అగ్ని మహా పురాణము

Table of Contents

194 - అథ అశోకపూర్ణిమాదివ్రతాని

అగ్ని రువాచః-

అగ్ని పలికెను: ఫాల్గుశుక్లపరిమూడు వరాహమూర్తిని, భూదేవిని పూజించవలెను. ఈ విధముగ, ఒక సంవత్సర మాచరించువాడు భుక్తిముక్తులను పొందును. కార్తీక పూర్ణిమనాడు వృషోత్సర్గము చేసి రాత్రి వ్రతమును అనుష్టించవలెను దీనిచే శివలోకము పొందును. దీనికి “వృషోత్సర్గవ్రతము” అని పేరు. ఆశ్వయుజమున పితృపక్షి అమావాస్యయందు ఫితృదేవతల నుద్దేశించి చేసిన దానము అక్షయఫలప్రదము. ఏ సంవత్సరమునం దైవను ఈ అమావాస్యనాడు ఉపవాస మండి పితృహజ చేయువాడు పాపవిముక్తు డై స్వర్గము పొందును. మాఘ అమావాస్యనాడు బ్రహ్మను పూజించినవాడు సకలాభీష్టములను పొందును. ఇపుడుభుక్తిముక్తిప్రద మగు వటసావిత్రీ వ్రతమును గూర్చి చెప్పెదము. వ్రత మాచరించు శ్రీ మూడు దివసములు ఉపవాసము చేసి, జ్యేషఅమావాస్యనాడు వటవృక్షమూలమునందు మహాపతివ్రతయగు సావిత్రిని సప్త ధాన్యములతో పూజించవలెను. కొంచెము రాత్రి కేషించి యుండగా ఆ వటవృక్షమునకు కంఠసూత్రము చుట్టి కుంకుమాదులతో దానిని పూజించవలెను. ప్రభాతసమయమున ఆ వటముదగ్గర నృత్యము చేయుచు గీతములు గానము చేయ వలైన నమః సావితైకి నత్యవతే” అనుచు సావిత్రీసత్యవంతులకు నమస్కారము చేసి, వారికి సమర్పించిన నైవేద్యము బ్రాహ్మణునకు దాన మీయవలెను. పిదప ఇంటికి వచ్చి బ్రాహ్మణులకు భోజనము పెట్టి తరువాత తాను భుజించవలెను. “సావిత్రీదేవి ప్రీయతామ్” అని ఆనుచు వ్రతసమాప్తి చేయవలెను. ఇట్లు చేసిన స్త్రీ సౌభాగ్యాదులను పొందును.

అగ్ని మహాపురాణమునందు తిథి వ్రతవర్ణన మను నూట తొంబది నాల్గవ అధ్యాయము సమాప్తము.