అగ్ని మహా పురాణము

Table of Contents

22 - అథ స్నానవిధిశథనమ్

నారదుడు పలికెను.

యాగపూజాది క్రియలు చేయుటకు ముందు చే దగిన స్నానమును గూర్చి చెప్పెదను. నృసింహమంత్రము నచ్చరించుచు మృతికను గ్రహించి, దానిని రెండు భాగములు చేసి ఒక దానిచే మలస్నానము చేయవలెను. మునిగి, ఆచమనము చేసి, నృసింహ మంత్రముచే ద్యానము చేసి, రక్ష చేసికొని పిమ్మట ప్రాణాయామపూర్వకముగా విధి స్నానము చేయవలెను.

అష్టాక్షరమంత్రమును జపించుచు, శ్రీ మహావిష్ణువును హృదయములో ధ్యానించుచు అర చేశి లో మట్టిని మూడు భాగములుగా చేసి ఉంచుకొని తరవాత నృసింహమం తము జంపిచుచు దిగ్బంధము చేయవలెను. వాసుదేవ మంత్రమును జపించుచు సంకల్పించి తీర్థ మును స్పృశించగలేను. వేదాది మంత్రములచే గాతమును తుడిచికొని మూ రీలో నున్న దేవుని ఆరాధించి, స్మరించుచు, వస్త్రము ధరించి అమ మరణము చేయవలెను (ఆఘమర్షణ మంత్రములను పఠించవలెను). మంత్రములచే విన్యానము చేసి, చేతిలోనున్న జలము నిర్మార్గనము చేసి, నారాయణ మంత్రముతో ప్రాణాయామము చేసి, జలమును వాసనచూచి విడిచి పెట్టవలెను. హరిని ధ్యానించుచు ఆ ర్యమునిచ్చి, ద్వాదశాక్షరినీ జపించి, యోగపీఠము మొదట క్రమముగ ఇతర దేవతలకు కూడ తర్పణము చేయవలెను. మంత్రములకును దిక్పాలుర వరకు దేవతలకును, ఋషులకును, సితృగణములకును, మనుష్యులకును స్థావరాంతములగు నమ స భూతములకును తర్పణము చేసి, పిమ్మట ఉపవిష్టుడే అంగన్యాసము చేసి, మంత్రోపసంహారము చేసి, యాగ గృహమును ప్రవేశించవలెను. ఇతర పూజల లో ఆ మూలమంత్రాదులచే స్నానము చేయవలెను.

అగ్ని మహావురాణములో స్నానవిధి నిరూపించు ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.