అగ్ని మహా పురాణము

Table of Contents

107 - అథ స్వాయమ్భువసర్గకథనమ్.

ఆగ్ని రువాచః-

అగ్ని దేవుడు పలికెను. వసిష్ణా! ఇప్పుడు నేను భువనకోశము, పృథివి, ద్వీపములు మొదలగు వాటిని గూర్చి చెప్పెదను. ప్రియవ్రతునకు అగ్ని ర్ర - అగ్ని దాహు - వవుష్మత్ - ద్యుతిమత్ - మేధా - మేధాతిథి - భవ్య - సవనయులను పుత్రులుండిరి. వదవకుమారుడైన జ్యోతిష్మంతుడు యథార్థనామధేయము కలవాడు. ప్రియవ్రతుని కుమారులంద రును - జగద్విఖ్యాతులు. తండ్రి వారికి సప్త ద్వీపము నిచ్చెను. ఆగ్నీధ్రునకు జంబూద్వీపము, మేధాతిథికి ప్లస్ ద్వీపము, వపుష్మంతునకు. లలిద్వీపము, జ్యోతిష్మంతువకు కుశద్వీపము, ద్యుతిమంతునకు క్రౌంచద్వీపమ భవనకు శాక ద్వీపము, సరసునకు పుష్కరద్వీపము ఇచ్చేను. ఆర్నీ ధ్రుడు - లక్షల కొలది యోజనముల విస్తీర్ణము గల జంబూ ద్వీపము తన కుమారులకు ఈ విధముగ విభజించి యిచ్చెను. నాభికి హిమవర్షమును (నేటి భారతవర్ణమును), కింపురువు నకు హేమకూట వర్షమ, హరివర్పునకు నైషధ వర్షము, ఇలావృతులకు మధ్యభాగమున మేరుపర్వతముతో గూడిన ఇలా వృతవర్షమును రమ్యకునకు నీలాచలాక్రితమగు రమ్యకవర్షమును, హిరణ్యవంతునకు శ్వేతవర్షమును, గురువుకు ఉత్తరకురు వర్షమును ఇచ్చెను. భద్రాళ్వునకు భద్రాశ్వవర్షమును, కేతుమయునకు మేరుపర్వతమునకు పశ్చిమముగా నున్న కేతుమాల వర్షమును ఇచ్చెను. ఈ విధముగ తన పుత్రులను ఆయా వర్షములకు అధిపతులుగ చేసి ప్రియవ్రతును వానప్రస్థుడే సాల గ్రామ క్షేత్రమునంద తపస్సు చేసి విష్ణులోకమును పొందెను. ఓ మునిశ్రీష్టా! కింపురుషాదివర్షము లెనిమిదింటియందును సుము అధికము.ఆప్రయత్నముగనే భోగము లన్నియు లభించును. అచట జరామృత్యుభయము గాని. ధర్మాధర్మములు గాని, ఉత్తమ - మధ్యమ - ఆధమాది భేదములుగాని లేవు. అచట యుగ పరివర్తనము కూడ ఉండదు. హిమవర్షాధిపతి యగు నాభికి, మేరుదేవియందు ఋషభదేవుడు పుత్రుడుగా జనించేను. ఋషభుని కుమారుడు భరతుడు. ఋషభదేవుడు భరతునకు రాజ్యలక్ష్మిని ఇచ్చివేసి, శాలగ్రామమేతమున శ్రీహరిని శరణుజొచ్చెను. ఈ భరతుని పేరుతో భరతవర్షము ప్రసిద్ధమైనది. భరతునకు సుమతి యను కుమారుడు జనించెను. ఆతనికి రాజ్యభారము సమర్పించి భరతుడు శాలగ్రామ తేత్రమునందు శ్రీహరిని శరణు జొచ్చెను. ఆ యోగిరాజు యోగాభ్యాసతత్పరుడై ప్రాణములను పరిత్యజించేను. ఈతని ఆ చరిత్రమును నీకు మరల చెప్పెదన. పిదప సుమతి వీర్యమువలన ఇంద్రద్యుమ్నుడు జనించేను. 'ఆతనికి పరమే ఎయు ఇతనికి ప్రతీహారుడును, ఆతనికి ప్రతిహర్తయు. ఆతనికి భవుడు, భవునకు ఉద్దీథుడు, ఆతనికి ప్రస్తారుడు, అతనికి విభుడు, ఆతనికి పృథువు, ఆతనికి నక్తుడు, ఆతనికి గయుడు, గయునకు నరుడు నరునకు విరాట్టు ఆతనికి మహా వీర్యుడు, ఆతనికి శ్రీమంతుడు, అతనికి మహాంతుడు, ఆతనికి మనస్కుడు, ఆతనికి త్వక్ష, ఆతనికి విరజుడు అతనికి రజుడు, జన్మించిరి. మహాము! రజునిపుత్రుడైన శతజిత్తుకు నూరుగురు పుత్రులు జనించింది. వారిలో విశ్వజ్యోతి ముఖ్యుడు. వానివలన భారతవర్షము అభివృద్ధి చెందెను. కృతవ్రేతాది క్రమమున ఇది స్వాయం భువమను వంక ముగా చెప్ప బడినది.

అగ్ని మహాపురాణమునందు స్వాయంభువసర్గమను నూటఏడవ అధ్యాయము సమాప్తము.