అగ్ని మహా పురాణము

Table of Contents

57 - అథ కుంభాధి వాసవిధి

హయగ్రీవుడు చెప్పెను: దేవతాప్రతిష్టా పూజల కొరకై గ్రహించిన భూమి పై నార సింహ మంత్రము చదువుచు రాక్షసులను తొలగించు అక్షతలు, ఆవాలు, పంచగవ్యములు చల్లవలెను. రత్నయుక్తమగు కలశ పై అంగ దేవతా సమేతుడగు శ్రీహరిని పూజింపవలెను, ఆస్త్ర మరభ్రతముతో నూటఎనిమిది పాత్రలను పూజింపవలెను. . అవిచ్ఛిన్న ధారతో వేదిని తడిపి, ధాన్యము చల్లవలెను. కలశను ప్రదక్షిణాక్రమమున త్రిప్పి చిమ్మిన అన్నము పై ఉంచవలెను. కలశకు వస్త్రము చుట్టి దానిపై లక్ష్మీ నారాయణులను పూజింపవలెను. “యోగే-యోగే ఇత్యాది మంత్రము పఠించుచు మండలమున శయ్యను స్థాపింపవలెను. స్నాన మండపమున కుశ లీపై శయ్యదాని పై పరుపు పరిచి, దిక్కుల యందును. “ఏదిక్కుల యందును విద్యాధిపతులను (విష్ణువు యొక్క విభిన్న విగ్రహములను) పూజింపవలెను.” పూర్వాది దిక్కులందు క్రమముగ విష్ణ-మధు సూదన-త్రివిక్రమ-వామనులను, ఆగ్నేయాది “విదిక్కులందు క్రమముగ శ్రీధరహృషీ కేశ -పద్మనాభ దామోదరులను పూజింవ వలేను. దామోదరుని ఈశాన్యమున పూజింపవలెను. పిమ్మట స్నాన మండపమున, ఈశాన్యమునందున్న వేదిపై ఉన్న నాలుగు కలశ లలో స్నానమునకు ఉపయోగించు” అన్ని శ్రవ్యమలను ఉంచవలెను: ఆ కలశములను నాలుగు దిక్కులందును ఉంచవలెను. భగవదభిషేకము నిమిత్తమై ఏర్పరచిన ఆ కలశలను చాల గౌరవభావముతో ఉంచవలెను.  తూర్పున నున్న కలశ పై వట - ఉదుంబర అశ్వత్త-చంపక-అశోక బిల్వ-పలాశ అర్జున-ప్లక్ష కదంబవకుల-చూతపల్లవములను ఉంచవలెను. దక్షిణ దిక్కునందున్న కలశలో కమల రోచనా దూర్వాదర్భ-జాతీపుష్ప-కుంద-చందన-రక్త చందన శీర్దార్థ- తగర- తండులములను ఉంచవలెను. పెళ్చిన డిక్కునందున్న కలశలో బంగారము, వెండి, సముద్రములోనికి ప్రవహించునది యొక్క రెండు తటములందలి మట్టి, విశేషమగు గంగావృత్త, గోమయము, యవలు, వరిబియ్యమం ఉంచవలెను.

ఉత్తర దిక్కునందున్న కలశ లో విష్ణువర్ణి, జోలపర్ణి, భృంగరాజము, శతావరి, సహదేవి, వచ, సైంటా, బల, వ్యాఘ్, లక్ష్మణ అను ఓషధులనుంచవలెను. ఈశాన్యము నందున్న మరొక కలశలో మాంగలిక వస్తువుల నుంచవలెను. అగ్ని కోణము నందును. రెండవ కలశలో ఏడు స్థానముల నుండి గ్రహింపబడిన మట్టి, ఉంచవలెను. నైరృతి దిక్కునందున్న కలశ లో గంగ ఇసుకను, గంగా జలమును ఉంచవలేను, వాయవ్య కోణము నందున్న మరొక కలశము నందు సూకర. వృషభ-గజముల దంతముల చేతను కొమ్ముల చేతను పెకలించిన మట్టిని, పద్మము మొదట్లో నున్న మట్టిని, ఇతర కలశము నందు దర్భల మొదట్లో నున్న మట్టిని ఉంచవలెను. మరొక కలశము నందు పర్వత మృత్తికతో కూడిన జలము ఉంచవలేను. మరొక కలశము నందు నాగ కేసర పుష్ప కేసరముల నుంచవలెను. మరొక కలశము నందు చందనము, అగురు, కర్పూరము కలిసిన ఉదకము నింపి, వైదూర్య-విద్రుమముక్త-స్ఫటిక -వజముల నుంచవలెను,

వీటివన్నింటిని ఒక కలశ లో నుంచి, దానిపై ఇష్టదేవతను స్థాపింపవలెను. ఇతర కలశ యందు, నదులు, కొండ కాలువలు, చెరువులు వీటి నీటితో కూడిన జలము మంచవలెను. ఎనుబది యొక్క పదముల వాస్తుమండపము నందు ఇతర కలకలను స్థాపింపవలెను. ఈ కలశలను గంధోదకాదులతో నింపవలెను, వాటినన్నిటిని శ్రీ సూక్తముతో అభిమంత్రించ వలెను. ఒక పాత్రలో, అర్ఘ్యము కొరకై, ఆవాలు, గంధము, కుశాగ్రములు, అక్షతలు, ఫలములు, పుష్పములు ఉంచి తూర్పున ఉంచవలెను. కమలములను, శ్యామాలతను, దూర్వాదలములను, విష్ణుక్రాంతను, కుశములను, పాద్యముకొరకై దక్షిణము నందుంచవలెను. మధుపర్కము పశ్చిమము నందుంచవలెను. క్కల లవంగ జాతీఫలములను ఆచమనీయార్థమై ఉత్తరమునందుంచవలెను. దూర్వాక్షతలతో కూడిన ఒక పాత్రను నీరాజనమునకై ఆగ్నేయము నందుంచవలెను. ఉద్వర్తనపాత్రను చ్యాంకనందును, ఈశాన్యమున. గంధపిష్టపాత్రను ఉంచవలెమ, కలశ లో సురామాంసి, ఉసిరికాయ, సహదేవి, పసుపు వెదలైనవి చేయవలెను. నీరాజనము కొరకై, అరువది ఎనిమిది దీపములుంచవలెను, శంఖము, చక్రము, శ్రీవత్సము, వజ్రము, కమలములు, మొదలైన వివిధ వర్ణముల గల పుష్పము సువర్ణాది. పాత్రలలో సమకూర్చుకొనవలెను.

అగ్ని మహాపురాణము నందు కుంభాధివానమను ఎనుబది ఏడవ ఆధ్యాయము సమాప్తము.