అగ్ని మహా పురాణము

Table of Contents

306 - అథ షట్ ప్రయోగతన్నివారణమంత్రాః

అగ్ని రువాచః

అగ్ని దేవుడు చెప్పెను. స్థంభనము విద్వేషణము ఉచ్చాటనము ఉల్సాదనము భ్రమణము మరణము వ్యాధి అనునవి ఎముద్ర ఆభిచారిక కర్మలు. వాటిని తొలగించు ఉపాయములు చేప్పెదను. వినుము. ఓం నమో భగవతో మొదలు “ఠఠ” వరకును పున్న మూలో క్త మంత్రమును శ్మశానమున రాత్రి యందు మూడు లక్షలు జపించి చితాగ్ని యందు ధూర్త సమిధలతో హోమము చేసిన శత్రువు సర్వదా తిరిగి పోవును. (బ్రాంతుడగును) హేమ బేదికతో శత్రు ప్రతిమ చేసి మంత్రమాతో అభిమంత్రించిన బంగారు సూదితో కంఠమునందు గాని హృదయమునందు కానీ ఆ ప్రతిమను గుచ్చినచో శత్రువు మరణించును. లేదా గాడిద వెంట్రుకలు చితాభస్మ బ్రహ్మ దండి వర్కటి వీటిని భస్మము చేసి దానిని పై మంత్ర ముతో ఆభిమంత్రించి ఉత్సాచన ప్రయోగము చేయువాడు శత్రువు ఇంటి పై గాని . శిరస్సు పై గాని చల్లవలెను. భృగు (స) ఆకాశ (హ) దీప్త (దీరాకార యుక్త రేవ సహిత భృగు (స) అనగా సహస్రా మరల ర వర్మ (హు) వట్ వీటిని కలిపి మంత్రము “సహస్రార హుంకట్" యని ఆగును. దీని ఆంగన్యాసములు ఈ విధముగా చేయవలయును. ఆ చక్రాయస్వాహా అని హృదయము విచక్రాయ శిరస్సు, శిఖా చక్రాయ యని కవచము, విచక్రాయ యని నేతము సుచక్రాయ యని ఆస్త్రము జ్వాలా చక్రాయ యని పూర్వము వలేను న్యాసము చేయవలెను. అంగన్యాస పూర్వకముగ జపించిన సుదర్శనము ముద్ర ఆభిచారము:ను గ్రహములను తొలగించి అన్ని మనోరథములను సఫలము చేయును. ఆ సుదర్శన మంత్రము యొక్క ఆరు ఆకరములను క్రమముగా శిరో నేత్ర ముఖ హృదయ గుహ్య చరణము లండ న్యాసము చేయవలెను. చక్ర స్వరూపుడగు. విష్ణువును ఈ విధముగా ధ్యానించవలెను. చక్రాకారమున నున్న కమలము నందు కూర్చున్న వాడు అగ్ని సమానమగు కాంతిశ్రీ మదగ్ని మహాపురాణము కలవాడు కోరలు గలవాడు చతుర్భుజుడు శంఖ చక్ర గదా పద్మశలకాంకుశ పాపములు ధరించిన వాడు పింగవర్ణ కేశ ములు నేత్రములు కలవాడు. ఆరములచే వ్యాపింపబడిన మూడు లోకములు కలవాడు. చక్రనాభి ఆ అగ్ని చే వ్యా ప్రమే యున్నది. వ్యాధులు గ్రహములు నశించును. చక్రము పీతవర్ణమైనది. ఆరములు రక్త వర్ణములు. ఆరమధ్య భాగము శ్యామ వర్ణము. చక్రనేమి శ్వేత వర్ణము. దాని యందు బయట నుండి పార్ధివమగు కృష్ణ వర్ణ రేఖ యుండును. అరయుక్త మధ్య భాగము నందు ఆకారాది వర్ణములుండును. ఈ విధముగా రెండు చక్ర చిహ్నములను వ్రాయవలెను.

ఆది చక్రముపై కలశ జలమును తీసుకొని వెళ్ళి తమ సమీపముననే ఉంచి దక్షిణమున నున్న రెండవ చక్రముపై సుదర్శనమును పూజించి అగ్ని యందు వరసగా ఆజ్య, అపామార్గ సమిధ, అక్షత, తిల, సర్షప, పాయస, గోమృత, మూల హోమము చేయవయును. ఒక్కొక్క ద్రవ్యముతో వెయ్యి హోమముల చొప్పున చేయవలెను. విద్వాంసుడు ప్రత్యేక ద్రవ్యము యొక్క హోమము చేయగా మిగిలిన భాగమును కలశము నందు ఉంచి ఒక ప్రస్థము అన్నముతో చేసిన పిడ మును ఆ కలశ లో వేసి విష్ణ్వాది దేవతలకై ఇవ్వవలసిన వస్తువులను అచటనే దక్షిణము నందుంచవలెను. పిదప సర్వ శాంతి కొరకు :ష్ణు జనులకు వస్కారము. వారు శాంతి కొర కై ఈ ఉపహారమును గ్రహింతురు గాక. వారికి నమస్కా రము అను మంత్రమును చదివి హుత శిష్ట జలముతో బలి సమర్పించవలెను. ఏదైనా కాష్ఠ వంక ముపై గాని కలశము నందు గాని, పాల చెట్టు కర్రతో చేసిన దధి పూర్ణ పాత్రము నందుగాని పలు వ స్తువులను ఉంచి అన్ని దిక్కు లందను సమర్పించ వలెను. పిదప ద్విజులచే దిక్కుల యందు హోమములు చేయించవలెను. దక్షిణా సహితముగా ఇట్లు హోమద్వయము చేసి నచో సకల భూలాదులు నశించను. పెరుగు పూసివ ఆకులపై వ్రాసిన మంత్రాక్షరములతో హోమము చేసినచో క్షుద్ర రోగ ములు నశించును. దూర్వలతో హోమము ఆయుర్దాయమను, పద్మములతో హోమము ఐశ్వర్యమను ఉదుంబరుల హోమము పుత్రులను గోష్ఠము నందు మృతముతో హోమము గోవృద్ధిని సకల వృక్ష సమిధల చేత చేసిన హోమము బుద్ధి వృద్ధినిత్రైలోక్య మోహనమం త్రాః యిచ్చును "ఓం క్షౌం" మొదలు “హూంఫట్" వరకను వున్న మూరో క్ష నారసింహ మంత్రము సకల పాపమును నివా రించును. జపాదులు చేసినచోక్షుద్రాభిచారములు గ్రహములు మారి విషమ, ఆమయము తొలగును. చూర్ణము చేసిన మండూక వసతో హోమము చేసినచో జల సంథ ఆగ్ని స్థంబనలు చేయును.

ఆగ్ని మహా పురాణమువ నారసింహాది మంత్ర కథన మను మూడు వందల ఆరవ అధ్యాయము సమాప్తము.