అగ్ని మహా పురాణము
125 - అథ యుద్ధ జయార్ణవే నానాచక్రాణి
ఈశ్వర ఉవాచః
నానావిద్యా :
పరమేశ్వరుడు చెప్పెను : “ఓం హ్రీం కర్ణమోటని బహురూపే బహుదంష్ట్రా హుం ఫట్ ఓం హః ఓం గ్రస గ్రస, కృన , కృన , చక, ఛక. హూం వద్ నమః”. ఇది కర్ణమోడీ మహావిద్య, ఇది అన్ని వర్ణములందును రక్ష నిచ్చు శధి. ఈ మంత్రమును చదివినంతమాత్రముననే మనుష్యుడు. క్రోధావిష్టు డగును, వాని కండ్లు ఎర్రవడును. ఈ మంత్రము తూరణ-పాతన-మోహన-ఉచ్చాటనములయం దుపయోగించును. అపుడు స్వరోదయముతో పాటు పంచవిధ వాయుస్థానమాలను, వాటి ప్రయోజనము లమ చేప్పెదను. హృదయమునుండి నాభివరకును వాయుసంచారము జరుగు చుండును. దానికి మారతచక్ర మని పేరు. జపహోమాదులు చేయు సాధకుడు, క్రోధవంతుడై, దానిచే సంగ్రామాది కార్యములందు ఉచ్చాటనాదికార్యములు చేయును. కర్ణములనుండి నేత్రముల వరకును ఉన్న వాయువుచే ప్రభేదన కార్య మును, హృదయమునుండి గుదము వరకును ఉండు వాయువుచే జ్వర దాహములను, శత్రుమారణమును చేయవలెను. ఈ వాయువు పేరు వాయుచక్రము. హృదయమునుండి కంఠము వరకును ఉన్న వాయువునకు రస మని పేరు. దీనికి రసచక్ర మని పేరు. దీనిచే శాంతిప్రయోగము చేయబడును. దాని గుణము పౌష్టికర సతుల్యమ కనుబొమ్మల నుండి నాసికాభాగమువరకును ఉన్న వాయువు పేరు దివ్యము. దీనికి తేజశ్చక్ర మని పేరు. దీనికి గంధము గుణము. దీనిచే స్తంభన-ఆకర్షణములు చేయబడును. సాధకుడు మనస్సును నాసికాగ్రమునందు స్థిరము చేసి, నిస్సందేహముగ స్తంభన. కీలనములు చేయును. పైన చెప్పిన వాయు చక్రమునందు చండఘంటా, కరాలీ, సుముఖీ, దుర్ముఖి, రేవతి, ప్రథమా, ఘోర అను శక్తులను ఆర్చించవలెను. ఉచ్చాటనము చేయు శక్తులు తేజశ్చక్రమునం దుండును. సౌమ్య, భీషణీ, దేవీ, జయ, విజయ, అజితా, అపరాజితా, మహాకోటి, మహారౌద్రీ, శుష్కకాయా, ప్రాణహరా అను పదకొండుగురుశక్తులు రసచక్రమునం దుండును. విరూపాక్షి-పరా-దివ్యలు, పదకొండుగురు ఆకాశమాతృకలు. సంహారీ, జాతహారీ, దంష్ట్రాలా, కుష్క రేవతీ. పిపీలికా, పుష్టిహరా, మహాపుష్టి, ప్రవర్ధనా, భద్రకాళీ, సుభద్ర, భద్రభిమా, సుభద్రికా, స్థిరా, నిష్ఠురా-దివ్యా, నిష్కంపా, గదినీ, రేవతీ అను ముప్పదిఇద్దరు మాతృకలు మారుత-వాయు-రస-దివ్యచక్రములు నాల్గింటి యందను ఎననుండుగురు చొప్పున ఉందురు.
