అగ్ని మహా పురాణము

Table of Contents

150 - అథ మన్వంతరాణి.

అగ్నిగువాచః-

అగ్నిదేవుడు చేప్పేను : ఇపుడు మన్వంతరములను గూర్చి చెప్పెదను. స్వాయం భువమనువు మొదటివాడు. ఆగ్నీధైతులు ఆతని కుమారులు. ఈ స్వాయంభువ మన్వంతరమున దేవతలు యమలః ఔర్వాదులు సప్తర్షులు, శతక్రతువు ఇంద్రుడు. రెండవది స్వారోచిష మన్వంతరము. పౌరావతలు, తుషితులు ఆనువారు దేవతలు. చైత్ర కింపురుషులు స్వారోచిషమనువు కుమారులు. విప్చత్తు ఇంద్రుడు. ఊర్జస్వంతుడు మొదలగువారు సప్తర్షులు. మూడవ పొడిఉత్తమడ. ఆజాదులు ఆతని పుత్రులు. ఆతని మన్వంతరమున సుశాంతి ఇంద్రుడు; సుధామాదులు దేవతలు వసిషపుత్రులు సప్తర్షులు. నాల్గవ మనువు ఈమసుడు. ఆతనికి ఖ్యాతి మొదలగువారు తొమ్మండుగురు కుమారులు. ఆతని మన్వంతరమున స్వరూపాదులు దేవతలు. శిఖరి ఇంద్రుడు జ్యోతిర్దోమాదులు సప్తర్షులు. ఖ్యాతి మొదలగు తొమ్మండుగురు సుతులు. ఐదవదగు రైవత మన్వంతరమున వితథుడు ఇంద్రుడు. అమితాభులు దేవతలు. హిరణ్య రోమాదులు సప్తర్షులు. ఐలబంధాదులు రైవతుని కుమారులు. ఆరవ దైన చాక్షుష మన్వంతరమున మనోజవుడు ఇంద్రుడు. స్వాత్యాదులు దేవతలు. సుమేధస్ మొదలగువారు సప్తర్షులు. పురు మొదలగువారు చాక్షుషుని పుత్రులు. ఏడవ మన్వంతరమున సూర్యపుత్రుడైన శ్రాద్ధదేవుడు మను వాయెను. ఈతని మన్వంతరమున ఆదిత్య-వసు-రుద్రాదులు దేవతలు. పురందరుడు ఇంద్రుడు. వసిష్ఠ-కాశ్యపఅత్రి-జమరగ్ని-గౌతమవిశ్వామిత్ర-భరద్వాజులు. సప్తర్షులు. ఇది ఇప్పుడు జరుగుతూన్న మన్వంతరమ. వైవస్వతమనువునకు ఇవ్వాకు మొదలగువారు పుత్రులు. ఈ అన్ని మన్వంతరములందును శ్రీమహా విష్ణువు అంశావతారరూపమున అవతరించెను. స్వాయంభువమన్వంతరమునందు 'మానసుడు' అను పేడతోన, పిదప మన జన రాణి మిగిలిన ఆరు మన్వంతరములందు, క్రమముగా- ఆజిత - సత్య – హరి-దేవవర - వైకుంఠ - వామన రూపములతోను అవతరించెను. ఛాయాదేవీ గర్భసంజాతు డై న పుత్రుడు సావర్ణి ఏడవ మనువు కాగలడు. ఇతని వర్ణము (శరీర ద్బాయ) తన అన్నదైన శ్రాద్ధ దేవుని శరీరచ్ఛాయతో సమముగా నుండును. అందుచే 'సావర్ణి' అని పేరు. ఇతని కాలమున సుతపన్ మొదలగువారు దేవతలు గాన పరమతేజః కాలు లైన ఆ్వత్థామాదులు సప్తర్షులు గాను, బలి ఇంద్రుడు గాను అగుదురు. విరబదులు మను వుత్రులు, తొమ్మిదవ మనువు పేరు దక్షసావర్ణి. ఆతని మన్వంతరమున పారాదులు దేవతలుగాను, అద్భుతుడు ఇంద్రుడుగాను, సవనుడు మొదలగు వారు సప్తర్షులు గాను అగుదురు. మను పుత్రుడు ధృతకేతువు. పదవ మనువు బ్రహ్మసావర్ణి, సుఖాదులు దేవగణములుగాను, శాంతి ఇంద్రుడు గాను, హవిష్యాదులు సప్తర్షులు గాను ఆగుదురు. సుక్షేత్రాదులు మనుపుత్రులు.

