అగ్ని మహా పురాణము
78- పవిత్రారోహణవిధి
అన్ని దేవతామార్తలకును ఉపయోగించు నాల్గవ విధమగు పవిత్రకము ఆ దేవతామూర్తి తో కాని, దాని పిండితో గాని సమముగా నుండును. దీనికి “గంగావతారకము” అని పేరు. దీనిని సద్యోజాతమంత్రముతో బాగుగా శుభ్రము చేసి, వామదేవమంత్రముతో గ్రంథి వేసి, అఘోర మంత్రముతో శుద్ధి చేసి, తత్పురుష మంత్రముతో రక్తచందనము, కుంకు మము పూయవలెను. లేదా కస్తూరి, గోరోచనము, కర్పూరము, పసుపు, గైరికము మొదలగునవి కలిపి చేసిన రంగు పూయవలెను. పది గ్రంథులు కాని, ఎన్ని తంతువులు లున్న వో అన్ని గ్రంథులు కాని వేయవలెను. ఒక గ్రంథినుండి మరొక గ్రంథి దగ్గరకు ఒక అంగుళము గాని, రెండు ఆంగళము గాని, నాలుగు అంగుళములు గాని దూర వండ వలెను. అందముగా ఉండు విధమున దూర ముంచవలెను. ప్రకృతి, పౌరుషి, వీర, ఆపతాజిత, జయ, విజయ, సదాశివ, మనోన్మని, సర్వతోముఖి అనువారు పది గ్రంథుల అదిష్టానదేవతలు, పది కంటే ఎక్కువ గ్రంథులు కూడ అందముగా వేయవలెను. పవిత్రకము చంద్రమండల - అగ్ని మండల - సూర్యమండలములతో కూడి యున్నట్లు భావన చేయుచు, ఆది సాక్షాత్తు శివునితోతుల్య మైన దని భావించుచు హృదయమునందు ధరించవలెను. శివరూపునిగా భావించిన తనకుమ, పుస్తకమునకును, గురుగణమునకును ఒక్కొక్క పవిత్రకమును సమర్పించవలెను.
ద్వారపాల - దిక్పాల - కలశాదులపై గూడ ఒక్కొక్క పవిత్రకము ఉంచవలెను. శివలింగములకు అర్పించు పవిత్రకము పొటవు ఒక హస్తము మొదలు తొమ్మిది హస్తముల వరకును ఉండును. ఒక హస్తము పొడవైన పవిత్ర కము నందు ఇరువది ఎనిమిది గ్రంథు లుండును. పిమ్మట క్రమముగ పదేసి గ్రంథులు పెంచవలెను. ఈ విధముగ తొమ్మిది హస్తముల పవిత్రకము నందు నూట ఎనిమిది గ్రంథు లుండును. ఈ గ్రంథుల మధ్య వ్యవధానము ఒకటి రెండేసి అంగుళము లుండును. వీటి మానము కూడ లింగ విస్తారమును బట్టి యుండును. ఉపాసకుడు సప్తమీదివసమున గాని, త్రయోదశీ దివసమున గాని, నిత్యకర్మాదులు ముగించుకొని సాయంకాలమున పుష్ప వస్త్రాదులతో యాగ గృహమును ఆలంక రించవలెను. నైమిత్తిక సంధ్యోపాసన చేసి, విశేషతీర్పణములు చేసి, పిమ్మట పూజార్థమై నిశ్చితమైన పవిత్రభూమి భాగమునందు సూర్యుని పూజించవలెను. ఆచార్యుడు, ఆచమనము, సకలీకరణము పూర్తి చేసి ప్రణవోచ్చారణ పూర్వక మగ ఆర్ఘ్య పాత్రమును హస్తమున గ్రహించి, అస్త్రతంత్రము (ఫట్) ఉచ్చరించుచు క్రమముగ పూర్వాదిదిక్కులందున్న ద్వారములను ప్రోక్షించి హజించవలెను. “హాం” నీకలద్వారాయ నమః, హాం విద్యాకలాద్వారాయ నమః, హాం నివృత్తి కలద్వారాయ నమః, హాం ప్రతిష్టాక లాద్వారాయ నమః” అను మంత్రములతో పూర్వాది దిగ్జ్వరముల పూజ చేయవలెను. ప్రతిద్వార మునకును కుడి - ఎడమ ప్రక్కలనున్న ఇద్దరిద్దరు ద్వారాపాలకులను పూజించవలెన. తూర్పున.