సూర్యుడు ఒక్కడే: చంద్రుడును ఒక్కడే; వారి శ క్తులు కూడ భూతభేదమును బట్టి ఒక్కొక్కటియే; భూమిపై నున్న నదీజలమునకు స్థానభేదమును బట్టి తీర్థసంజ్ఞ కలిగి నట్లే శరీరమునందలి ఆర్థికంజరములో నున్న ఒకే ప్రాణము అనేక మండలముల రూపమున విభక్త మైనది. వాయుదక్షిణాంగములతో యోగముచే ఆదే వాయువు పది విధములైనట్లు, అదే వాయువు తత్వరూప మగువస్త్రమునందు దాగి విచిత్రబిందురూప మగు ముండము ద్వారా, కపాలరూప బ్రహ్మాండము నకు సంబంధించిన అమృతమును త్రాగుచుండును. పంచవర్గ బలముచే యుద్ధమునం దెట్లు జయము కలుగునో వినుము. అ,ఆ,క,చ,ట,త,ప,య,శ లు ప్రథమవర్గము. ఇ, ఈ,ఖ,చ,త,థ,వ,ర,ష లుద్వితీయవర్గము. ఉద్యోగ ,జ,డ,ద,బ,ల,స లు తృతీయవర్గము. ఏ,ఐ,మ,ర,ఠ,ధ,థ,వ,హ లు చతుర్థవర్గము. ఓ, ఔ, అం, అః,జ, జా,ణ,న,మ లు పంచమవర్గము. ఈ నలు బదియైదు అక్షరములు ను మానవులకు ఆభ్యుదయ మిచ్చునవి. వీటికి వరుసగ బ్యాంకుమార .యువన్-వృద్ధ-మృత్యువు అని పేరు. కాలము-ఆత్మ పీడము,శోషకము, ఉదాసీనము అని మూడు విధములు. మంగళవారమునందు ప్రతిపత్తు, కృత్తిక వచ్చినచో అవి లాభదాయకములు. మంగళ వారమున షష్టి మఘనక్షత్రములు వచ్చినచో అవి పీడాక రములు. మంగళ వారమున ఏకాదశీ ఆర్ధానక్షత్రములు వచ్చినచో అవి మృత్యుదాయకములు. బుధవారమున ద్వితీయా మఘాయోగము, సప్తమీ ఆర్ధానక్షత్రయోగము లాభదాయకములు. బుధవార-భరణీనక్షత్రయోగము! హానికరము. బుధవార-శ్రవణ నక్షత్రయోగము “కాలయోగము. బృహస్పతివారమున తృతీయా-పూర్వఫల్గునీ యోగము లాభకరము. బృహస్పతివార మున అష్టమీతిథి-ధనిషానక్షత్రయోగము, అష్టమీ-ఆర్ధాయోగము, త్రయోదశి-ఆశ్లేషాయోగము మృత్యుకారకములు. శక్రపా తమున చతుర్దే-పూర్వాభాద్రాయోగము లక్ష్మీవృద్ధికరము. శుక్రవారమున-నవమీ.పూర్వాషాఢయోగము దుఃఖప్రదవి ద్వితీయా భరణీ నక్షత్రయోగశ యమదండము వలె హానికరము. శనివారమున వంచమీ.కృత్తికాయోగమ లాభకరము దశమి-ఆశ్లేషా యోగము పీడాకారము. పూర్ణిమ-మహయోగము మృత్యుప్రదము.
