అగ్ని మహా పురాణము

Table of Contents

226 -  అథ సామాద్యుపాయకథనమ్

పుష్కర ఉవాచః

పుష్కరుడు పలికెను : పరశురామా ! మనుష్యుడు పూర్వము తాను ఇతర శరీరముతో చేసిన కర్మకే దైవమని పేరు. అందుచే బుద్ధిమంతుడు పురుషకారమే శ్రేష్టమైనదని తెలిసికొనవలెను. దై వము ప్రతికూలముగా నున్న చో పురుష కార ముచే దానిని అనుకూలము చేసికొనవచ్చును పూర్వము చేసిన సాత్త్విక కర్మల ఫలితముగా ఈనాడు, పురుష కార మేమియులే కన్నను సిద్ది లభించును. భృగునందనా ! పురుషకారమే దైవసాహాయ్యముతో తగు సమయమునందు ఫలమిచ్చు చుండును. దైవ పురుషకారములు రెండును. మానవునకు ఫలమునిచ్చును. పురుషకారముచే వ్యవసాయము చేయగా వర్ష యోగమం వచ్చినపుడు సమయానుసారము ఫలము లభించు ఆందుచే కర్మానుష్టానము చేయుచు పురుషకారమునందు కూడ ప్రవర్తించవలెను, గాని కేవలము దైవమునే నమ్ముకొని కూర్చుండ కూడదు. సామాద్యుపాయములతో ప్రారంభించిన సర్వకార్యములును సిద్ధించును. సామము, దానము, భేదము, దండము, మాయ ఉపేక్ష, ఇంద్రజాలము అని ఏడు ఉపాయములు. వాటి స్వరూపమును గూర్చి వినుము. తథ్యము, ఆతథ్యము అని సామము రెండు విధములు. అతథ్య సామము పురుషులకు అపకీర్తి కరము; ఉత్తమవంశ సుజాతులు, సరస్వభావులు, ధర్మపరాయణులు, జితేంద్రియులు అయిన పురుమలు సామమునకు లొంగుదురు. ఆతథసామముచే రాక్షసులను కూడ లొంగదీసి కొనవచ్చును. వారుచేసిన ఉపకారములను వర్ణించుటయే వారిని వశముచేసికొమటకు మంచి ఉపాయము. పరస్పరద్వేషవంతులై, కుపితుడై , భయభీతులై, ఆవమావితులై ఉన్న వారి విషయమున భేదమును ప్రయోగించవలెను. వారికి ఇంకను భయము కలుగునట్లు చేయవలెను. తమవైపునుండి వారికి ఆశ చూపించి, ఏదోషముచే వారు ఇతరుల నుండి భయపడుదురో దానిని ప్రకటించి వారిలో భేదము పట్టించవలెను. శత్రుకుటుంబమానంద భేదమును పుట్టించువారిని రక్షించవలెను. సామంతులకోపము మంత్రి-పుత్రాదుల కోపము ఆంతరకోపము. అందుచే ముందుగా అంతకోపమును శమింపచేసి, పిదవ రాహ్యకోపమన తొలగింప ప్రయత్నించవలెను.

అన్ని ఉపాయములలో దానము శ్రేష్టమైనది. దానముచే ఇహపరములు రెండింటియందును ఫలములభించును. దానముకు లొంగని వారెవరునలేరు. దానము చేయువాడు పరస్పరము కలిసియున్న వారిలోకూడ భేదమును కలిగించును సామదాన భేదమ లచే సిద్ధించనికార్యములనుదండముచే సిద్ధింపచేసికొనవలెను. దండమునందే సర్వమును ఉన్నది. కాని దండమను అనుచితరీతిలో ప్రయోగించినచో అది ఆత్మవినాశ హేతువగును. దండింపతగని వానినిడండించువాడును, దండింపతగినవానిని దండించనివాడును అయిన రాజు వినాశముపొందును. రాజు దండముద్వారా అందరిని రక్షించ కున్నచో దేవతలు, దైత్యులు, సాగులు, మనుష్యులు, సిద్దులు, భూతములు, పక్షులు-అందరును తమతమమర్యాదలను ఉల్లంఘింతురు. కురులను అణచివేసి, దండనీయులను శిక్షించును గానదీనికి దండమని పేరు. రాజు ఇతరులు చూడజాలని విధమున తేజస్సుతో ప్రకాశించునపుడు అతడు సూర్యుని వంటివాడు. దర్శనమాత్రముచే ఆనందమును కలిగించునపుడు అతడు చంద్రునివంటివాడు. గూఢచారులద్వారా ప్రపంచకము నందంతటను వ్యాపించియుండుటచే ఇతడు పోయుతుల్యుడు. దోషములను చూచి దండించుటచే ఇతడు యమధర్మరాజసమానుడు. కుటిలబుద్ధిగల దుష్టులను చూచి దండించునుగాన అతడు సాక్షాత్తు ఆగ్ని దేవుడు. బ్రాహ్మణులకు దానములిచ్చునపుడు ధనాధి పతియైన కుబేరుడు. దేవతాదులనుద్దేశించి హవిస్సు, ఘృతము మొదలగు వాటిని ధారగావిడచును గాన వరుణుడు. ఓర్పుతో ఈ జగత్తునంతను ధరించునుగాన పృథ్వీరూపుడు. ప్రభుమంత్రోత్సాహశక్తులతో అందరిని పాలించునుగాన సాక్షాత్తు శ్రీమహా విష్ణుస్వరూపుడు.

ఆగ్ని మహాపురాణమునందు సామాద్యుపాయకథనమను రెండువందల ఇరువదియారవ అధ్యాయము సమాప్తము.