అగ్ని మహా పురాణము
58 - అథ స్నపనాది విధిః
హయగ్రీవుడు చెప్పెను : బ్రహ్మదేవా! ఆచార్యుడు ఈశాన్యము నందు ఒక హోమకుండము నిర్మించి దానిలో వైష్ణవాగ్నిని స్థాపింపవలెను. గాయత్రీ మంత్రముతో నూట ఎనిమిది హోమములు చేసి, సంపాతవిధిచే కలశ లను ప్రోక్షించ వలెను. మూర్తి పాలకులగు విద్వాంసులతోడను, శిల్పులతోడను కలిసి యజమానుడు, వాచ్యములతో, శిల్పశాలకు వెళ్ళ వలెను. ఆచట “విష్ణవేశిపివిష్టాయనమః” అను మంత్రుచ్చరించుచు, ఇష్టదేవతా ప్రతిమ కుడి చేతికి కౌతుక సూత్రము కట్టవలెను. ఆ సమయమున ఆచార్యుని హస్తమునకు గూడ ఉన్ని దారము, ఆవాలు, పట్టు వస్త్రము వీటితో కౌతుకము కట్ట వలెను. మండలముపై ఆప్రతిమను వస్త్రముచుట్టి స్థాపించి ఈ విధముగ స్తుతించవలెను. “విశ్వకర్మ నిర్మించిన, దేవేశ్వరి యైన ఓ ప్రతిమా! నీకు నమస్కారము. సమస్త జగత్తును ప్రభావితము చేయు ఓ జగదంబా! నీకు మాటిమాటికి నమస్కరించుచున్నాను. ఈశ్వరీ! నేను నీపై నిరామయుడగు నారాయణుని పూజించుచున్నాను. నీ యందు శిల్పసంబంధి దోషములేవియు లేకుండుగాక. నా విషయమున సర్వదా సమృద్ధి శాలినివిగా ఉండుము”. ప్రతిమను ఈ విధముగ ప్రార్థించి దానిని స్నానాగారమునకు తీసికొని వెళ్ళవలెను.
శిల్పికి ద్రవ్యమునిచ్చి సంతోషపరచవలెను. గురువునకు గోదానమీయవలెను. “చిత్రందేవానామ్” ఇత్యాది మంత్రము పఠించుచు ప్రతిమనేత్రములను తెరవవలెను. “ఆగ్నిర్డ్యోతిః” ఇత్యాది మంత్రముచే దృష్టిసంచారము చేయవలెను. ప్రతిమను భద్రపీఠముపై నుంచి ఆచార్యుడు తెల్లని పుష్పములు, నెయ్యి, ఆవాలు, దూర్వలు, కుశలు దేవత శిరస్సుపై ఉంచవలెను. “మధువాతా” ఇత్యాది మంత్రముచే నేత్రములందు అంజనము ఉంచవలెను. ఆ సమయమున “హిరణ్యగర్భః”, “ఇమం మేవరుణ” ఇత్యాది మంత్రము పఠింపవలెను. ఘృతవతీ ఇత్యాది ఋక్కు పఠించుచు మృతము శరీరమునకు పూయవలెను. శనగపిండితో నలిచి “అదేవాః” ఇత్యాది మంత్రము పఠింపవలెను. “సప్త తే అగ్నే “ ఇత్యాది మంత్రము పఠించి గర్భజలముతో ప్రసును కడగవలెను. “ద్రుపదాదివ ఇత్యాది మంత్రముచే అను లేపనము, ఆపోహిషామ” ఇత్యాది మంత్రముచే ఆభిషేకము చేయవలెను. అభిషేకానంతరము నదీ తీర్థజలములచే స్నానము చేయించి, “పావమానీ'! ఋక్కు పఠించుచు రత్నస్పర్శగల ఉదకముతో స్నానము చేయించవలెను. “సముద్రం