పూజించి, పూర్వాదిదిక్కులందు ఇంద్రాదిదిక్పాలకులను, మండపమధ్యభాగమున బ్రహ్మను విష్ణుశివాదులను పూజించవలెను. కలశపృష్ఠభాగమును అనుసరించి యున్న వర్ధినిని చక్కగ హ స్తమునందు గ్రహించి, మంత్రజ్ఞుడగు గురువు, శివుని ఆజ్ఞను వినిపించవలెను. ప్రదక్షిణక్రమమున తూర్పునుండి ఈశాన్యము వరకును అవిచ్చిన్న జలధార విడచుచు మూల మంత్రము నుచ్చరించవలెను. యజ్ఞమండపరక్షకొరకై శస్త్రరూప మగు వర్గనిని నాల్టుప్రక్కల త్రిప్పవలేను. ముందుగ కలశను స్థాపించి, దాని వామభాగ మున, వస్త్రము కోరకై వర్ధని స్థాపించవలెను. ఉత్తమము, స్థిరముఅగు ఆసనముపై నున్న కలశముపై శివుని, ప్రణవము పై ఉన్న వర్ధని పై శిపుని - ఆయుధములను పూజించవలెను. లింగముద్రచే ఆ రెండింటిని కలిపి భగలింగసంయోగమును కల్పింపవలెను.కలశముపై జ్ఞానరూప మగు ఖడ్గమను సమర్పించి మూల మంత్రజపము చేయవలెను. ఆ జపములో దశాంశ హోమము చేసి వర్గనిలో రక్షను ఘోషించవలెను. వాయవ్యమున గణేశ పూజ చేసి, పంచామృతాదులతో శివునకు స్నానము చేయించి, పూర్వము చెప్పిన విధమున పూజ చేసి, కుండమునందు అగ్నిరూపు డగు శివుని పూజించవలెను. యధావిధిగ చరువు వంచి, సంపాతాహుతివిధానముచే దానిని శోధించి, పిమ్మట శివుడు, ఆగ్ని, ఆత్మ (తాను) అను ముగ్గురు అధికారుల కై చిన్న గరిటెతో ఆ చరువును మూడు భాగములు చేసి, శివ. ఆగ్ని కుండమునందు సమర్చించి, తన భాగమును సురక్షితముగ ఉంచుకొనవలెను.
తత్పురుషమంత్రమునకు ‘హుం’ చేర్చి ఉచ్చరించుచు తూర్పున ఇష్టదేవతకు దంతధావనమును సమర్పింపవలేను. అ ఘోరమంత్రమునకు “పషట్లో చేర్చి ఉచ్చరించుచు ఉత్తరమున ఉసిరికాయ సమర్పించవలెను. వామదేవమంత్రమునకు “సాహో” చేర్చి ఉచ్చరించుచు జలము నివేదించవలెను. ఈశానమంత్రముతో ఈశాన్యమునందు సుగంధితజలమును సమర్పింపవలేను. పంచగవ్యములు, పలాశ ములు మొదలగువాటి దొన్నె లు అన్ని దిక్కులందును ఉంచవలెను. ఈశాన్య మున పుష్పములు, ఆగ్నేయమున గోరోచనము, నైరృతియందు అగురు, వాయవ్యమున చతుఃసమమును (రెండు పాళ్లు కస్తూరి, నాల్గు పాళ్లు చందనము, మూడు పాళ్లు కుకుమము, మూడు పాళ్లు కర్పూరము కలిపి చేసిన గంధద్రవ్యము చతుః సమము) సమర్పించవలెను. లేతాకులతో కూడ సమ స్తహోమద్రవ్యములను సమర్పింపవలెను. దకము, అక్షసూత్రము, కౌపీనము, భిక్షాపాత్రము కూడ దేవతావిగ్రహమునకు సమర్పించవలేను. కాటుక, కుంకుమము, సుగంధతైలము, కేశములను
స్వరూపుడగు అగ్ని కిని, దిక్కులలో నివసించువారికిని. దిక్పాలకులకును, భూతగణములకును మాతృగణములకును, ఏకాదశ రుద్రులకును, క్షేత్రపాలాదులకును, వారి నామమంత్రముకు “నమ- స్వాహా చేర్చి ఆహుతి రూపమున సమర్పించవలెను. పిమ్మట ఈ దేవతల చతుర్వంతనామములకు “అయం బలి” అను పదములు చేర్చి బలి సమర్పింపవలెను. పూర్వాది దిక్కులంత దిగ్గజాదులకును, దిక్పాలకులకును, క్షేత్రపాలునకును, ఆగ్ని కిని బలి సమర్పించవలెను. పిమ్మట పూర్ణాహుతి. వ్యాహృతి హోమములు చేసి ఆగ్ని దేవుని ఆవరుద్ధుని చేయవలెను.
