అగ్ని మహా పురాణము

Table of Contents

170 - అథ పునః ప్రాయశ్చిత్తాని.

పుష్కర ఉవాచః-

పుష్కరుడు చెప్పెను మహాపాపులతో సంబంధము కలవారికి ప్రాయశ్చిత్తములను చేప్పెదను. పతితునితో కూడి తీరుగువాడు సంవత్సరకాలములో పతితు డగును. ఈ పతికత్వము, పతితునిచే యజ్ఞము చేయించుటచేతను, అధ్యయనము చేయించుటచేతను వైవాహిక సంబంధము ఏర్పరచుకొనుటచేతను మాత్రమే కలుగును గాని వానితో ప్రయాణముచేయుట చేతను భుజించుటచేతను, కలిసి కూర్చుండుటచేతను కలుగదు. ఈ పతితులలో ఎవనితో ఒక వ్యక్తి సంసర్గమును పొందునో అతడు ఆ పతితుడు చేయ వలసిన ప్రాయశ్చిత్తమును చేసికొనవలెను. పతితుని సపిండులు బంధువులతో కలసి నిందితదినమునందు, సంధ్యాసమయమున వంశానికి సంబంధించినవారు, ఋత్విక్కులు, గురువులు మొదలగువారి సమక్షమున ఆ పతితునకై (జీవించియుండగనే) ఉదక క్రియ చేయవలెను. పిదప పేతకు చేసినవిధముగ, ఒక జలము నింపిన కుండను దాసిచే తన్నించ వలెను. సపిండులు బంధువులతో కూడ ఒక రోజు ఆశౌచము పాటించవలెను. అతనితో సంభాషణము చేయకుండవలెను. అతని జ్యేష్టభాగమును ఉపసంహరించవలెను. గుణములచే ఆధికు డగు చిన్న వానికి జ్యేష్టభాగము చెందునట్లు చేయవలెను. అతడు ప్రాయశ్చిత్తము చేసికొనిన పిదప బంధువులు ఆతనితో కలిసి పుణ్యనదిలో స్నానము చేసి, జలము నింపిన క్రొత్త కుండను నీటిలో విసరివేయవలెను. పతితస్త్రీలకు కూడ ప్రాయశ్చిత్తము ఈ విధముగనే చేయవలెను. వారికి వస్త్రములు, అన్న పానాదికముమాత్ర మివ్వవలెను. గృహసమీపమున నివాస మేర్పరుపవలెను. యథాకాలముగ గాయత్రీఉపదేశము పొందని ద్విజులచేత మూడు కృచ్చములు చేయించి పిదప యథావిధిగా ఉపనయనము చేయవలెను. నిషిద్ధకర్మలు చేయుచు పరిత్యకు పునఃప్రాయశ్చిత్తాని లైనవారి విషయమున గూడ ఇట్లే చేయవలెను. చెడ్డ దానములు పట్టినవాడు మూడు వేల గాయత్రీమంత్రజపము చేసి, సమాహిత చిత్తడై ఒక మాసము గోష్ఠమునందు నివసించుచు పాలునూత్రము త్రాగినచో పరిశద్ధు డగును.