పిదప ధర్మసావర్ణి అను పదునొకొండవ మనువు ఆధికారమునం దుండును. ఆ మన్వంతరమునందు విహంగా దులు దేవతలు, గణుడు ఇంద్రుడు; నిశ్చరాదులు సప్తర్షులు కాగలరు. సర్వత్రగాదులు, మనువుత్రులగుదురు. పండ్రెండవ మనువు రుద్రసావర్ణి. ఆ మన్వంతరమున ఋతధాముడు ఇంద్రుడు. హరితాదులు దేవతలు, తపస్యాదులు సప్తరులు అగుదురు. దేవవంతుడు మొదలగు వారు మనుపుత్రు అదురు. పదమూడవ మనువు. రొచ్యుడు. ఆ సమయమున సుత్రామణ్యాదులు దేవతలుగను, దివస్పతి ఇంద్రుడుగను అగుదురు. ఈ ఇంద్రుడు దైత్యదానవాదులను వర్ణించును నిర్మోహాదులు సప్త రులుగ నుందురు. చిత్ర సేనాదులు మనుపుత్రులు. పదునాల్గవ మనువు భౌత్యుడు. ఆ సమయమున శుచి ఇంద్రుడుగను, చాక్షుషాదులు దేవతలుగను అగ్ని దాహ్వాదులు సప్త రులుగను ఉందురు. ఉరు మొదలగువారు మను పుత్రులు. సప్త రులు భూమండలముపై వేద ప్రచారము చేయుచుందురు. దేవతాగణములు భుజింతురు. మనుపుత్రులు ఈ భూమిని పాలింతురు. ఓ మునీ! ఒక్క బ్రహ్మదివసమున పదునాలుగురు మనుషులు ఆవిర్భవింతురు. దేవతా ఇంద్రాదులు పదునాల్గుసార్లు పుట్టుదురు. ద్వాపరాంతమున శ్రీమహావిష్ణువు వేదవ్యాస రూపమున ఆవతరించి, వేదవిభాగము చేయును. మొట్టమొదట వేదము ఒక్కటే. దానిలో నాలుగు చరణములు, ఒక లక్ష ఋక్కులు ఉన్నవి మొదట యజుర్వేద మొక్కటిగానే ఉండగా వ్యాసుడు దానిని నాలుగా విభజించెను. ఆధ్వర్యుపు యజుర్వేదము చేతను, హోత ఋగ్వేదము చేతను, ఉద్గాత సామమంత్రముల చేతను, బ్రహ్మ అథర్వవేదము చేతను, తమ తమ ఆర్విజ్యము నడుపవలె నని నిశ్చ యించెను. వ్యాసుని ప్రథమ శిష్యుడైన పైలుడు ఋగ్వేదపారంగతుడు. ఇంద్రుడు ప్రమతికిని, బాష్కలునకును సంహితను ఇచ్చేను. బాష్కలుడు తన సంహితను నాల్గుగా విభజించి బౌద్ధాదులకు ఇచ్చెను. వ్యాసశిష్యుడును, బుద్ధిమంతు డును అగు వైశంపాయనుడు యజుర్వేద మను వృక్షమునకు ఇరువది ఏడు శాఖలు నిర్మించెను. యాజ్ఞవల్క్యదులు కాణ్వ-వాజసనేయాది శాఖలను సంపాదించిరి. వ్యాసశిష్యుడై న జైమినీ సామవేద మను వృక్షమునకు శాఖలు నిర్మించెను. సుమంతు-సుకర్మలు ఒక్కొక్క సంహిత రచించిరి. సుకర్మ తన గురువునుండి వెయ్యి సంహితలను గ్రహించెను. వ్యాస శిష్యుడైన సుమంతుడు ఆథర్వవేదమునకు ఒక శాఖ ఏర్పరచి ప్రెప్పలుడు మొదలగు వేలకొలది శిష్యులకు నేర్పెను. వ్యాసుని అనుగ్రహముచే సూతుడు పురాణసంహితా విస్తారము చేసెను.

అగ్ని మహాపురాణమునందు మన్వంతరవర్ణనమను నూటఏబదవ ఆధ్యాయము సమాప్తము.