పిమ్మట “ఓం అగ్నయే స్వాహా” “ఓం సోమాయ స్వాహా “ఓం అగ్నే షోమాభ్యాం స్వాహా “ఓం ఆగ్నయే స్విష్ణకృతే స్వాహా” అను నాలుగు మంత్రములతో నాలుగు ఆహుతు లిచ్చి, తరువాతి పనులను ఏర్పాటుచేసికొనవలెను. అగ్ని కుండములో పూజింపబడిన ఆరాధ్యదేవత యగు శివుని పూజామండలమునందు పూజింపబడిన కలశ స్థశివునితో నాడీసంధాన విధిచే కలిపివేయవలెను. “ఫట్' 'నమః' అని ఉచ్చరించుచు అస్త్రన్యాసహృదయన్యాసములు చేసి పవిత్రముల నన్నింటి వెదురుబుట్ట వంటి పాత్రలో ఉంచవలెను. ఈశానికలాత్మనే నమః”, “విద్యాకలాత్మనే నమః”, “నివృత్తికలాత్మనే నమః”. “ప్రతిష్టాకలాత్మనే నమః”, “శాన్యతీతకళాత్మనే నమః” అను కలామంత్రములతో వాటిని ఆభిమంత్రించవలెను. పిదప ప్రణవమంత్రముతోగాని, మూలమంత్రముతో గాని షడంగన్యాసము చేసి “నమః” “హుం” “ఫట్” ఉచ్చరించుచు వాటిపై క్రమముగ హృదయకవచ_అస్త్రములను సంబంధింపచేసి, వాటినన్నింటిని సూత్రములతో చుట్టబెట్టవలెను. పిదప “నమః” “స్వాహా” “వషట్” ‘హుం' 'వేషట్' ఓవట్' ఆను అంగమంత్రములతో వాటినన్నింటిని పూజించి, భక్తినమ్రుడై, వాటి రక్ష కొరకై , శివునను సమర్పించవలెను. పుష్ప-ధూప దీపాదులతో పూజించబడిన సిద్ధాంతగ్రంథముపై పవిత్రకము సమర్పించి, గురుచరణసమీపము, చేరి ఆయనకు భక్తిపూర్వకముగ పవితకము సమర్పింపవలెను. అచటినుండి బైటకు వచ్చి, ఆచమనము చేసి, గోమయముతో అలికిన మండలత్రయముపై, వరుసగ పంచగవ్యమును, చదువును, దంతధావన మును పూజించవలెను. పిమ్మట ఆచమనము చేసి, మంత్రముచే ఆవృతుడై రక్షణము కల్పించుకొన్న సాధకుడు రాత్రి యంతయు సంగీతముతో జాగరము చేయవలెను. భోగములు కోరువాడు, ఆర్థరాత్రి దాటిన పిమ్మట శివుని స్మరించుచు, కుళాసనముపై నిద్రించవలెను. మోక్షేచ్ఛకలవాడు, ఈ విధముగనే జాగారము చేసి, ఉపవాసపూర్వకముగ ఏకాగ్రచిత్తుడై భస్మకయ్య పై నిద్రించవలెను. భస్మశయ్యపై నిద్రించవలెను.
ఆగ్ని మహాపురాణమునందు పవిత్రారోహణవిధియను డెబ్బది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
