అగ్ని మహా పురాణము

Table of Contents

20 - పునః జగత్సర్గ వర్ణనమ్

మొదటిది మహత్తు యొక్క సృష్టి. అది బ్రహ్మ యొక్క సృష్టిగా తెలియదగినది. తన్మాత్రల సృష్టి రెండవది. అది భూత సర్గము (సృష్టి) అని చెప్పబడును

 మూడవ సృష్టి వై కారికము. అదియే ఐంద్రియిక సృష్టి యని చెప్పబడుచున్నది. ఈ విధముగా బుద్ధి (మహత్త త్వము)తో ప్రారంభించిన సృష్టి ప్రాకృత సృష్టి.

నాల్గవది ముఖ్యసర్గము. స్థావరములు ముఖ్యములని చెప్పబడుచునవి. తిర్యక్రోతస్సు అని చెప్పబడిన నృష్టికి “తైర్యగ్యోన్యము” (తిర్యగ్జంతువుల సృష్టి) అని పేరు.

ఊర్ధ్వసోతన్సుల సృష్టి ఆరవది. ఆదియే దేవనర్గము. పిమ్మట ఆర్వాక్రోతసుల సృష్టి ఆది ఏడవదై న మానుష సర్గము.

 ఎనిమిదవ సర్గము అనుగ్రహ నరము. సాత్విక ము, తామసము అని అది రెండు విధములు. ఈ చివరి ఐదును, వైక్బత వర్గములు, మొదటి మూడును కృతసర్గములు,

ప్రాకృత సర్గములు మూడును, వైకృతసర్గములు ఐదును, తొమ్మిదవ దైన కౌమార సర్గము, బ్రహ్మ చేసిన తొమ్మిది సర్గ ములును జగత్తు యొక్క మూలకారణములు.

సృష్టి నిత్యము, నైమితి కము ప్రాకృతము అని రెండు విధములే నదిగా కొందరిచే చెప్పబడినది. ఆవాంతర ప్రళయముచే నిత్యము జరుగునది నిత్య సర్గము, ఆది దైనందిన సర్గము ప్రతి దినము నందును జరుగు సర్గము గాన ఇది నిత్యము.

భృగువు మొదలైనవారు ఖ్యాతి మొదలగు దక్ష కన్యలను వివాహ మాడిరి. ఖ్యాతి భృగువు వలన ధాత, విధాత అను దేవతలను లక్ష్మీని క నెను. విష్ణుపత్ని యైన ఈ లక్ష్మనీ ఇంద్రుడు వృద్దికొర కై స్తుతించెను.

ధాతకు ప్రాణుడు, విధాతకు మృకండుడు అను పుత్రులు జనించిరి. మృకండునకు మార్కండేయుడు ను. ఆతనికి వేద శిరస్పు జనించిరి.

            అంగిరసుని వలన స్మృతియందు సినీవాలి, కుహ, రాక, అనుమతి అను కుమార్తెలు పుట్టిరి. అనసూయ అత్రి వలన సోముని, దుర్వాసుని, యోగియైన దత్తాత్రేయుని కనెను.

పులస్త్యుని భార్యయైన ప్రీతికి దత్తాలియను కుమారుడు పుట్టెను. క్షమకు పులహుని వలన సహిష్ణువు, క్ర ముడు, పాదకుడు అను పు తులు జనించిరి.

క్రతువునకు స్న తియందు గొప్ప తేజస్సు గలవారును, బొటన వేలు కణుపు ప్రమాణము కలవారును. ఆగు అర వై వేలమంది వాలఖిల్యులు పుట్టిరి.

వసిష్టుని వలన ఉగ్టయందు రాజు, గాతుడు, ఊర్ధ్వబాహుడు సవనుడు. ఆలఘుడు డు కుడు, సుతపుడు అను ఏడుగురు ఋషులు జనించిరి. స్వాహా - అగ్నులకు పావకుడు, పవమానుడు, శుచి అను కుమారులు పుట్టిరి. అజునినుండి అగ్ని ష్వాత్తుడు, బర్షి షత్, ఆనగ్ని , సాగ్ని అను కుమారులు జనించిరి.

పితృదేవతలకు స్వధయందు మేన, వైధారిణి అను కుమార్తెలు పురి. అధర్ముని భార్య హింస. వారిరువురికిని ఆనృతము పుట్టెను.

ఆధర్మహింసలకు నికృతి ఆను కన్యయు పుట్టినది. ఈ ఆనతము నికృతయు మీకు సమయ్యెసు. వారివలన భయము, నరకము పుదైను వారికి వరసగా మాయయు, వేదనయు భార్యలైరి. వారిలో మాయ భూతములను నశింప చేయు మృతు వును ఈ నెను. వేడన రకము వల, దుఃఖమనే కుమారుని క నేను.

మృత్యువునకు వ్యాధి, జర శోక ము, తృష్ణ, కోధము సుతానముగా జనించిరి బ్రహ్మదేవుని నుంచి రోదించును ఏడ్చుచు) పుట్టుటచే రుద్రుడను పేరు గల కుమారుడు పుటేను. ఆతనికే పితా మహుడు -భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి. భీముడు. ఉగ్రుడు, మహాదేవుడు అను పేర్లు పెట్టెను.

ఆతని భార్యయైన నతీదేవి దకుని పై కోపముచే దేహమును విడచి, హిమవంతుని కుమార్తెగా జనించి మరల ఆతని (రుద్రని) బార్య ఆయెను.

స్వాయంభువాదులు నారదాదులచే ఋషులకు చెప్పబడినవియు, భుక్తి ముక్తి ప్రదములును ఆగు విష్ణ్వాదులకు చేయదగిన స్నా నాది పూజలను చేసి (చరితార్థులైరి)

            ఆగ్ని మహాపురాణమునందు జగత్సర్గవర్ణన మను ఇరువదవ అధ్యాయము సమాప్తము.