అగ్ని మహా పురాణము
93 - అథ వాస్తుపూజావిధానమ్.
పరమేశ్వరుడు చెప్పెను- స్కందా! పిమ్మట ప్రాసాదమును ఆసూత్రించి వాస్తు మండలరచన చేసి చతురమైన సమతల క్షేత్రము నందు ఆరువది నాలుగు కోక్షములు నిర్మించవలెను. కోణములందు రెండు వంశముల విన్యాసము చేయవలెను. వికోణముకు పోవునట్లుగా, ఎనిమిది రజ్జువులు గుర్తించవలెను. అవి ద్విపద - షట్పదష్టానము రూపమున విభక్తములై యుండును. వాటిపై వాస్తుదేవతాపూజ, చేయవలెను . కుంచిత కేశధారి యగు వాస్తు పురుషుడు వెల్లగితల పండుకొని యుండును. ఆతని ఆకారము అసురసదృశముగా నుండును. పూజాసమయమున ఆతనిని ఆ విధము గనే స్మరించవలెను. కాని గోడ మొదలైన వాటికి పునాదీ వేయునపుడు అతడు ముఖము క్రిందికి వంచి పండుకొని యున్నట్లు ధ్యానము చేయవలెను. ఆతని మోకాళ్ళు మోచేతులు తొడలు వాయవ్య ఆగ్నేయ దిక్కుల వైపు పడియుండును. ఒకదానితో ఒకటి కలసి యున్న పాదములు నైరృతి దిక్కువైపున ఉండును, ఆతని శిరస్సు ఈశాన్యదిక్కు వైపున నుండును. చేతులు దోసిలిగా ఏర్పడి వక్షఃస్థలముపై నుండును. ఆ వాస్తుపురుషుని శరీరముపై ఎక్కియున్న దేవతలను పూజించుటచే శుభకర మగును. ఎనమండుగురు దేవతలు కోణాధిపతులు. వారు ఎనిమిది కోణార్ధములందుందురు. వరుసగా పూర్వాది దిక్కులందున్న మరీచ్యాది దేవతలు ఆరేసి పదముల ఆధిపతులు, వారి మధ్యనున్న బ్రహ్మ నాలుగు పదముల ఆధి పతి. మిగిలిన దేవతలు ఒక్కొక్క పదమున కధిపతులు. సమ సము, నాడిసంపాతము మహామర్మ, కమలము, ఫలము, త్రిశల - స్వస్తిక - వజ్ర - మహాస్వస్తి క - సంపుట - త్రికటి - మణిబంధ - సువిశుద్ధ పదములు పండ్రెండు మర్మ స్థానములు వాస్తుభిత్త్యాదులందు వీటి నన్నింటిని పూజించవలెను. రుద్రునకు మృతాక్షతలు సమర్పింపవలెను. పర్జన్యునకు కమల - జలము, జయంతునకు కుంకుమరంజిత మగు నిర్మలపతాక, మహేంద్రునకు రత్నమిశ్రితోదకము, సూర్యు నకు ధూమ్రవర్ణ మగు బొందని సత్యదేవతకు మృత యుక్తగోధుమలు, భృతనకు ముద్గాన్నము, అంతరిక్షువకు పడి మాంసము లేదా సక్తువులు సమర్పించవలెను. వీరు తూర్పుదిక్కునకు సంబంధించిన ఎనమండుగురు దేవతలు. అగ్ని కి మధువు, పాలు, నెయ్యి నింపిన గ్రక్కు సమర్పించవలెను. హషకు పేలాలు, వితథునకు సువర్ణమిశ్రిత జలము, గృహతునకు మధువు, యమునకు మాంసోదనము, గంధర్వనాధునకు, గంధము, భృంగరాజునకు పశ్మిడిహ్వ, మృగమునకు యవపర్ణములు సమర్పించవలెను. ఈ ఎనమండుగురు దేవతలు దక్షిణమున పూజింపబడుదురు.