సంస్కారహీనులచే యజ్ఞము చేయించినను, ఇతరులకు అంత్యేష్టి కర్మ చేసినను, మంచివారి విషయమున ఆభిచార ప్రయోగము చేసికను బ్రాహ్మణుడు మూడు ప్రాజాపత్యములు చేయవలెను. ద్విజుడు శరణాగతుని పరిత్యజించినను, అనధికారికి వేదోపదేశము చేసినను, ఒక సంత్సరము నియమితాహారము భుజించుటచే పాపవిముక్తుడగును. కుక్క, నక్క, గాడిద, పిల్లి, ముంగిస, మనుష్యుడు, గుఱ్ఱము, ఒంటె, పంది. ఇవి కరచినచో ప్రాణాయామముచే శుద్దు డగును. వ్రతలోపము చేసినను, నిత్యకర్మలను ఉల్లంఘించినను, స్నాతకుడు ఉపవాసము చేయవలెను. బ్రాహ్మణుని విషయమున హుంకరించినవాడును, పెద్దలను తుంకరించినవాడును (నువ్వు అని అన్న వాడును) స్నానము చేసి, ఆదినమున మిగిలిన కొలము ఉపవాసముండి, వారికి నమస్కరించి ప్రసన్ను లను చేసికొనవలెను. బ్రాహ్మణునిపై కఱ్ఱఎత్తినవాడు ప్రాజాపత్య  వ్రతము చేసికొనవలెను. కర్రతో కొట్టినచో అతికష్టమును, రక్తము వచ్చు నట్లు చేసినచో కృచ్ఛమును, అతికృచ్చ మును చేయవలెను. తెలియకుండ ఒక చండాలుడు వచ్చి ఇంటిలో కాపుర మున్న చో, తెలిసినపిమ్మట ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. చాంద్రాయణము గాని పరాక వ్రతమును గాని చేసినచో ద్విజులకు శుద్ధి యగును. శూద్రులకు ప్రాజాపత్య వ్రతముచే శుద్ధి యగును. మిగిలిన దంతయు అతడు కూడ ద్విజుల వలెనే చేయవలెను. ఇంటిలో నున్న బెల్లము, కుసుంభము, లవణము, ధాన్యము మొదలగు పదార్థములను ద్వారమువద్ద కుప్పగా చేసి తగులబెట్టవలెను. మట్టి పాత్రలను పారవేయవలెను. ఇతర ద్రవ్యములకు శాస్తోక్త శుద్ది చేయవలెను. చండాలస్పర్శదూషిత మగు నూతినుండి నీరు త్రాగిన. బ్రాహ్మణుడు ఉపవాసము గాని పంచదివ్యశుద్ధి గాని చేయవలెను. ఇష్టపడి చండాలుని స్పర్శ చేసి భోజనము చేసిన బ్రాహ్మణుడు చాంద్రాయణము గాని, తపకృచ్చము గాని చేయవలెను. చండాలాదినీచజాతుల స్పర్శచే భోజనాటి పాత్రలు అపవిత్ర మైనచో బ్రాహ్మణుడు షడ్రాత్రవ్రతము చేయవలెను. అంత్యజాతివాని ఉచ్చిష్టము తిన్న ద్విజుడు చాంద్రాయణవ్రతము చేయవలెను; శూద్రుడు త్రిరాత్రవ్రతము చేయవలెను. చండాలుని కూపమునుండి గాని, పాత్ర నుడి గాని తెలియక త్రాగిన ద్విజుడు సంతపరకృచ్చమును, శూద్రుడు ఏక దినోపవాస మును చేయవలెను. చండాలస్పర్శ చేసి జలము త్రాగిన ద్విజుడు త్రిరాత్ర వ్రతమును చేయవలెను. శూద్రుడు ఒక దినము ఉపవాసము చేయవలెను.

