అగ్ని మహా పురాణము

Table of Contents

282 - అథ వృక్షాయుర్వేదః

ధన్వంతరిరువాచః

ధన్వంతరి పలికెను : ఇవుడు , వృక్షాయుర్వేదమును చెప్పెదను, ఇంటికి ఉత్తరమున ప్లక్షము, తూర్పున వటము, దక్షిణమున ఆమ్లము, పశ్చిమమున అశ్వత్థ వృక్షము మంగళకరములు. ఇంటికి దక్షిణమున మొలిచిన ముండ్ల చెట్లుకూడ మంచివి. ఇంటికి దగ్గరగ ఉద్యానవనమును నిర్మించుకొనవలెను. లేదా ఆన్ని వైపుల అందమైన పుష్పిత తిల వృక్షములు పెంచవలెను. బ్రాహ్మణుని చంద్రుని పూజించి వృక్షములు నాటవలెను. చెట్లునాటుటకు ఉత్తరాన క్షత్రములు మూడును స్వాతిహస్త, రోహిణి, శ్రవణ. మూల ప్రశస్త నక్షత్రములు ఉద్యానములో సుష్కరిణి నిర్మించి దాని లోనికి నదీప్రవాహము వచ్చునట్లు ఏర్పరచవలెను. జలాశయారంభమునకు హస్త, మఖ ఆను రాధ పుష్య జ్యేష్ఠా నక్షత్రములు మూడు ఉత్తరా నక్షత్రములు మంచివి. వరుణుని, విష్ణువును, పర్జన్యుని పూజించి ఈ పని ప్రారంభించవలేను. అరిష్ట అశోక, పున్నాగ, శిరీష, ప్రియంగు, కదళీ, జంబు, వకుల, దాడిమ వృక్షములను నాటి గ్రీష్మ ఋతువునందు దినమునకు ఒకపర్యాయము వర్ష ఋతువు నందు రాత్రియందును భూమి ఎండి పోయినచో నీళ్లు పోయవలెను. చెట్టుకును చెట్టుకును నడుమ ఇరువది హస్తముల ఆంతరము ఉత్తమము, పరునారు హస్తముల ఆంతరము మధ్యమము. పండ్రెండు హస్తముల ఆంతరము అధమము. పండ్రెండు హస్తముల అంతరముగల చెట్లను తీసి వేరొక చోట పాతవలెను. దగ్గర దగ్గరగా వున్న చెట్లు ఫలముల నివ్వవు. ముందుగ వాటిని తగు విధముగా ఖండించి శోధనము చేయవలయును. విడంగ, మృత, పంకములు కలిపిన శీతలజలము వాటికి పోయవలెను. వృక్షముల పండ్లు నశించునపుడు కుళుత, మామ, ముద్దయవ, తిలలు కలిపిన మృత మిశ్రమములో శీతల జలమును పోసివచో అవి సర్వదా ఫలపుష్పముల నిచ్చును. మేకల గొట్టెల ఎరువు యవ చూర్ణము తిలలు వీటిని తడిపి ఏడుదినములు ఒకచోటవుంచి పిదప దీనిని వృక్షములకు వేసినచో ఫలపుష్ప వృద్ధి కలుగును. మత్స్య ములున్న నీరుపోసినచో వృక్షములు వృద్ధి చెందును. విడంగ తండులములతో మత్స్యమాంసమును కలిపి వేసినచో అది అన్ని వృక్షములకును దోహదమగును. వాటి రోగములను తొలగించును.

అగ్ని మహాపురాణమున వృక్షాయుర్వేద కథనమను రెండువందలయెనుబది రెండవ అధ్యాయము సమాప్తము.