అగ్ని మహా పురాణము

Table of Contents

327 - అథ దేవాలయాది మాహాత్మ్యమ్

ఈశ్వర ఉవాచః

            పరమేశ్వరుడు చెప్పెను. ప్రతేశ్వరులను సత్యాది దేవతలను పూజించి వారికి వ్రతము సమర్పించవలేను. ఆరిష్టశాంతికి అరిష్టమూలమాల ఉత్తమము కల్యాణ ప్రాప్తి సువర్ణ రత్న మాలా, మారణకర్మకు మహా శంఖమాలా, శాంతి కర్మకు శంఖమాలా పుత ప్రాప్తి కి మౌక్తి కమాలా ఉపయోగించి జపము చేయవలెను. స్పటికమాల ఐశ్వర్య ప్రదము రుద్రాక్షమాలా ముక్తికి పదము, ఉసిరికాయ పరిమాణము గల రుద్రాక్షము ఉత్తమము. మేరు సహితములు, లేదా, మేరు రహితమగు మాలను జవమునందు ఉపయోగించవచ్చును. మానసిక జపము చేయుచున్న పుడు మాలయందలి పూసలను ఆనా మికంగుష్టములతో జరపవలేను.  ఉపాంశు జపమునందు తర్జన్యం గుష్ట వణులను కలిపి గణన చేయవలెను. జప సమయ మున ఎన్నడును మేరువును దాటరాదు. ప్రమాద వశమున మాట జారిపడినచో రెండు వందల పర్యాయము జపము  చేయ వలేను. మంట సర్వవాద్యమయము ఘంటావాదనము సకల ప్రయోజన పదము గృహము నందును మందిరము వందురు. శివలింగమును గోమయ గోమూత్ర వల్మీక మృత్తికా భస్మ జలములతో శుద్ధి చేయవలెను.

స్కందా ! “ఓం నమశ్శివాయ” యను మంత్రము సకలా భీష్ట పదము. ఇది వేదమునందు వంచాక్షరమనియు లోకమున షడక్షరమనియు చెప్పబడినది. వట బీజములో వటవృక్షమున్నట్లు ఓంకారము నందు శివుడు సమ్మితుడై వుండును “ఓం నమః శివాయ ఈశానః సర్వ విద్యానాం” మొదలకు మంత్రములు సమస్త విద్యాసముదాయము. ఈషడ క్షర మత్రమకు భాష్యము “ఓం నమః శివాయ” యను మంత్ర మే పరమ పదము, ధర్మార్థకామ మోక్షము విచ్చు శివుడు లోకాను గ్రహార్థమై లింగములో నున్నాడు. అందుచే ఈ మంత్రముచే శివలింగమును పూజించవలెను. శివలింగ మును పూజించని వాడు ధర్మదూరుడగును, లింగ పూజనము భుక్తిముక్తి పపముగాన, ఆజీవితాంతము శివలింగమును పూజించవలెను. పాణములు పోయినను శివలింగ పూజ చేయకుండగ భోజనము చేయకూడదు. రుద్ర పూజచే రుద్ర సారూప్యము, విష్ణు పూజచే విష్ణు సారూప్యము, సూర్య పూజచే సూర్య సారూప్యము, శక్తి పూజచే శ క్తి సారూప్యము, లభించును. సంపూర్ణ యజ్ఞ తపోదాన ఫలములు లభించును. లింగస్థాపన చేసిన వానికి కోటి రెట్లు ఫలము లభించును. ప్రతిదినము త్రికాలములందును, పార్థివ లింగము నిర్మించి దానిని బిల్వ పత్రము: తో పూజించువాని నూట పదకొండు తర ముల వారు స్వర్గమును పొందుదురు. విత్తాను సారముగా భక్తి పూర్వకముగా దేవతా మందిరములు కట్టించవలెను. దేవా లయ నిర్మాణము యథా శక్తి గా అల్పము ఖర్చు పెట్టిన దరిదునకును, ఆధికముగా ఖర్చు పెట్టిన ధనికునకు సమాన ఫలము లభించును. సంపాదించిన ధనము నందలి రెండు భాగములను ధర్మ కార్యము నందు వ్యయంచి జీవన నిర్వా హము నకు రెండు భాగము లుంచుకౌనవ లేను. జీవనము అనిత్యము కదా ! దేవతా మందిరమును నిర్మించువాడు ఇరువది యొక్క తరముల వారిని ఉద్దరించి అభీష్టములను పొందును. మట్టి కర్ర ఇటుక శిల వీటితో మందిర నిర్మాణము వరసగా కోటి గుణ ఫలము కలది. ఎనిమిది ఇటుకలతోనై నను మందిరము నిర్మించువాడు స్వర్గలోకమును పొందును. ఆడుకొనుచు ధూళితో మందిరము కట్టు వానికి కూడ అభీష్ట మనోరథసిద్ధి కలుగును.

ఆగ్ని మహాపురాణమున దేవాలయ మాహాత్మ్య వర్ణనమను మూడువందల ఇరువదియేడవ అధ్యాయము సమాప్తము.