అగ్ని మహా పురాణము

Table of Contents

23 - అథాదిమూర్త్యాదిపూజావిధికథనమ్

నారద ఉవాచః-

నారదుడు పలికెను.

విప్రులారా! ఏ పూజావిధిచే సర్వకార్య కామములును లభించునో దానిని చేప్పెదను. పాదప్రక్షాళనము చేసికొని, ఆచమనము చేసి, మౌన మవలంబించి, రక్ష చేసికొని, తూర్పుగా తిరిగి, స్వ సికాసనమునందు కాని, పద్మాసనము నందు గాని, మరొక అననమునందు కాని కూర్చుండి, నాభి మధ్యలో నున్న దియు, ధూమ్రవర్ణము కలదియు, తీవ్ర వాయురూప మైనదియు ఆగు “యం” బీజమును ధ్యానించుచు శరీరమునుండి సకలకల్మషములను శోషింపచేయవలేను.

హృదయపద్మ మధ్యమునం దున్న తేజోనిధి యగు “క్షౌం” అను బీజమును స్మరించుచు, క్రిందికిని, పైకిని, అడ్డముగను ప్రసరించే జ్వాలలచే కల్మషమును దహించవలెను.

ఆకాశమునందు చంద్రుని ఆకారము వంటి ఆకారమును ధ్యానము చేయవలెను. దాని నుండి స్రవించుచున్న దియు, సుషుమ్నా నాడిద్వాగా నమ స్ర నాడులందును వ్యాపించుచున్న దియు, హృదయ పద్మమును వ్యాపించుచున్న వియు ఆగు అమృతధారల చేత తన దేహమును ని పవలేను.

శోధనము చేసి తత్వనానము చేయవలెను. పిమ్మట కర శుద్ధి కొరకు ఆత్రవ్యాపళముద్రలను, చేయవలెను. కుడి చేతి అంగుష్ఠమునుండి కరతలము వరకి న్యానము చేయవలెను. దేహమునందు పన్నెండు ఆక్షరముల మూల మంత్ర ముతో హృదయము, శిరస్సు, శిఖ, వర్మ, అస్త్రము, నేత్రములు, ఉదరము, శరీరము వెనుక భాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్లు, పాదములు అను ద్వాదశాంగముల పై న్యాసము చేయవలెను ముద్రనిచ్చి విష్ణువును స్మరించి, ఆప్టోత్తరశత జపము చేసి పూజింపవలేను.

జలకుంభమును ఎడమ వైపునను, పూజాద్రవ్యములను కుడి వైపునను ఉంచవలెను. అస్త్రముచే ప్రక్షాళన చేసి గంధపుష్పాన్వితము నైన ఆర్యములను ఉంచవలెను. సర్వవ్యాప్తము, జ్యోతిస్వరూపము అయిన చైతన్యములను “ అయఫట్” అని అభిమంత్రించిన, ఉదరముచే యోగ బీజము నడిపి, హరిని ధ్యానించి, పూర్వాదియోగ పీఠము నందు ధర్మమును, వే రాగ్యమును. ఐశ్వర్యమును, ఆగ్నేయదిక్కు మొదలైన వాటిని, అధర్మము మొదలగు అంగము లకు, పీఠమునందు కూర్మమును, అనంతుని, యముని, సూర్యాదుల మండలములను, విమల మొదలగు కేసరస్థానము నందున్న గ్రహణములను, కర్ణిక (ఈ పద్మము మధ్యనున్న దుద్దు యందున్న గ్రహణములనుముందు తన హృదయము నందు ధ్యానము చేసి పిమ్మట మండలము పై ఆవాహనము చేసి అర్చించవలెను. వైష్ణవ విద్యానుసారముగా ఆర్య-పాద్య. ఆచమన - మధుపర్క - స్నాన, వస్త్ర - యజ్ఞోపవీత - అలంకార - గంధ - పుష్ప - ధూప - దీప - నైవేద్యములను, నమర్పింపవలెను. పూర్వాది దిక్కులందు అంగదేవతలను పూజించవలెను. తూర్పు-పడమర దిక్కులందు గరుత్మ తుని, కుడివైపున చక్రమును, గదను, ఎడమవైవన శంఖమును, ధనస్సును ఉంచవలేను. దేవుని ఎడమవైపున అంబుల పొదులను, కుదివైపున ఖడ్గమును, ఎడమవైపున డాలును ఊంచవలెను. కుడివైపున అగ్రభాగమున పుష్టిని ఉంచవలెను.

వనమాలను, శ్రీ వత్సమును, కౌస్తుభమును కూడ ఉంచవలెను. దిక్పాలకులను వెలుపల ఉంచవలెను. ఈ అంగదేవతల నందరిని వారి వారి మంత్రములచే పూజించవలెను. విష్ణుపూజ పూర్తి యేన పిమ్మట ఆంగదేవతలను వ్య స్త రూపమునను, నమ స్తరూపమునను బీజాక్షరయు క మంత్రములతో పూజించవలెను. జపించి, ప్రదక్షిణము చేసి, స్తుతించి, అర్ఘ్యమును సమర్పించి “నేనే బ్రహ్మను, నేనే హరిని” అని ధ్యానము చేసి హృదయమునందు ఉంచుకొనవలెను.

ఆవాహనము చేయు నపుడు 'అగచ్చ' ఆనియు. ఉద్వాననము చేప్పునపుడు 'క్షమస్వ' అనియు అనవలెను. ఈ విధముగా అష్టాక్షరాదులచే పూజ చేసి ముక్తిని పొందును.

ఇంతవరకును ఏకమార్త్యర్చనము చెప్పబడినది. ఇపుడు నవ వ్యూహార్చనమును వినుము. ఆంగుష్ఠద్వయము సందును తర్జన్యాదులందును వాసుదేవుని, బలాదులను న్యానము చేయవలెను. పిమ్మట శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాలు, పాదము వీటియందు న్యాసము చేసి మద్యయందు పూర్వాదిక్ పూజ చేయ వలెను, ఏక పీఠము పై, క్రమముగ, నవ వ్యూహములను, నవ పీఠములను స్థాపించి వెనుక టివలెనే పూజించవలెను. నవాబ్జములందు నవమూర్తుల నావాహనము చేసి నవవ్యూహపూజ వెనుక టివలెనే చేయవలెను. పద్మ మధ్యమునందు వాటి యందున్న దేవతలను, వాసుదేవుని పూజించవలెను.

అగ్ని మహాపురాణమున ఆదిమూర్త్యాది పూజావిధి యను ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.