అగ్ని మహా పురాణము

Table of Contents

196 - అథ నక్షత్రవ్రతాని

 అగ్నిరువాచః-

అగ్ని దేవుడు పలికెను : ఇపుడ నక్షతవ్రతములను గూర్చి చెప్పేదను, నక్షత విశేషములందు పూజ చేయుటచే శ్రీమహావిష్ణువు సకలాభీష్టములను తీర్చును. ప్రప్రధమముగ, నక్షతపురుషుడైన శ్రీమహావిష్ణవును చైత్రమాసమునందు పూజించవలెను. మూలనక్షత్రమునందు శ్రీమహావిష్ణవ చరణకి మలములను, రోహిణీనక్షతమున మోకాళ్ళను, పూర్వాషాడో త్తరాషాఢలందు ఊరుద్వయమును, పూర్వఫల్గున్యుత్ర రవనులయందు మేడ్రమును, కృత్తికయందు కటిపడేశముమ, పూర్వాభాద్రోత్తరాభాదలయందు పార్శ్వములను రేవతియందు కక్షిని, అనూరాధయందు స్తనద్వయమును ధనిష్ఠయందు పృష్టభాగమును, విశాఖయందు భుజద్వయమును, పునర్వసువునందు వేళ్ళను పూజించవలెను. ఆశ్లేషయందు సఖములను, జ్యేష్ఠయందు కంఠమును, శ్రవణమునందు కర్ణములను, పుష్యమియందువదనమండలమును, స్వాతియందు దంతాగములను శతభిషమునందు ముఖమును, మమయందు నాసికను, మృగశిరయందు వేతములను, చిత్తయందు లలాటములు, ఆర్ధ్ర యందు కేశ సమూహమను పూజించవలెను. సంవత్సరాంతమున బెల్లమునింపిన కలశ పై శ్రీమహాష్ణువు స్వర్ణమూర్తి ని పూజించి బాహ్మణునకు దక్షిణాసహితముగ శయ్య, గోవు, ధనము మొదలగునవి  దానము  చేయవలెను. సర్వపూజనీయుడగు నక్షత్రపురుషుడైన శ్రీమహావిష్ణువునకును, శివునకును భేదము లేదు. అందు శాంభవాయనీయవత మాచరించువాడు కృత్తికా సంబద్ధ మగు కార్తికమాసమునందును, మృగశిర నక్షతసంబద్ధ మగు మార్గశీర్షమాసమునందును కేశవాది నామములతోడను, అచ్యుతాయ నమః ఇత్యాదినావములతోడను శ్రీమహావిష్ణువును పూజించవలెమ, “నేను కార్తిక మాసముయొక్క కృత్తికాసంబద్ధ పూర్ణిమనాడు మాసమనందను, నక్షతమునందునుఉన్న శ్రీహరిని పూజింతును. భుక్తి ముక్తి పద మగు శాంభవనీయవత మాచరింతును” అని సంకల్పించవలెను. “కేశవాదిమూర్తులతో ఉన్నవాడును, ఆయురారోగ్యవృద్ధికలిగించువాడును అగు అచ్యుతుని ఆవాహనము చేయుచున్నాను” అని ఆవాహనము చేయవలెను. కార్తికమునుండి మాఘమువరకు నాల్గు మాసములు అన్నదానము చేయవలెను. ఫాల్గునమునండి ఆషాఢమువరకు మద్గాన్నము ఆషాడమనుండి అశ్వయుజమువరకు పాయసము దానము చేయవలెను. రాత్రియందు శ్రీమహావిష్ణువునకును బ్రాహ్మణునకును నైవేద్యము సమర్పించవలెను. పంచగవ్య జలవతో స్నానము చేసి, దానిని త్రాగుటచే పవిత్రుడగును. ఉద్వాసన చెప్పుటకు పూర్వము దేవునకు సమర్పించిన దంతయు నైవేద్యము; ఉద్వాసనచేప్పగానే ఆది ఆంతయు నిర్మాల్యమగును. “అచ్యుతా! నీకు నమస్కారము. నమస్కారము. నా పాపములు నశించి పుణ్యము వృద్ధిపొందు గాక ! నా ఐశ్వర్యాదులు సదా అక్షయ్యము లగుగాక. నా సంతాన పరంపర విచ్ఛిన్నము కాకుండుగాక. పరాత్పరా! పరమేశ్వరా! నీవుపరాత్పరుడవై బ్రహ్మవై నీ మర్యాదనుండి ఎన్నడును ఏ విధముగ ద్యుతుడవుకావో అట్లే వా మనోవాంఛిత కార్యమును సఫలము చేయుము. ఓ పాపవినాశకా! నేను చేసిన పాపములు తొలగింపుము. అచ్యుతా! అనంతా! గోవిందా! ఆపవేయస్వరూపా! పుషోత్తమా! నన్ననుగ్రహించి వా కభీష్టములైన పధార్థములను ఆశ్రయములుగ చేయుము”. అని ప్రార్థించవలెను. ఈ విధముగ్ ఏడు సంవత్సరములు శ్రీహరిని పూజించినవాడు భోగ మోక్షములను పొందును. ఈ నక్షతవ్రత సందర్భమున సకలాభీష్టపదమగు ఆనంతవ్రతమును గూర్చి చెప్పెదను. మార్గశీర్ష మాసమునందు మృగశిర నక్షత్రము వచ్చినపుడు గోమూత్రప్రాశనము చేసి శ్రీహరిని పూజించవలెను. ఆ అనంతుడు సకలకామప్రదాత; అనంతఫలముల నిచ్చువాడు ఈ వ్రతము చేయువానికి రాబోవు జన్మలో కూడ అనంతపుణ్యఫలమునిచ్చును. ఈ మహావ్రతమువలన అనంతమహా పుణ్యము లభించును. ఇది అభిలషిత వస్తువుల నిచ్చు వాటిని అక్షయములుగ చేయును. అనంతుని చరణ కమలాదిపూజ చేసి రాత్రి తై లరహిత మగు భోజనము చేయవలెను. అనంతుని ఉద్దేశించి మార్గశీర్షమునుండి ఫాల్గునమువరకు మృతమును, చైత్రమునుండి ఆషాఢమువరకు బియ్యము. శ్రావణము నుండి కార్తికమువరకు క్షీరమును హోమము చేయవలెను. ఈ అనంతవ్రత మాచరించుట చేతనే యువనాశ్వునకు నుంధాత ఆను పుత్రుడు జనించెను.

అగ్ని మహాపురాణమునందు నక్షత్రవ్రతవర్ణన మను నూట తొంబది యారవ అధ్యాయము సమాప్తము.