ఆథ తిథియోగః :
పూర్వ-ఉత్తర-ఆగ్నేయ-నైరృతి-తక్షిణ-వాయవ్య-పశ్చిమ-ఈశాన్యములు పరస్పరము చూచుకొనును. ప్రతిపత్తు వవమి మొదలగు తిథులలో మేషాదిరాశులతో రత్యాదివారములను కలపవలెను. ఈ యోగము కార్యసిద్ధికరము. ఉదా: తూర్పు, ప్రతిపత్తు, మేషలగ్నము, రవివారము ఈ యోగము పూర్వదిశ యందు యుద్ధాదికార్యములందు, సిద్ధిప్రదము. మేషాదిరాళులు నాలుగు, కుంభము-ఈలగ్నములు పూర్ణవిజయము నిచ్చును. ఇతర రాశులు మృత్యుకారకములు. సూర్యాది గ్రహములను, రిపూర్ణాదితిథులను వెనుక దిక్కులవిషయమున చెప్పి నట్లు న్యాసము చేయవలెను. సూర్యసంబంధముచే యుద్ధము నందు ఉత్తమఫల మేదియు లభించదు. సోమసంబంధము సంధిని కలిగించును. మంగలసంబంధముచే కలహ. మగును. బుధ సంబంధమున యుద్దము చేయుటచే ఆభీష్టసాధనములు చేకూరును. గురుసంబంధముచే విజయలాభము కలుగును. శుక్రసంబంధముచే అభీష్టసిద్ధి యగును. శనిసంబంధముచే పరాజయము కలుగును. ఒక పక్షి ఆకారము గీసి దానిముఖ నేత్రా-లలాట-శీర్ష-హస్త-కుక్షి-చరణ-పక్షములందు సూర్యనక్షత్రము మొదలు మూడేసి నక్షత్రములు వ్రాయ వలెను. పాదమునం దున్న మూడు నక్షత్రములలో యుద్ధము చేసినచో మృత్యు వగును. రెక్కలపైనున్న మూడు నక్షత్రములందు ధననాళము. మఖము నందలి మూడు నక్షత్రములందు పీడ కలుగును. శిరస్సునం దున్న మూడు నక్షత్రములందు కార్యనాశనము. కుక్షీయందలి మూడు నక్షత్రములందు యుద్ధము చేయగా ఉత్తమఫలము లభించును. తూర్పునుండి నైరృతివరకును, నైరృతినుండి ఉత్తరమువరకును, ఉత్తర మునుండి ఆగ్నేయమువరకును, ఆగ్నేయమునుండి వశ్చిమమువరకును, పశ్చిమమునుండి ఈశాన్యమువరకును, ఈశాన్యమునుండి దక్షిణమువరకును, దక్షిణమునుండి వాయవ్యము వరకును, వాయవ్యమునుండి ఉత్తరము వరకును నాలుగేసి దండముల వరకు రాహుక్రమణ ముండును. రాహువునుపృష్ణ శునం దుంచుకొని యుద్ధము చేయుట జయప్రదము. రాహువు ఎదురుగా ఉండగా యుద్దము చేసినచో మృత్యువు: ఇపుడ తిథిరాహం విషయము చెప్పెదను. పూర్ణిమ పిమ్మట కృష్ణప్రతిషత్తు మొదలు. ఆగ్నేయముండి ఈర్డాన్యమువరకు, అనగా యుద్ధజియార్ణవే నావాచక్రాణి కృష్ణ అష్టమివరకు రాహువు పూర్వాది దిక్కున ఉండును. ఆచట యుద్దము చేయుటచే జయము కలుగును. ఈశాన్యమునుండి ఆగ్నేయము వరకును, నైరృతి నుండి వాయవ్యము వరకును రాహుక్రమం ముండును మేషాదిరాళులను పూర్వాదిదిక్కులం దుంచవలెను. ఇట్లుంచగా మేష-సింహ-ధనూరాశులు తూర్పునను, వృషభ-కన్నా-మకరరాశలు దక్షిణ మునందును, మిథున-తులా-కుంభములు పశ్చిమమునందును, కర్కటక-వృశ్చిక-మీనములు ఉత్తరమునందును ఉండును. సూర్యరాశిని పట్టి సూర్యుని దిక్కు తెలిసికొని, సూర్యుడు సమ్ముఖుడై ఉన్నపుడు యుద్ధము చేయుట మృత్యుకారకము, కృష్ణ పక్షమునందు తృతీయా-సప్తమీ-దశమీ-చతుర్దశితిథులు భద్రతిథులు. శుక్ల పక్షమునందు చతుర్థి-ఏకాదశీ-ఆప్షమీ పూర్ణిమలు భద్రతిథులు. ఆగ్నేయమునుండి వాయవ్యము వరకును భద్రానివాసము.