            ఉచ్ఛిష్ట మైన కుక్క చేతగాని, శూద్రునిచేత గాని స్పృశింపబడిన ద్విజుడు ఒక రాత్రి ఉపనాస ముండి పంచ గవ్యముచే శుద్ధిపొందును. అట్టి వైశ్యుడు గాని, క్షత్రియుడు గాని స్పృశించిన చో రాత్రి స్నానము చేయవలెను. మార్గ మధ్యమునం దున్న బ్రాహ్మణుడు ఉదకములేని ఆరణ్యమునందు, ప్వన్న ము చేతిలో నుండగా మూత్రవిసర్జనము చేసినచో, ఆ ఆహారమును క్రింద పెట్టకుండగ, తన శరీరము పైననే ఉంచుకొని, శౌచము చేసికొని ఆ అన్నమును ప్రోషించి సూర్యు నకును అగ్నికిని చూపవలెను. ఆరణ్యమునందు మ్లేచ్చులతో గాని చోరులతోగాని సంబంధ మేర్పడినవారికి, లేదా ప్రవాసములో నున్నవారికి భజ్యా భక్ష్యశుద్ధినిమత్తము ఉపాయమును చెప్పెదను. వర్ణక్రమానుసారముగా బ్రాహ్మణుడై నచో అతడు మరల స్వదేశమునకు తిరిగి వచ్చి కృచ్చవ్రతము చేసిన పిమ్మట మరల సంస్కారము చేసి కోనవలెను. క్షత్రియుడు మూడు వంతుల ప్రాయశ్చిత్తము, వైశ్యుడు సగము ప్రాయశ్చిత్తము చేసికొని శుద్దులగుదురు. శూద్రుడు పాదము ప్రాయశ్చిత్తము చేత గాని, దానము చేత గాని, శుద్దు డగును. సవర్ణ యగు రజస్వలచే స్పృశింపబడిన రజస్వలాశ్రీ ఆ దినమునందే స్నానము చేసినచో శుద్ధురాలగును. తక్కువవర్ణము గల రజస్వల శ్రీచ స్పృశింపబడిన రజస్వల శుద్ధస్నానము చేత శుద్ధురాలగును; స్నానము చేయునంతవరకును భుజించగూడదు. మూత్రోత్సర్గానంతరము ప్రయాణము చేయుచు, మరచి నీళ్లు తాగినచో ఒక రాత్రి ఒక పగలు ఉపవాస మండి పంచగవ్యముచే శుద్దుడగును. మూత్రోత్సర్గము చేసిన ద్విజుడు శాచము చేసికొనకుండ, అజ్ఞానముచే భోజనము చేసినచో మూడు రాత్రులు యవలు త్రాగి శుద్ది చెందును.

బలాత్కారాది కారణములచేత సన్యసించిన విప్రులు అందుండ ఆసమర్థులై మరల గృహస్థాశ్రమమునకు రావలె నన్నచో వారికి శుద్ధిని చెప్పుచున్నాము. మూడు కృచ్చములుగాని తెరిచే చాంద్రాయణము కాని చేయించవలెను. మరల జాతకర్మాఓసంస్కారములచే సంస్కరించవలెను. పాదుక గాని, అమేధ్యము గాని ముఖమునకు తగిలినచో మృత్తిక, గో మయము, పంచగవ్యము వీటిచే శుద్ది చేసికొనవలెను. నీలిమందు పండించుట, విక్రయము, నీలవస్తాదిధారణను చేసిన బ్రాహ్మణుడు పతితుడగును. మూడు కృచ్చములచే శుద్దుడగును. అంత్యజాతివాని చేతను, శ్వపాకుని చేతిను స్పృశింప బడిన రజస్వల త్రిరాత్రము చేసినచో నాల్గవరోజున శద్దురా లగును. చండాలశ్వపచులను, పాసినవస్తువును, సూతికాశ్రీని శవమును వీటిని సృశించినవానిని సృశించినవాడు సద్యఃస్నానముచే శదు డగును. పచ్చిగా నున్న మనిషి ఎముకను స్పృశించిన విప్రుడు స్నానముచే శుద్దుడగును. మార్గముందలి బురదనీళ్ళు పడి నపుడు నాభి క్రింద మట్టితోను, ఉదకము తోను శుద్ధి చేసికొనవలెను. వాంతిచేసుకొన్న వాడు, విరేచనములు వెళ్ళినవాడును స్నానము చేసి మృతప్రాశనము చేసినచో శుద్ధుడగును. క్షారము చేయించుకొన్నవాడు స్నానము చేతను, గ్రహణసమ యమున అన్నము తిన్న వాడు కృచ్ఛము చేతను శుద్దుడగును. పంక్తిబాహ్యులతో కలిసి భోజనము చేసినవాడును, కుక్క గాని, కృములు గానికరచినవాడును, ఆశుచి యైనవాడును పంచగవ్యములచే శుద్ధి పొందును. ఆత్మహత్యా ప్రయత్నము చేసినవాడు కృచ్ఛముచేతను, జపము చేతను శుద్దుడగును. పాపాత్ములందరును హోమాదులచేతను, పశ్చాత్తాపముచేతను శుద్రులగుదురు.

అగ్ని మహాపురాణమునందు ప్రాయశ్చిత్తనిరూపణమను నూట డెబ్బదవ అధ్యాయము సమాప్తము.