అగ్ని మహా పురాణము

Table of Contents

302 - అథ నానా మంత్రౌషధ నిరూపణమ్

అగ్ని రువాచః

అగ్ని దేవుడు పలికెను. “ఐ, కులజే ఐం సరస్వతి స్వాహా" ఇది పదకొండు అక్షరముల ముఖ్యమంత్రమైన సరస్వతీ విద్యా. "ఉప్పులేని ఆహారము తినుచు అక్షర లక్షలు జపము చేసినవాడు బుద్ధిమంతుడగును. ఆత్రి (ద్) అగ్ని (ర్) వామనేత్ర (ఈ) బిందు (9) ఇవి కలుపగా ఏర్పడిన “హ్రీం” యను మంత్రము శత్రువులను పారద్రోలు మహామంత్రము. వజ్ర కమలములను ధరించిన పీతవర్ణుడగు ఇంద్రుని ఆ వాహనచేసి పూజించి మృత తిలములతో లక్ష హోమములు చేయవలయును. పిదప తిల మిశ్ర జలముతో ఇంద్రునకు అభిషేకము చేయవలయును. అట్లు చేయుటచే రాజు కోల్పోయిన రాజ్యమును పుత్రాదులను పొందును. హీం అనుదానికి “శక్తి దేవ” యని పేరు దీని ఉద్దారము ఘోష అగ్ని దండి దండములు. శివా శివ పూజలు చేసి ఈ మంత్రమును జపించవలయును. అష్టమీనుండి చతుర్దశి వరకు పూజలో వుండవలెను. చేతులలో చక్రము పాశము అంకుశము అభయముద్ర ధరించిన వరదాత్రియగు దేవిని ఆరాధన చేసి హోమాదులు చేయుటచే సౌభాగ్యము కవితాశ క్తి పుత్రులు లభింతురు. “ఓం హ్రీం ఓం నమః” మొదలు "కురు కురు ఓం" వరకును వున్న మూలోక మంత్రమును జపాదులు చేయుటచే సంపూర్ణ జగత్తువక ములో నుండును. ఓం హ్రీం చాముండే అముకం దహ దహ పచపచ మమవశమానయస్వాహా ఓం" ఇది చాముండా వశీకరణమంత్రము. ఈవశీకరణ ప్రయోగ సమయమున శ్రీ చల్లని త్రిఫలాజలముతో తన గుహ్యాంగమును కడుగుకొనవలయును. అశ్వగంధయవ క్షార హరిద్రా కర్పూరా దులు కూడ ఇందుకు ఉపయోగించవచ్చును. ఎనిమిది పిప్పలి తండులములు ఇరువది మిరియముగింజల బృహతీ రసము వీటి లేపముచే కూడ మరణాంతము వరకు వశము చేసుకొన గలుగును. కటినమూ త్రికటు ఔద్ర లేపముకూడ ఇందులకు ఉపయోగించును. హిమ, కపిత్తక రస, మాగధి మధు వీటి ప్రయోగము దంపతులకు క్షేమకరము. శర్కర కలిపిన కబందరసమును మధువును గుహ్యాంగము నందు లేపనము చేసినచో వశీకరణమగును. సహదేవి, మహాలక్ష్మి పుత్రజీవి కృతాంజలులు చూర్ణమును శిరస్సుపై ఉంచినచో ఇది ఉత్తమమైన వశీకరణ సాధనము. త్రిఫలా చందన ముల క్వాథము ఒక ప్రస్తము వేరుగాను రెండుకుడవములు వేరుగాను వుచి భృంగ పామరసములు అంతే ప్రమాణము గల పసువు చుంబకము తేనె. నేతిలో ఉడికించినపుడు పసుపు, ఎండిన పసుపు వీటి అన్నిటికో లేపము తయారుచేసి ఔదారి జటా మాంస చూర్ణము నందు శర్కర కలిపి బాగుగా మర్దించి పాంతో ప్రతిదినము సేవించు పురుషుడు శ్రీ శతముతో సంగమము చేయకలుగును.

గుల్మ, మాష, తిలవ్రీహి చూర్ణములతో పాటు శర్కరకలిపి ఆశ్వత్థ వంశ, దర్భమూల వైష్ణవీ శ్రీ మూలము లను దూర్వా అశ్వగంధ మూలములను పుత్రులు కోరు స్త్రీ పాలతో త్రాగ వలెను. కాంతిలక్ష్మి శిఫాధాత్రి. వజ్ర, లోధ్ర, వటాంకురములను స్త్రీ ఋతుకాలమునందు ఆజ్య క్షీరములు కలిపి త్రాగవలెను. పుత్రుడు కలుగును, పుత్రార్థినియగు స్త్రీ శ్రీయను ఓషధీమూలమును వటాంకురమును క్షీరముతో త్రాగవలెను. శ్రీ వటాంకుర దేవీల రసమును నశ్యముగా తీసుకొనవచ్చును. త్రాగవచ్చును. శ్రీ పద్మమూల అశ్వత్థ ఉత్తరమూ ములను పాలతో త్రాగవలెను. కారాస ఫలము అను పల్లవములను పాలలో నూరి పలుచగ చేసి త్రాగవలెను. అపామార్గ నూతన పుష్పాగములను గేదెపాలతో త్రాగ వలెను. పైన చెప్పిన ఆరున్నర శ్లోకములలో నాలుగు పుత్రప్రాప్తియోగమును చెప్పబడినవి. స్త్రీకి గర్భ స్రావమగుచున్నచో శర్కర, ఉత్పల పుష్ప, అక్షలోధ్ర, చందన, శార్దాలతను బియ్యపుకడుగులో నూరిగాని లేదా లాజాయష్టిసిలా, ద్రాక్ష, మధు, ఘృతములను కలిపిగాని స్త్రీ సేవించవలెను.

ఆటరూష, కలాంగలీ, కాకమాచీ శివలను నూరి నాభి క్రిఁదు భాగమన పూసినచో సుఖప్రసవమగును. రక్త శుక్ల జపాపుష్పములు రక్త శుక్ల ఓషధులు కలిపి త్రాగవలెను. కేసరబృహతీ మూల గోపీ షష్టి తృణోత్పలము లను మేక పాలతో నూరి తైలము కలిపితిన్నచో వెంట్రుకలు మొలచును, జుట్టు ఊడిపోకండగ చేయుటకు కూడ ఇవి ఉపయో గించును. ధాత్రి, భృంగర సములు ఒక్కొక్క ప్రస్థము, తైలము, ఒక ఆడకము పాలు షష్టి ఆంజనల ఒక పలము తైలము ఇవియన్నియు నేతకేశ శిరస్సులకు హితకరములు. హరిద్రా రాజవృత్వక్ చించాలవణ లోధ్ర పితఖారులు, ఆవుల పొట్ట ఉబ్బురోగమును తొలగించును, ఓం నమోభగవతే మొదలుకురు ఠఠత వరకును గల మూలో క్తమంత్రము గోసముదాయర ఇక్షామంత్రము. మహాసేనుడు, వీరుడు అగు మంటాకర్ణుడు మహాబలవంతుడని చెప్పబడివాడు. జగత్పతియైన ఆతడు మహామారి వినాశకుడు. అతడునన్ను రక్షించుగాక ! ఈ రెండు మంత్రములుగోరక్షక మంత్రములు. వీటిని వాసి ఇంటిలో వుంచుకొనవలయును.

అగ్ని మహాపురాణమునందు నానా విధమంత్రౌషధాదికమను మూడు వందల రెండవ అధ్యాయము సమాప్తము.