార-శ్యామాక కులత్త- ముద్ద- శ్వేత సర్వపములు వేసి ఎనిమిది దిక్కులందును స్థాపింపవలెను. పూర్వదిక్కునం దున్న నవకమునందు మధ్య మృతపూర్ణకుంభ ముంచవలెను. మిగిలిన ఎనిమిది కుంభములలో పలాశ అశ్వత్థవట.బిల్వ-ఉదుంబర -ప్లక్ష -జంబూశమీ.కపిత్త వృక్షముల బెరడునుండి తీసిన రసము పోయవలెను. ఆగ్నేయమునం దున్న నవకమునందు మధ్య మధుపూర్ణ ఘటము నుంచవలెను. మిగిలిన ఎనిమిది కుంభములలో గోశృంగ పర్వత-గంగాజల-గజళాలా- తీర్థ- తేత్ర (పొలము) ఖల (కళ్ళము) ములమట్టి ఉంచవలెను.

దక్షిణమున నున్న నవకమున మధ్యయందు తైలపూర్ణ ఘటము స్థాపింపవలెను. మిగిలిన ఘటములలో నారంగ జంబీర.నింబ ఖర్జూర మృత్తికా నారికేళ పూగ.దాడిమపన సఫలము యించవలెను. నైరృతిదిక్కున నవకమునందు మధ్య క్షీర పూర్ణకుంభ ముచి మిగిలిన ఎనిమిదిటిలో కుంకుమ-నాగపుష్ప-చంపక మాలతీ-మల్లికా-పున్నాగ.కరవీర కమలకుసుమము లుంచవలెను. పశ్చిమ నవకమధ్యమున నారి కేలజంపూర్ణకలశ ముంచి, మిగిలిన ఎనిమిదింటిలో నదీ-సముద్ర-సరోవర కూప- వర్షా-హిమ,నిర్జర దేవనదుల జలము లుంచవలెను. వాయవ్య నవక మునందు మధ్య కదలీజలపూరితకుంభ ముంచి, మిగిలిన ఎనిమిది కుంభములందును సహదేవీ కుమారీ.సింహీ-వ్యాప్తీఆమృతా-విష్ణుపర్లీ -దుర్వా-వచా అను దివ్యౌషధుల నుంచవలెను. పూర్వాది సౌమ్య నవకమునందు మధ్య దధికలశ నుంచి, మిగిలిన కలశ ములందు పత్ర.ఏలా త్వక్ -కూట బొలక చంచనద్వ యలలో కస్తూరి కృష్ణాగురు.సిద్దరవ్యములను ఉంచవలెను. ఈశాన్యనవకమధ్యమున శాంతిజలపూర్ణ కుంభముంచవలేను. మిగిలిన కలశములలో క్రమముగ చంద్ర.తార.రజత.లోహ-త్రపు-కాంస్య-సీసక-రత్నముల నుంచవలెను. ప్రతిమకు మృతము పూసి, ఉద్వర్తనముచేసి, మూలమంత్రముతో స్నానము చేయించ వలెను. మరల దానికి గంధాదులతో పూజ చేయ వలెను. అగ్నిలో హోమము చేసి పూర్ణాహుతి ఇవ్వవలెను, సకలభూతములకు బలిప్రదానము చేసి, బ్రాహ్మణునకు, దక్షిణా పూర్వకముగ భోజనము చేయించవలెను. దేవతలు, మునులు, అనేకులు రాజులు కూడ భగవద్విగ్రహమునకు అభిషేకము చేయుటచేతనే ఐశ్వర్యాదులను పొందిరి. ఈ విధముగ ఒక వెయ్యి ఎనిమిది కలశములతో స్నాపనోత్సవము చేయవలెను. ఇట్లు చేయుటచే మానవుడు అన్ని కామములను పొందగలడు. యజ్ఞా,వభృథస్నానమునందు కూడ పూర్ణప్నా నసిద్ధి కలుగును. పార్వతీపక్ష్యాదుల వివాహాదులలోకూడ స్నపనోత్సవము చేయబడును.

అగ్ని మహాపురాణమునందు స్నపనోత్సవవిధి యను ఆరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.