అగ్ని మహా పురాణము

Table of Contents

276 - అథ ద్వాదశ సంగ్రామాః

ఆగ్ని రువాచః

అగ్నిదేవుడు పలికెను : కశ్యపమహర్షి వసుదేవుడుగను స్త్రీలలో శ్రేష్ఠరాలగు ఆదితి, దేవకిగను అవతరించిరి వారికి శ్రీకృష్ణుడు కుమారుడుగ అవతరించేను. మహాతపశ్శాలియగు శ్రీకృష్ణుడు ధర్మమును రక్షించుటకు ఆధర్మమును ఆంతముచేయుటకు దేవతాదులమ పాలించుటకు దైత్యాదులను మర్ధించుటకు అవతరించెను. రుక్మిణి సత్యభామ, నాగ్నచిత్ కుమార్తెయగు సత్య వీరకృష్ణునకు ప్రియమైన భార్యలు. సత్యభామ ఆయనకు ఆరాధ్యదేవి. గాంధారి - లక్ష్మణ- మిత్ర వింద - కాళింది - జాంబవతి - సుశీల - మాద్రి - కౌసల్య – విజయ - జయ మొదలగు పరహారువేలమంది స్త్రీలు శ్రీకృష్ణుభార్యలు, రుక్మిణి యందు ప్రద్యుమ్నాడు మొదలగు వారును, జాంబవతియందు సాంబుడు మొదలగు వారును, జన్మించిరి. మొత్తము ఆ శ్రీకృష్ణునకు ఒకకోటి ఎనభైవేల పుత్రులుండిరి. సకల యాదవులును శ్రీకృష్ణునిచే రక్షింపబడిరి. ప్రద్యుమ్న నకు విదర్భ రాజకుమారియందు యుద్ధప్రియుడగు అనిరుద్ధుడు పుట్టెను. ఆనిరుద్ధునకు వజ్రాదులు కుమారులుగ పుట్టిరి. యాదవులందరును మహాబలవంతులు మొత్తము వారిసంఖ్య మూడుకోట్లు. ఆసమయమున ఆరువది లక్షల దానవులు మనుష్యులుగా పుట్టి లోకులను హింసించుచుండిరి. వారిని నశింపచేయుటకే శ్రీ కృష్ణుడు ఆవతరించెను. కర్మమర్యాద రక్షకులకై కూడ అవతరించెను

దేవాసురుల మధ్యదాయ భాగముకొరకై పండ్రెండు యుద్దములు జరిగెను. నారసింహము వామనము వారాహ సంగ్రామము, అమృతమంథనము, తార మయ సంగ్రామము, ఆజీవకము, జిత్ హాలహలము, ఘోర కోలాహలము. అను పేర్లతో ప్రసిద్ధమైనవి. పూర్వము నరసింహుడు హిరణ్యకశిపు వక్షమును చీల్చి ప్రహ్లాదుని రాజుగాచేసెను. మరల దేవాసురుల యుద్ధ సమయమున వామనుడుగా అవతరించి కాశ్యప ఆదితి పుత్రుడై, బలిని వంచించి ఇంద్రువకు రాజ్యమును ఇచ్చెను. వరాహమూర్తియై హిరణ్యాక్షునిచంపి దేవతలను రక్షించి మునిగిపోయిన భూమిని ఉద్దరించి దేవాధిదేవులచే స్తుతింపబడెను. దేవాసురులు కలసి మంథరాచలమును కవ్వముగను, వాసుకిని, త్రాడగ నుచేసి సముద్రము మథించి ఆమృతమును తీసిరి. అపుడు శ్రీ మహావిష్ణువు అమృతమును దేవతలకు ఇచ్చివేసెను. లారకా మయ సంగ్రామమునందు బ్రహ్మదేవుడు ఇంద్రబృహస్పతులు దేవరాదానవులను యుద్దము నుండి నివారించి దేవతలను రక్షించి సోమవంశ మును స్థాపించెను. ఆజీవక యుద్ధమున విశ్వామిత్ర వశిష్ట ఇత్యాది ఋషులు, రాగద్వేషాప్ దానవులను నివారించి దేవతలను పాలించిరి. శివుడు పృథ్విరథముగా రథమునకు వేదరూపములగు ఆశ్వములను కట్టి దానిని అధిష్టించేను. అపుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మను సారథిగ తీసుకొనిన ఈశ్వరునకు శరణమొసగి తాను బాణమై త్రిపుర దాహమును చేసెను. అంధకాసురుడు గౌరిని అపహరించుటకై రుద్రునకు కష్టమును కలిగించగ, రేవత్యనురక్తుడగు శ్రీహరి ఆ ఆసురుని సంహరించేను. దేవాసురయుద్ధమునందు విష్ణువువృత్ర సంహార మునకై నీటి నురుగుగా ఏర్పడి ఇంద్రుని వజమున లగ్న మయ్యెను. ఈ విధముగ ఇంద్రుని దేవధర్మమును పాలించి దేవతలను కష్టములనుండి విడిపించెను విష్ణువు పరశురామావతారమును ధరించి - శాల్వాదిదానవులను జయించి క్షత్రియులను నశింపచేసి దేవతాదులను రక్షించెను. మధుసూదనుడు హాలహల విషరూపమున ఆవిర్భవించిన దైత్యుని శంకరునిచే నశింపచేసి దేవతాభయమును శమింపచేసెను. దేవాసుర సంగ్రామమున కోలాహలడను దైత్యుని జయించి మహావిష్ణువు ధర్మమునుపాలించి సకలదేవతలను రక్షించెను. రాజులు రాజకుమారులు మునులు దేవతలు ఎల్లరును మహావిష్ణు స్వరూపులే. నేను ఇక్కడ పేర్లు చెప్పినవారును చెప్పనివారును కూడ మహావిష్ణు అవతారములే.

అగ్ని మహాపురాణమున ద్వాదశ సంగ్రామములను రెండువందల డెబ్బదియారవ అధ్యాయము సమాప్తము.