అగ్ని మహా పురాణము

Table of Contents

274 - అథ సోమవంశవర్ణనమ్

అగ్ని రువాచః

అగ్ని దేవుడు చెప్పెను : ఇపుడు పఠించినచోపాపములను నశింపచేయు సూర్యవంశమును గూర్చి చెప్పెదను. విష్ణు నాభికమలమునుండి బ్రహ్మపుట్టెను బ్రహ్మపుత్రుడు ఆత్రి, ఆతనికి సోముడు పుత్రుడు. అతడు రాజసూయయాగము చేసి త్రిలోక రాజ్యమున దక్షిణగా ఇచ్చివేసెను. అవభృథస్నానము సమాప్తమైన పిమ్మట ఆతని రూపమును చూడగోరి తొమ్మండుగురు దేవతాస్త్రాలు ఆతని దగ్గరకు వచ్చి కామబాణ సంతప్త ఆతనిని సేవించిరి. నారాయణుని విడిచి లక్ష్మియా, కర్దముని విడిచి సినీవాలి, ఆగ్నిని విడిచి ద్యుతి, అవ్యయుడగుధాతను విడిచిపుష్టి, ప్రభాకరని విడిచి ప్రభ, హవిష్మంతుని విడచి కుహు, వీరందరు స్వయముగ సోముని దగ్గరకు వచ్చిరి. థర్తయగు జయంతుని విడిచి కీర్తి, మరిచిపుత్రుడగు కశ్యపుని విడిచి వసువు, పతియైన మందిని విడిచి ధృతియు, వచ్చి సోముని సేవించిరి. చంద్రుడుకూడ పొరలను స్వకీయత్రీలనువలె కామించెను. ఈ విధముగ అపచారముంచేసిన ఆతని విషయమున ఆస్త్రీల భర్త లు శాపములచేతగాని, శస్త్రాదులచేతగాని శిక్షించుటకు సమర్ధులు కాకపోయిరి. సోముడు తన తపోబలముచే సప్త లోకములకు ఏక మాత్రాధిపతియయ్యెను. ఈ దుర్వినీతిచే కలుషితమైన ఆతని బుద్ధి వినయ విహీనమై భ్రాంతిచెందెను. ఆతడు ఆంగిరానందనుడిగు బృహస్పతిని అవమానించి ఆతని భార్యయగు యశస్వినియైన తారను బలాత్కారముగ అపహరించెను. అందుచే దేవదానవులమధ్య తార కామయముయను ప్రసిద్ధిగి ల లోక క్షయక రమగు గోప్పయుద్ధము జరిగెను. అంతమున్మబ్రహ్మ శుక్రుని అడ్డగించి తారను బృహస్పతికి ఇప్పించెను. ఆమె గర్భవతి అని తెలిసి బృహస్పతి ఈగర్భమును విడువుముయని ఆజ్ఞాపించగ ఆమె ఆగర్బమును విడిచెను. అపుడు తేజశ్శాలియగు కుమారుడు ఆవిర్భ వించి నేను సోమని పుత్రుడను అనిచెప్పెను. ఈ విధముగ సోమునకు బుధుడను పుత్రుడు కలిగెను. ఆతనికి పురూరవుడు పుత్రుడు. ఊర్వశియను అప్పలస స్వర్గము విడచి పురూరవుని వరించెను.

పురూరవుడు ఊర్వశితో ఏబదితొమ్మిది సంవత్సరములు విహరించెను. పర్వము ఒకేయగ్ని వుండెడిది. పురూరవుడు ఆ అగ్ని ని మూడుగా విభజించెను. మహాయోగియగు ఆతడు గంధర్వలోకము చేరెను. పురూరవునకు ఊర్వశియందు ఆయు, - దృఢాయు ఆశ్వాయు-ధనాయు- దృతిమత్-వసు-దివిజాత-శతాయు అను ఎనమండుగురు పుత్రులు పుట్టిరి. ఆయువునకు నహుషుడు, వృద్ధశర్మ, రజి, దంభుడు, విపాప్మ అను ఐదుగురు పుత్రులు పుట్టిరి. రజికి రాజేయులని ప్రసిద్ధిచెదిన నూర్గురుపుత్రులు జనించిరి. రతికి విష్ణువు వరములను ఇచ్చేను. దేవతల ప్రార్థింపగ, ఆతడు దేవాసురయుద్దమునందు దైత్యులను చం పెను. తనకు పుత్రుడుగా జన్మించిన ఇంద్రువకు రాజ్యము ఇచ్చి రజి స్వర్ణముచేరెను. కొంతకాలము తరవాత రజీ కుమారులు ఇంద్రునిరాజ్యహను లాగుకొవగ అతడు దుఃఖితుడయ్యెను. పిదప బృహస్పతి గ్రహశాంత్యాది విధులచే రజిపుత్రులను మోహింపచేసి రాజ్యముతీసుకొని మరల యిందునకు ఇచ్చెను. అపుడు రజికుమారులు ధర్మభ్రష్టలేరి. నహుషునకు-యతి-యయాతి- ఉత్తమ-ఉద్దవ-పంచక – శర్యాతి- మేఘ పాలకులను ఏడుగురు కుమారులు జనించిరి. యతి బాల్యమునందే విష్ణుధ్యానము చేసి విష్ణుపదమును పొందెను. శుక్రుని కుమార్తెయైన దేవయానియు, వృషపర్వుని కుమార్తెయైన శర్మిష్ణయు యయాతి భార్యలైరి. వీరియందుయయాతికి ఐదుగురుకుమారులు జనించిరి. దేవయాని, యదు, తుర్వసు, ఆనువారిని కనెను. శర్మిష్ఠ ధృహ్యుడు అను, హరుడు ఆనుముగ్గురు పుత్రులను కనెను. వీరిలో యదు- పూరువులు సోమవంశ వర్ధకులైరి.

అగ్ని మహాపురాణమునందు సోమవంశవర్ణనమను రెండువందలడెబ్బది నాల్గవ అధ్యాయము సమాప్తము.