గచ్ఛస్వాహా ఇత్యాదిమంత్రము చదువుచు తీర్థ మృత్తి క చేత, కలక జలము చేతను స్నానము చేయించవలెను. “శంతో దేవీ? ఇత్యాది మంత్రముగాయత్రీమంత్రము పఠించుచు వేడినీళ్ళతో స్నానము చేయించవలెను. “హిరణ్యగర్భః” ఇత్యాది మంత్రములచే పంచవిధ మృత్తి కలతో స్నానము చేయించవలెను. పిమ్మ. “ఇమంమేగంగేయమున” ఇత్యాది మంత్రముచే ఇసుక కలిపిన జలము చేతను, “తద్విష్ణోః పరమపదమ్” అను మంత్రముతో పుట్టమట్టి కలిపిన ఉదకము చేతను, పూర్ణ మటముతో స్నానము చేయించవలెను. “ఓషధీః” ఇత్యాది మంత్రము చదువుచు ఓషధి మిశ్ర జలము చేతను, యజ్ఞా యజ్ఞా ఇత్యాది మంత్రము చదువుచు ఉసిరి మొదలగు కషాయ పదార్థములు కలిపిన జలములచేతను, “పయః పృథివ్యామ్” ఇత్యాది మంత్రముతో పంచగవ్యముల చేతను, “యః ఫలినీ” ఇత్యాది మంత్రముతో ఫలమిశ్రిత జలములచేతను స్నానము చేయించవలెను. “విశ్వతశ్చక్షుః” ఇత్యాది మంత్రముతో ఉత్తర దిక్కుననున్న కలశ చేతను, “సోము రాజానమ్” అను మంత్రముతో పూర్వదిక్కలశముచేతను, “విష్ణోరంటమసి” ఇత్యాది మంత్రముతో దక్షిణకలశ చేతను, “హంసః శుచిషత్” ఇత్యాది మంత్రముతో పశ్చిమముననున్న కలశ చేతను ఉద్వర్తన స్నానము చేయించవలెను.
“మూఠానందివో” ఇత్యాది మంత్రము తో ఉసిరికాయతో కూడిన జలముచేతను, “మానస్లోకే ఇత్యాది మంత్రమతో జటామాంసికలసిన జలముచేతను, “గద్గద్వారామ్” ఇది మంత్రముతో గంధమిశ్రిత జలముచేతను, “ఇద మాప” ఇత్యాది మంత్రముతో ఎనుబది యొక్క పదముల వాస్తు మండపమునందుంచిన కలశ లచేతను స్నానము చేయించ వలెను. స్నానానంతరము సమస్త లోక మును అనుగ్రహించు భగవంతుడవైన మహావిష్ణూ! రమ్ము, రమ్ము, ఈ యజ్ఞభాగమును గ్రహింపుము. మీకు నమస్కారము అని ప్రార్థించుచు దేవేశ్వరుని ఆవాహనము చేసి, “ముత్చా మిత్వా” ఇత్యాది మంత్రము చదువుచు విష్ణు విగ్రహహస్తమునకు కట్టిన కౌతుక సూత్రమను, ఆచార్యుని చేతికి కట్టిన సూత్రమును కూడ విప్పివేయవలెను. పిమ్మట 'హిరణ్మయేన” ఇత్యాది మంత్రముతో పాద్యము ‘‘అత్దేవాః” ఇత్యాది మంత్రముతో అర్ఘ్యము, “మధువాత్కా ఇత్యాది మంత్రముతో మధుపర్కము ఇచ్చి “మయిగృహ్ణమి” ఇత్యాదిమంత్రముతో ఆచమనము చేయించవలెను. పిమ్మట విద్వాంసుడు “అన్న మీమదన” ఇత్యాది మంత్రము చదువుచు శ్రీమహావిష్ణువు ఆవయవముల పై దూర్వలు, ఆక్షతలు చల్లవలెను.
