అగ్ని మహా పురాణము

Table of Contents

189 - అథ శ్రవణద్వాదశీవ్రతమ్

అగ్నిరువాచః-

ఆగ్ని దేవుడు చెప్పెను:- ఇప్పుడు భాద్రపదశుక్ల పక్షమున చేయబడు “శ్రవణద్వాదశీ”వ్రతమును గూర్చి చేప్పేడను. శ్రవణనక్షత్రయుక్త మైన చో ఈ ద్వాదశి శ్రేష్టమైనది. ఉపవాసము చేసినచో గొప్ప ఫలము నిచ్చును. శ్రవణ ద్వాదశినాడు నదీసంగమస్నానపం విశేషఫలప్రదము. బుధవార శ్రవణ నక్షత్రములు కలిసిన ద్వాదశినాడు చేయు దానాదులు గొప్పఫలముల నిచ్చును. త్రయోదశినాడు నిషిద్ధ మైనను ఈ ప్రకముయొక్క పారణము త్రయోదశినాడు చేయవలెను.” “నేను ద్వాదశినాడు ఉపవాస మండి జలపూర్ణ కలశము పైనున్న సువర్ణనిర్మిత వామనమూర్తి ని పూజించి వ్రతపాఠణము త్రయోదశినాడు చేసెదను” అని సంకల్పించవలెను.  రెండు శ్వేతవస్త్రములు ధరించినవాడును, ఛత్రపాదుకాధారియ, శంఖ చక్రములు ధరించినవాడును అగు వామనుని కలశముపై ఆవాహనము చేయుచున్నాను “ఛత్రదండాలంకృతు డగు విష్ణువును పంచామృతములతోను, శుద్ధజలములతోను  స్నానము చేయించుచున్నాను. వామనునకు నమస్కారము. “ఆర్ఘ్యమునకు తగువారిచేతను, ఇతరుల చేతను పూజితుడవగు ఓదేవేళా! నీకు అర్ఘ్యము సమర్పించుచున్నాను. నాకు భోగ- మోక్ష- సంతాన - యశః - పరమెశ్వర్యాదుల నిమ్ము” ‘వామనాయ నమః’ అను మత్రముతో గంధద్రవ్యములు సమర్పించి ఈ మంత్రముతోనే నూట ఎనిమిది హోమములు చేయవలెను. ఈ క్రింది విధముగ సర్వాంగపూజ చేయ వలెను. ఓం నమో వాసుదేవాయ శిరః పూజయామి. శ్రీధరాయ మః ముఖం పూజయామి. కృష్ణాయ నమః కణ్ణంపూజయామి. శ్రీపతయే నమః వక్షస్థలం పూజయామి. సర్వాస్త్రధారిణే నమః భుతో పూజయామి. వ్యావకాయనమః నాభిం పూజయామి. వామనామ నమః కటిం పూజయామి. త్రైలోక్యజననాయ నమః మేడ్రం పూజయామి. సర్వాధిపతయే నమః జట్టే పూజయామి సర్వాత్మనే నమః పాదౌ పూజయామి”. పిదప వామనునకు మృతపక్వ పదార్థము నైవేద్యము దధ్యోదపూర్ణ పాత్రమును సమర్పించవరిమ. రాత్రియందు జాగరము చేసి ప్రాతః కాలమున సంగమమునందు స్నానము చేయవలెను. పిదప గంధపుష్పాదులతో పూజించి ఈ విధముగా ప్రార్థించుచు పుష్పాంజలి సమర్పించవలెను- “ఓబుధుడు, శ్రవణుడు అను పేర్లు గల గోవిందా! నీకు నమస్కారము, నమస్కారము. నాపాపములన్నీ తొలగించి సమస్త సౌఖ్యములను ఇమ్ము. దేవదేవేశ్వరా! జనార్ధనా! నే నిచ్చిన ఈ పుష్పాంజలిచే నర్వదా ప్రసన్నుడవు కమ్మ.” పిదప పూజాద్రవ్యము లన్నియు ఈ క్రింది వీధముగా చెప్పుడు బ్రాహ్మణునకు దానము చేయవలెను. “వామనుడే బుద్ధి నిచ్చువాడు. వామనుడే దాత. ఈ ద్రవ్యములలో ఉన్న వాడు వామనుడే. వామనుడే దీనిని గ్రహించుచున్నాడు. వామనుడే ఇచ్చుచున్నాడు. వామనుడు అన్ని ద్రవ్యములందును ఉన్నాడు. వామనరూప డగు విష్ణువునకు నమస్కారము.” పిదప బ్రాహ్మణులకు భోజనము పెట్టి తాను భోజనము చేయవలెను.

ఆగ్ని మహాపురాణమునందు శ్రవణద్వాదశీవ్రత మను నూట ఎనుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.