అగ్ని మహా పురాణము

Table of Contents

162 - అథ ధర్మశాస్త్రనిరూపణమ్.

పుష్కర ఉవాచః-

పుష్కరుడు చెప్పెను; మనువు, విష్ణువు, యాజ్ఞవల్క్యుడు, హారీతుడు, ఆత్రి, యముడు, ఆంగిరసుడు, వసిష్ఠుడు, దక్షుడు, సంవర్తుడు, శాతాతపుడు, పరాశరుడు, ఆప స్తంబుడు, ఉశనస్సు, వ్యాసుడు, కాత్యాయనుడు, బృహస్పతి, గోత ముడు, శంఖలిఖితులు, వీరు చెప్పిన విధముగ భుక్తిముక్తిప్రద మగు ధర్మమును సంక్షిప్తముగా చెప్పెదను వినుము. వై ఏకకర్మ ‘ప్రవృత్తము' 'నివృత్తము' అని రెండు విధములు. కామ్యకర్మ ప్రవృత్తము. జ్ఞానపూర్వక మగు కర్మ నివృత్తము. వేదాభ్యాసము, తపస్సు, జ్ఞానము, ఇంద్రియసంయమము, అహింస, పూజ్యుల సేవ ఇవి నిశ్శేయసకరములు. వీటి అన్నింటికంటెను ఆత్మజ్ఞానము శ్రేష్టము. అది అన్ని విద్యలలో ఉత్తమము. దానివలన మోక్షము లభించును. తనను సర్వభూతములందును, సర్వభూతములను తనయందును చూచు, ఆత్మజ్ఞానము కలవాడు స్వారాజ్యమును పొందును ఆత్మజ్ఞానము సమముగ నుండునట్లు చేసికొని, వేదాభ్యా సమునందు ప్రయత్నము కలవాడు కావలెను. ఇది ద్విజు లందరికిని సామర్థ్యమును పెంపొందించునది. బ్రాహ్మణులకు విశేషముగ సామర్థ్యవర్ధకము. వేదశాస్త్రార్థతత్త్వము తెలిసినవాడు ఏ ఆశ్రమమునం దున్నను, ఈ లోకమునందే బ్రహ్మత్వమును పొంద సమర్థు డగును. శ్రావణపూర్ణిమనాడు గాని, శ్రవణ నక్షత్రయుక్త దినమున గాని, హస్తనక్షత్రయుక్త శ్రావణశుక్ల పంచమినాడు గాని, తమ శాఖకు సంబంధించిన గృహ్య సూత్రము ప్రకారము నియమపూర్వకముగా వేదాధ్యయన ప్రారంభము చేయవలెను. పౌషమాసమున రోహిణీనక్షత్రమునందు గానీ, అష్టకతిథియందు గాని నగరము లేదా గ్రామము వెలుపల జలసమీపమున వేదాధ్యయనోత్సర్గము చేయవలెను.

శిష్యుడు, ఋత్విక్కు గురువులు, బంధువులు మరణించినపుడు మూడు దినములు ఆధ్యయనము మానివేయవలెను. ఉపాకర్మ-ఉత్సర్జన దినములు మొదలు మూడు దినములు అధ్యయనము చేయరాదు. తన వేదశాఖకు చెందిన వేదాధ్యత మరణించినపుడు కూడ అట్లే. సంధ్యాకాలమునందు, ఉరుముచున్నపుడు, ఉత్పాతసూచకము లగు ధ్వనులు వినబడినప్పుడు, భూకంపమునందు, ఉల్కా. నిపాతకమునందు, వేదాధ్యయనసమాప్తి చేసిన పిమ్మటను, ఆరణ్యకమును చదివిన పిమ్మ టను ఒక రాత్రి ఆనధ్యయనము. పూర్ణిమ, చతుర్దశి, అష్టమి, రాహుగ్రహణము, ఋతుసంధులు, శ్రాద్దాన్న భోజనము చేసినపుడు శ్రాళ్లదానము పట్టినపుడును ఒక దినము అనధ్యాయము. స్వాధ్యాయము చేయువారి మధ్యనుండి చెవులపిల్లి, కప్ప, ముంగిస, కుక్క, సర్పము, పిల్లి, పంది వెళ్ళినచో ఒక దినము అనధ్యయనము. ఇంద్రధ్వజమును దింపిన దినమునను, ఎత్తిన దినము మందును, అనధ్యయనము. కుక్క, నక్క, గాడిద, గుడ్లగూబ వీటి అరుపులు వినబడినపుడు, సామగానము వినబడినప్పు డును, బాణధ్వని. ఆర్తధ్వని వినబడినపుడును, అపవితవస్తువు, శవము, శూద్రుడు, అంత్యజుడు, శ్మశానము, పతితుడు మొదలగు వారి సాన్నిధ్యమునందును, అశుభతారలందును, మాటిమాటికి మెరపులు మెరయు చున్నప్పుడును, తాత్కాలిక అనధ్యాయము. భోజనానంతరము తడి చేతులతో అధ్యయనము చేయకూడదు. జలములోపల, అర్థరాత్రమునందును, దుమ్ము పడుచున్నవుడును, పెను గాలులు వీచుచున్నపుడును, ఓర్ణాహసమయమునందును, సంధ్యలందును, మంచు వర్షించుచున్న పుడును, భయసమయములందును అధ్యయనము చేయరాదు. పరుగెత్తుచు అధ్యయనము చేయరాదు. ఏదైన ప్రాణి బాధ పడుచున్నపుడును, శిష్యులు ఇంటికి వచ్చి నపుడును ఆధ్యయనము చేయరాదు. గాడిద, ఒంటె, రథము మొదలగు వాహన మలు ఎక్కినపుడును, ఏనుగ, గుఱ్ఱము, నావ, వృక్షము మొదలైన వాటిని ఎక్కినపుడు, మరుభూమియందును, ఆధ్యయ నముచేయరాదు. ఈ ముప్పదియైదును తాత్కాలికానధ్యయన కాలములు.

అగ్ని మహాపురాణమునందు ధర్మశాస్త్రవర్ణన మను నూటఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.