“కాండాత్” ఇత్యాది మంత్రముతో నిర్మంథనము చేసి, “గంధవతీ” ఇత్యాది మంత్రముతో గంధమును, “ఉన్నయామి” ఇత్యాది మంత్రముతో పుష్పమాలను, “ఇదం విష్ణుః” ఇత్యాది మంత్రముతో పవిత్రకమును అర్పింపవలెను. “బృహస్పతే? ఇత్యాది మంత్రముతో వస్త్ర ద్వయమును, “వేదాహ మేతమ్” ఇత్యాది మంత్రముతో ఉత్తరీయమును “మహావ్రతేన” ఇత్యాది మంత్రముతో పుష్పములను, ఓషధులను సమర్పింపవలెను. పిమ్మట “ధూరసి” అను మంత్రముతో ధూపము ఆర్పించి, 'విరాట్' సూక్తముతో అంజనమును, 'యుజ్ఞని' ఇత్యాది మంత్రముతో తిలక మును ఇవ్వవలెను. “దీర్ఘాయుష్ట్వాయ” అను మంత్రము 5 పుష్పమాల సమర్పింపవలేను. 'ఇంద్రక్షత్రమభి’ ఇత్యాది మంత్రముతో ఛత్రమును, ‘విరాట్' మంత్రముతో ఆద్దమును, 'వికర్ణ' మంత్రముతో చామరమును, రథంతర మంత్రము తో అలంకారమును సమర్పింప వలెను. వాయుదేవతకు సంబంధించిన మంత్రములతో వింజామరను, “ముక్చొమిత్వా” ఇత్యాది మంత్రముతో పుష్పము నేను సమర్పించి, ఓంకారముతో కూడిన పురుషసూక్తముతో శ్రీ హరిని స్తుతింపవలెను. ఈ వస్తువుల నన్నింటిని పిండే కాదుల పైనను శివుడు మొదలగు దేవతలకును ఈ విధముగనే సమర్పింపవలెను. దేవతను పైకి ఎత్తు నపుడు సౌపర్ణ సూక్తమును పఠింపవలేను. “ప్రభో లెమ్ము” అని పలుకుచు శ్రీ మహావిష్ణువును ఎత్తి శకుని సూక్తము పఠించుచు మండపము నందలి శయ్యమీదకు తీసికొని వెళ్ళవలెను. బ్రహ్మ రథము మీదగాని, పల్లకీ మీదగాని తీసికొని వెళ్ళవలేను. “ఆతోదేవాః” అను సూక్తము పఠించుచు, “శ్రీశ్చతే లక్ష్మీశ్చ” అను మంత్రము పఠించుచు, ప్రతిమను, పిండికను శయ్యపై చేర్చవలెను, పిమ్మట మహావిష్ణువు నకు నిష్కలీకరణ క్రియ చేయవలెను. సింహము, వృషభము, గజము, వ్యజనము, కలశము పతాక, భేరి, దీపము ఈ ఎనిమిదియు మంగళ సూచక వస్తువులు. వీటినన్నింటిని, ఆశ్వసూ క్తము పఠించుచు, భగ పంతునకు చూపవలెను. 'త్రిపాత్' ఇత్యాది మంత్రము చదువుచు భగవంతుని చరణ ప్రాంతమునందు ఉఖి (ఒక విధమైన పాత్ర) దాని మూత, అంబిక (చిన్న బూర్లమూకుడు), దర్వి (గరిటె) పాత్ర, రోలు, రోకలి, శిల, చీపురు, భోజన పాత్ర, ఇతర గృహ పాత్రలు ఉంచవలెను. తలవైపు వస్త్రములు, రత్నములుంచిన కలశము ఉంచవలెను. ఆ కలశ మును పటిక బెల్లం ముక్కలతో నింపవలెను. దానికి 'నిద్రా' అని పేరు. ఈ విధముగ భగవంతుని శయన విధానము చెప్పబడినది.
ఆగ్ని మహాపురాణమునందు స్నపనాది విధానమను ఏబది ఎనిమిదవ అధ్యాయము.