పితృదేవతలకు తిలోదకమును సమర్పించవలెను. దౌవారికదేవతకు క్షీరవృక్షదంతధావనకాష్ఠమును ధేనుమద్రా ప్రదర్శన పూర్వకముగా సమర్పించవలెను. సుగ్రీవునకు పుష్పములు, పుష్పరంతునకు కుశలు, వరుణునకు ఎర్రని కమలములు, అసురునకు సురాసవములు, శేషునకు నేతిలో తడిపిన అన్నము, రోగునకు మృతమిశ్రమండిక ములు సమర్పించవలెను. వీరు పశ్చిమదిగ్గేవతలు, మారుతునకు పచ్చని రంగు గల ధ్వజము, నాగదేవతకు నాగ కేసరము ముఖ్య నకు భక్ష్యపదార్థము, భల్లాటునకు ముద్ధసూపము, సోమనకు. మృతమిపాయసము. చరకునకు శాలూకము, ఆదితికి లోపి, దితికి పూరీ సమర్పించవలెను. ఈ ఎనమండుగురు ఉత్తరదిగేవతలు, మధ్యనున్న బ్రహ్మకు మోదకములు సమ ర్పించవలెను. పూర్వదిక్కునందు ఆరు పదముల ఉపభోక్తయగు మరీచికి కూడ మోదకములు అర్పించవలెను. బ్రహ్మ క్రింద ఆగ్నేయ కోష్ఠమునందున్న సవితకు ఎర్రటి పుష్పములు, సవిత క్రింద ఆగ్నేయ కోషమునండున్న సావిత్రికి కుశోదకములు సమర్పించవలెను. బ్రహ్మకు దక్మిణమున ఆరు పదముల అధిష్టాతయగు వివస్వంతునకు రక్తచంద నము, బ్రహ్మకు నైరృతి దిక్కునందున్న క్రింది కోష్టమునందున్న ఇంద్రునకు పసుపు అన్నము, ఇంద్రుని క్రింద నైరృతి కోణమునందున్న ఇంద్రజునకు మిష్టాన్నము, బ్రహ్మ కు పశ్చిమమున ఆరుపదములందున్న మిత్రునకు గుడమిశ్రాన్నము, వాయవ్యకోణము క్రింద పదమునందున్న రుద్రునకు మృతపక్వాన్నము, రుద్రుని క్రింది కోక్షమునందుద్న రుద్రదాసునకు ఆర్ద్రమాంసము, ఉత్తరమునందున్న ఆరు పదములకు అధిపతియగు వృథ్వీధరునకు పెనులతో చేసిన నైవేద్యము ఈశాన్యము నందు క్రిందనున్న పదమునందలి ఆపుని, దాని కింకన క్రిందనున్న ఆపవత్సుని యథావిధిగా పూజించి పెరుగు, పాయసము సమర్పించవలెను. మధ్యభాగమున నాల్గు పదములలో నున్న బ్రహ్మకు పంచగవ్యములు, అక్షతలు, మృతసహితమగు బరువు సమర్పించవలెను.
