అగ్ని మహా పురాణము

Table of Contents

143 - అథ కుబ్జికాపూజా.

ఈశ్వర ఉవాచః-

పరమేశ్వరుడు చెప్పెను : సమ స్తమనోరథములను సిద్ధింపచేయు కుట్టెకా క్రమపూజను గూర్చి చెప్పెదను. ‘కుట్టికా’ శక్తి సహాయముచే రాజ్యమునం దున్న దేవతలు అస్త్రశస్త్రాదులతో అసురులపై విజయము సాధించిరి. మాయా బీజ మైన 'హీం' ను హృదయాది షణ్మంత్రములను క్రమముగా గుహ్యాంగ మునుదును, హస్తమునందును న్యాసము చేయ వలెను. “కాలీ కాలీ'. ఇది హృదయమంత్రము. 'దుష్ట చాంచాలికా' ఇది శిరోమంత్రము. “హీం స్ఫేం హ స ఖ క గడ ఓం కారో భైరవః”. ఇది శిఖామంత్రము. 'ఖేలఖీ దూతీ' ఇది కవచమంత్రము. 'రక్తచట్టికా' -ఇది నేత్రమంత్రము ‘గుహ్యకుబ్జికా'...ఇది అస్త్రమంత్రము. వీటితో, 'అంగన్యాస కరన్యాసములు చేసి, యథాస్థానముగ మండలము పై వీటిని పూజించవలెను. మండలమునందు ఆగ్నేయమున “హూం', ఈన్యమున 'స్వాహా నైరృతియందు ‘వషట్' వాయవ్యమున “హమ్', మధ్యభాగమున “నౌషట్” మండలము సకల దిశలయందు ‘ఫట్' లిఖించి పూజించవలెను. ముప్పది రెండు అక్షరములతో గూడిన మహా ది దళ కమంమకరికలో ఆత్మకుష్ఠికాపూజా బీజమంత్రమును (ఆమ్)న్యసించి పూజించవలెను. కమలము నలు వైపుల పూర్వదిక్కుతో ప్రారంభించి క్రమమగ బ్రహ్మాజీ మాహేశ్వరీ-కౌమారీ-వైష్ణమీవారాహీ-మాఛీ-చాముండా- చండికలన్యాసము చేసి పూజించవలెను. ఈశాన్య-పూర్వఆగ్నేయ–దక్షిణ-నైరృతి-పశ్చిమములందు క్రమముగా 'ర, వ, ల, క, స, హ' లను న్యసించి పూజించవలెను. పిదవ ఈ దిక్కులందే క్రమముగా కుసుకుమాలలు, పర్వతములు స్థాపించి పూజించవలెను. జాలంధర_పూర్ణగిరి–కామరూపాదులు పర్వతనామములు. పిదప వాయవ్య_ఈశాన్య-అగ్నేయ–నైరృతులయందును, మధ్యభాగమునందును వజ్ర కుట్టికను పూజించవలెను. పిదప వాయవ్య-ఈశాన్య-నైరృతి ఆగ్నేయ_ఉత్తర శిఖరములపై క్రమముగ అనాదివిమల, సర్వజ్ఞ విమల, ప్రసిద్ధవిమల, సంయోగ విమల, సమయవిమలు లను ఐదుగురు విమలులను పూజించవలెను. కుబ్జకాప్రసాదము కొరకై ఈ శిఖరముల మీదనే క్రమముగ భింభినీషష్ఠి-సోపన్నా-సుస్థిరా-రత్న సుందరులరు పూజించవలెను. ఈశాన్యమున నున్న శిఖరము పై ఎనమండుగురు ఆదినాథులను పూజించవలెను. ఆగ్నేయ శిఖరముపై మీత్రుని, పశ్చిమశిఖరము పై ఔడీశ వర్ష మును, వాయవ్య శిఖరముపై షష్టి వర్షమును పూజించవలెను. పశ్చిమదిశ లో నున్న- శిఖరము పై: గగనరత్నకవచరత్నములను, వాయవ్య-ఈశాన్య-ఆగ్నేయములందు 'బ్రుం' బీజసహితు డగు పంచనాము డను మర్త్యుని, దక్షిణ ఆగ్నేయములందు 'పంచరత్న' మును ఆదే దిక్కులందు జ్యేష్ఠ, రౌద్రి, ఆంతిక అను త్రిసంధ్యాధిష్టాన దేవతలను పూజించ వలెను. వీరితో సంబంధించిన ఐదుగురు మహావృద్ధలను ప్రణవోచ్చారణ పూర్వకముగ పూజించవలెను. వీరి పూజ ఇరువదియేడు లేదా ఇరువది ఎనిమిది భేదములచే ద్వి విధముగా చెప్పబడుచున్నది. చతుష్కోణమండలమున కుడివైపున గణపతిని, ఎడమ వైపున వటుకుని పూజించవలెను. క్రమ గణపతిని 'ఓం ఏం గూం “క్రమగణపతయే నము” ఆను మంత్రముచేతను, “ఓం వటుకాయ నము” అను మంత్రముచే వటుకుని పూజించవలెను. వాయవ్యాది దిక్కులందు నలుగురు గురువులను, పదునెనిమిది షట్కోణములందు పదునారుగురు నాధులను పూజించవలేను. మండలము నలు వైపుల బ్రహ్మ దిదేవతలు ఎనమండుగురిని, మధ్యభాగమున తొమ్మిదవ దేవతగా కుట్టికను, కులటాదేవిని పూజించవలెను. సర్వదా ఈ క్రమముననే పూజచేయవలెను.

అగ్ని మహాపురాణమునందు మంత్రజయార్ణవమున కుబ్జకాపూజావిధాన మను నూట నలుబదిమూడవ అధ్యాయము సమాప్తము.