అ, క, చ, ట, త, ప, య, శ- అవి ఎనిమిదివర్గములు. వీటి ఆధిపతులు వరుసగ నూర్య-చంద్ర-కుజ-బుధ-గురు-శుక్ర-శని-రాహువులు. ఈ వర్గముల పక్షులు క్రమముగ గృధ్ర-ఉలూక-శ్యేనపింగళ-కౌశిక-సారస-మయూర-గోరంకు పక్షులు మొదట హోమములు చేసి మంత్రసిద్ధి చేసికొనవలెను. ఉచ్చాటనమున మంత్రప్రయోగము పల్లవరూపమున చేయవలెను. వశ్య-జ్వర-ఆకర్షణములందు పల్లవప్రయోగము సిద్ధికరము. శాంతియందును, మోహన ప్రయోగమునందును, ‘నమః’ అని చెప్పుట మంచిది. పుష్టి-వశీకరణములందు ‘వౌషట్’, మారణ-ప్రీతివినాశములందు ‘హుం’ ప్రయోగించవలెను. విద్వేషణమునందును, ఉచ్చాటనము నందును ‘ఫట్’ చెప్పుట మంచిది. పుత్రాది ప్రాప్తి ప్రయోగమునందును దీప్త్యాదులందును ‘వషట్’ చెప్పుట మంచిది. ఈ విధముగ మంత్రములలో ఆరు జాతు లేర్పడినవి. ఇపుడు అన్ని విధముల రక్షణము నిచ్చు ఓషధులను గూర్చి చెప్పుచున్నాను. మహాకాళీ, చండీ, వారాహీ, ఈశ్వరీ, సుదర్శనా, ఇంద్రాణీ-ఈ ఓషధులను శరీరము పై ధరించుటచే ధారకునకు రక్ష కలుగును. బలా, అతిబలా, భీరు, ముసలీ, సహదేవీ, జాతి, మల్లికా, యూథ, గారుడి, భృంగరాజ, చక్రరూపా-ఈ మహౌషధులను ధరించుటచే యుద్ధమునందు విజయము కలుగును. మహాదేవి ఈ ఓషధులను గ్రహణ సమయమున వెలికి తీయట శుభదాయకము. సర్వాంగ సంపన్న మెన ఏనుగ మూర్తి ఒకటి నిర్మించి, దాని పాదము క్రింద శత్రువుమూర్తి నుంచి, స్తంభన వయోగము చేయవలెను. లేదా ఒకే వృక్షమున్న ఒక పర్వతోపరిభాగమునందు ఆ చెట్టు క్రింద గాని, పిడుగుపడిన చోటున గాని, పుటమట్టితో ఒక స్త్రీమూర్తి నిర్మించి. “ఓం నమో మహాభైరవాయ వికృతదంష్ణోగ్ర రూపాయ పిజ్జలాశాయ, త్రిశూల ఖడరరాయ ‘పౌషట్’ అను మంత్రముచే ఆ మృత్తిక మయ దేవీమూర్తికి పూజ చేసి, శత్రువువద్ద నున్న శస్త్ర సమూహమున స్తంభింపచేయవలెను.
విద్యే స్వాహా.
ఇపుడు యుద్ధమున విజయము చేకూర్చు ఆగ్ని కార్యమును గూర్చి చెప్పెదను. రాత్రి శ్మశానమునకు వెళ్ళి నగ్నుడై శిఖ విర బోసికొని, దక్షిణాభిముఖముగ కూర్చుండి జ్వలించుచున్న చితియందు మనుష్యమాంసర క్తములను, విషమును, ఊక ఎముకలు కలిపి, శత్రువు పేరు చెప్పుచు “ఓం నమో......విద్యేస్వాహా” అను (మూలములోనున్న) మంత్రముతో ఎనిమిదివందల పర్యాయములు హోమము చేయవలెను. అట్లు చేయగా శత్రువు బద్దుడై పోవును. (గ్రుడ్డివా డగును.) దేవీ! “ఓం వజ్రకాయ.........హుం ఫట్” అను (మూలములో నున్న) మంత్రమును మూడువేల ఎనిమిదివందల (3800) పర్యాయములు జపము చేయగా హనుమంతుడు అన్ని కార్యములను సమకూర్చును. వస్త్రముపై వ్రాసిన హనుమన్మూర్తిని చూపగనే శత్రువులు నశింతురు.
అగ్నిమహాపురాణమునందు, యుద్ధజయార్ణవమున నానాచక్రవర్ణన మను నూటఇరువది యైదవ అధ్యాయము సమాప్తము.