పిదప ఈశాన్యము మొదలు వాయవ్యదిక్కువరకును, నాల్గువిదిశలలో నున్న చరకి మొదలగు నలుగురు మాతృ కలను వాస్తుబాహ్యభాగమున పూజించవలెను. చరకికి సఘృతమాంసము, విదారికి పెరుగు, కమలములు, పూతనకు మాంసపిత్తమాంసములను సమర్పింపవలెను. పాపరాక్షసీకి ఎముకలు, మాంసము, పిత్తము, రక్తము సమర్పింపవలేను. తూర్పున స్కందునకు ముర్దోదనము, దక్షిణమున అర్యమకు కిచడి, పుష్పము, పశ్చిమదిక్కునందు జంభకునకు రక్తమాంసములును సమర్పింపవలెను. ఉత్తర దిక్కునందు పిలిపిచ్చకు రక్తవర్గాన్నము, పుష్పములు సమర్పించవలెను. లేదా సకల వాస్తుమండపమును కుశ - దధ్యక్షత - జలములతో పూజించవలెను. గృహనగరాదులలో ఎనుబది.. ఒక పదము లతో గూడిన వాస్తుమండలమును పూజించవలెను. - ఈ వాస్తుమండలమునందు త్రిపద షట్పదరజ్జువులను వెనుకటివలెనే నిర్మింపవలేను. దానియందు ఈశాది దేవతలు పదికు లని చెప్పబడుదురు. 'ఆహా' మొదలగు నవి రెండేసి పదములపై నుండును. మరీచ్యాదిదేవతలు ఆరు పదములందున, బ్రహ్మ తొమ్మిడి పదములందును ఉండును. నగర. గ్రామ.ఫోటాదు లందు శతపదవాస్తు విధానము కూడ చెప్పబడినది. వాటిలో రెండు వంశములు కోణగతములు. అవి సర్వదాదుర్గయములు, దుర్ధరము అని చెప్పబడుచున్నది. శతపదవాస్తు మండలమునందు గూడ దేవాలయమునందు వలెనే న్యాస ముండును. అందు స్కందాదులు షట్పదాధిష్ఠితలు చరకి మొదలగు వారు ఐదేసి పదములను అధిష్టించి యుందురు. రజ్జువంతాదులను వెనుక వలెనే చేయవలెను. దేశ రాష్ట్ర స్థాపనకొరకు వాస్తుమండలమున మూడువేల నాలుగు వందల పదము ఉండును. మధ్యలో నుండు బ్రహ్మ అరువదినాలుగు పదములకు అధిపతి. మరీచి మొదలగు దేవతల అధికారమున ఏబదినాలుగు చొప్పున పదము లుండును. ఆప మొదలగు ఎనమండుగురు దేవతలకు ముప్పదియారు చొప్పున స్థానములుండును. ఈశానుడు మొదలగు వారు తొమ్మిదేసి పదములకును, స్కందాదులు వందేసి పదములకును ఆధిపతులు. చరకి మొదలగువారి పదములు గూడ తదనుసారముగనే ఉండును. రజ్జువంశాదికల్పన వెనుకటి వలెనే చేయవలెను. వాస్తుదేవపూజ ఇరువదివేల పదముల వాస్తు మండపముమీద కూడ చేయవచ్చును. దానియందు, దేశ వాస్తువునందు వలె తొమ్మిది రెట్లు న్యాసము చేయవలెను. చీ స్థాపన సమయమున ఇరువది యైదు పదముల వాస్తు మండలము విహితము. దానికి వతాల మని పేరు. తొమ్మిది పద ముల మండలము కూడ ఉండవచ్చును షట్కోణ త్రికోణమవృత్తాదిమధ్యమున. చతురస్రవాస్తుమండలము కూడ విహిత మైనది. ఈ వాస్తువు పునాదులు మొద లగువాటికై త్రవ్వు గోతులకు ఉపయోగింపబడును. బ్రహ్మ శిలాత్మక పృషవ్యాసము నందున శారాకనివేశనమునందును, మూర్తిస్థాపనమునందును గూడ వాస్తును ఉపయోగించును. వాస్తుమండలమానం దున్న సమస్తదేవతలకును క్షీరాన్నము నైవేద్యము చేయవలెను. ఉత్తాన క్తము అగు సకలకార్యకలందును, సాధారణముగ, ఐదుశ్రీమదగ్ని మహాపురాణము హస్తముల వెడల్పు, పొడవు గల వాస్తుమండలము నిర్మింపవలెను. గృహప్రాసాదమానానుసారముగ నిర్మించిన వాస్తు మండలమే సర్వదా శ్రేష మని చెప్పబడినది.
అగ్ని మహాపురాణమునందు వాస్తుపూజావిధివర్ణన మను తొంబది మూడవ అధ్యాయము సమాప్తము.
