అగ్ని మహా పురాణము

Table of Contents

68 - అథ యాత్రోత్సవ విధి కథనమ్

హయగ్రీవుడు పలికెను. ఇప్పుడు ఉత్సవ విధిని చెప్పెదను. ఉత్సవము లేని దేవతాపతివ నిష్ఫలము, అందుచే దేవతాస్థాపనము చేసిన సంవత్సరమునందే ఏక రాతోత్సవము లేదా తిరాతోత్సవము లేదా అష్టరాతోత్సవము చేయవశాను. ఆయనసమయమునందు గాని, విషువసంక్రాంతి సమయమునందు గాని శయనోపవనమునందు లేదా దేవతా గృహమునందు లేదా కర్తకు అనుకూలముగా ఉన్న విధమున దేవుని నగరయాత్ర చేయించవలెను. ఆ సమయమున మంగలాంకురారోపణము, నృత్యగీతాదులు, వాద్యములు ఏర్పాటు చేయవలెను. ఆంకురారోపణవంనకు మూకుళ్ళు ఉత్తమ మైనవి. యవ - శాలి - తిల - ముద్దగోధూమ - శ్వేతసర్షప - కులత్త - మాష - నిష్పావములు కడిగి చల్లవలెను. దీపములతో రాత్రి ఊరేగుచు ఇంద్రాదిదిక్పాలులకు, కుముదాది దిగ్గజములకు, సకల ప్రాణులక పూర్వాది దిక్కులందు బలి ప్రదానము చేయవలెను. దేవతా విగ్రహమును మోయుచు దేవయాత్రను అనుసరించు వారికి ఆడుగడుగునకు ఆశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును, కొంచెమైనను సందేహము లేదు. ఆచార్యుడు తొలుచటి దివసమున దేవాలయమునకు వచ్చి దేవునితో “దేవ శ్రేష్టా! రేపు నీ తీర్థ యాత్రజరుపవలసి యున్నది. అందుకు అనుజ్ఞ ఇచ్చటకై నీవు సర్వదా సమర్థుడవు అని నివేదించి ఉత్సవకార్యము ప్రారంభింపవలెను. నాలుగు గ్రంథములు గలదియు అంకురములున్న ఘట ముతో కూడినదియు ఆలంకరింపబడినదియు అగు వేదిక దగ్గరకు వెళ్ళి దాని మధ్య భాగమున స్వస్తి కము ప్రతిమనుంచి, తన కోరికను వ్రాసి చిత్రముల పై స్థాపించి ఆధివాసనము చేయవలెను.

పిమ్మట విద్వాంసులై న వైష్ణవులతో కలిసి మూలమంత్రముతో ప్రతిమ అవయవములకు నెయ్యి పూసి, రాత్రి అంతయు నేతిధారతో అభిషేకము చేయవలెను. దేవతకు అద్దము చూపించి, ఆరతి, గీతము, వాద్యములు మొదలగు వాటితో మంగళకృత్యములు నెరపి, వ్యజనము విసిరి, పూజించవలెను. పిదప దీప - గంధ - పుష్పాదులతో పూజించవలేను. పసుపు, కర్పూరము, కేసరములు, శ్వేతచందన చూర్ణము దేవతా ప్రతిమ పైనను, భక్తుల శిరస్సుల పైనను చల్లినచో సమస్త తీర్థముల ఫలము లభించును. ఆచార్యుడు యాత్రకొరకై ఏర్పరచిన దేవతామూర్తి ని రథముపై ఉంచి, పూజించి, ఛత్ర - చామర - శంఖనాదాదులతో రాష్ట్రమును పాలించునదీతటమునకు తీసికొని వెళ్ళవలేను. నదిలో స్నానము చేయించు టకు ముందు ఆచట వేదికను నిర్మించి, ఆ మూర్తి ని వాహనమునుండి దింపి, దానిని ఆ వేదిక పై ఉంచవలెను, అచట చరువు వండి దానిని హోమము చేసిన పిదప పాయసహోమము చేయవలెను. వరుణ దేవతామంత్రముతో సమ సతీర్థముల ఆవాహనము చేసి “ఆపోహిషామ” ఇత్యాదిమంత్రములతో వాటికి ఆర్ఘ్య ప్రదానము చేసి పూజించవలెను. దేవతామూర్తిని తీసి కొని వెళ్ళి ఉదకమునందు ఆఘమర్షణ చేసి, బ్రాహ్మణ - మహాజనులకు స్నానము చేయవలెను. స్నానానంతరము మూర్తి ని తీసికొని వచ్చి వేదిక పై ఉంచవలెను. ఆ దివసమునందు అచట దేవతాపూజ చేసి, దేవాలయమునకు తీసికొని వెళ్ళవలెను, ఆచార్యుడు అగ్నిలో నున్న దేవతకు పూజలు చేయవలెను. ఈ ఉత్సవము భోగ . మోక్షప్రదము.

ఆగ్ని మహాపురాణమునందు ఉత్సవవిధి కథనమను ఆరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.