అగ్ని మహా పురాణము

Table of Contents

203 - అథ నరకస్వరూపమ్

అగ్ని రువాచః-

ఆగ్నిదేవుడు పలికెను ; వసిష్టా! ఇపుడు నరకములను గూర్చి చెప్పెదను. పుష్పాద్యుపచారములతో శ్రీమహా విష్ణువును పూజించువారికి నరక ప్రాప్తి ఉండదు. ఆయుర్దాయము పూర్తి యేనపిమ్మట వలదన్న ను మానవుడు మరణించి తీరును. దేహధారి యైన జీవుడు అగ్ని, జలము, విషము, శస్త్రఘాతము, ఆకలి, వ్యాధి, పర్వతమునుండి పడుట మొదలైన ఏదియో యొక నిమిత్తముచే ప్రాణములు విడచును. స్వకర్మానుసారముగ యాతనలు అనుభవించుటకై మరొక శరీరమును గ్రహించును. పాపకర్మ చేసినవాడు దుఃఖమును అనుభంచును. పుణ్యకర్మచేసినవాడు సుఖ మనుభవించును. మరణానంతరము యమదూతలు వచ్చి పాపాత్ముని దుర్గమమార్గము ద్వారా యమపురిలోనికి దక్షిణమార్గముద్వారా తీసికొని పోయి యమధర్మరాజు ఎదుట నిలుపుదురు. ఆ యమదూతలు చాల భయంకరముగ నుందురు. ధర్మాత్ములను మాత్రము వశ్చిమాదిద్వారములద్వారా తీసికొనిపోవుదురు. యముని ఆజ్ఞ ప్రకారము పాపాత్ములు నరకమునందు పడవేయబడుదురు. వసిష్టాదిఋషులు బోధించిన ధర్మమును ఆచరించువారిని స్వర్గమునకు తీసికొనిపోవుదురు. గోహత్య చేసినవాడు ‘మహావీచి’ నరకమునందు ఒక లక్ష సంవత్సరములు బాధ లనుభవించును. బ్రహ్మహత్య చేసినవారు చాల ఉష్ణ మైన ‘తామ్రనుంభ’ నరకమునందు పడద్రోయబడుదురు. భూమిని అపహరించిన పాపాత్మునకు రౌరవాది నరకమునందు మహాప్రలయమువరకును మెల్ల మెల్లగ దుస్సహ మైన పీడ కల్గింపబడును. శ్రీ - బాల - వృద్ధులను చంపిన పాపాత్ములు పదునలుగురు ఇంద్రుల రాజ్యము పూర్తి యగు నంత కాలము మహారౌరవ మను రౌద్ర మైన నరక మునందు బాధ అనుభవింతురు. ఇతరుల ఇళ్లను, పొలములను తగులబెట్టిన వారిని ఒక కల్పమువరకు మహారౌరవనరకమునందు కాల్చివేయుదురు. దొంగతనము చేయువారు తామిస మను నరకమునందు బాధ లనుభవింతురు. పిదప యముని అనుచరులు దానిని బల్లెములతో పొడుచుచుందురు, ‘మహాతామిస్ర’ నరకమున సర్పములచేతను జలగ లచేతను పీడింతురు. మాతృహత్యాది పాపములు చేసినవారిని అసిపత్ర వనమను నరకమునందు పడవేయుదురు. అచట వాని అవయవములను కత్తులతో, ఈ భూమి ఉన్నంతవరకును, ఛేదించుచుందురు. ఈ లోకమునందలి ఇతరప్రాణుల హృదయములు కాల్చినవారిని అనేకకల్పముల వరకును ‘కరంథ వాలుక’ అను నరకమునందు, వేడిగా నున్న ఇసుక పై వేయించేదరు. ఇతరులకు పెట్టకుండ మిష్టాన్నమును తిన్న వాడు ‘కాకోల’ మను నరకమునందు పురుగులను, రెట్టలను తినుచుండును. పంచమహాయజ్ఞములను, నిత్యకర్మలను త్యజించువాడు కుట్టల మను నరకమునందు మూత్రమును, రక్తమును త్రాగుచుండును. అభక్ష్యవస్తువులు భక్షించువాడు మహాదుర్గంధమయ మగు నరకములో పడి రక్తమును ఆహారముగ గొనును.

ఇతరులకు కష్టము కలిగించువాడు తైలపాకనరకమునందు తిలల వలె నలుగగొట్టబడును. శరణాగతుని చంపినవాడు గూడ తైలపాక నరకమునందు పక్వము చేయబడును. యజ్ఞమునకై ఏదైన ఒక వస్తువు నిచ్చెద నని చెప్పి ఇవ్వనివాడు ‘నిరుచ్చ్వాస’ నరకమునందును, రసవిక్రయము చేయువాడు ‘వజ్రకటాహ’ నరకమునందును, అసత్యము లాడువాడు ‘మహాపాత’ నరకమునందును పడవేయబడును.

పాపాత్ముడు ‘మహాజ్వాల’నరకమునందును, ఆగమ్యాగమనము చేసినవాడు ‘క్రకచము’ నందును, వర్ణసంకర సంతానోత్పత్తి చేసినవాడు “గుడపాకము” నందును, ఇతరుల మర్మస్థానములందు బాధకలిగించినవాడు ‘ప్రతుదము’ నందును, ప్రాణిహింస చేయువాడు ‘క్షార హ్రదము’ నందును, భూమి అపహరించినవాడు ‘క్షురధారా’ నరకమునందును, గోస్వర్ణాపహారి ‘అంబరీషము’ నందును. వృక్షములను భేదించువాడు ‘వజశస్త్రము’ నందును, మధువు దొంగిలించినవాడు ‘పరీతాపము’ నందును. ఇతరుల సొత్తు అపహరించిన వాడు ‘కాలసూత్రము’ నందును. ఆధీనముగా మాంసమును తినువాడు “కశ్మలము” నందును, పితరులకు పిండప్రదానము చేయనివాడు. “ఉగ్రగంధము” నందును యమభటులచే పడద్రోయ బడును. లంచము తీసికొను వానిని “దుర్దుర” నరకమునందును, నిరపరాధులను బంధించిన వానిని “లోహమయ మంజూష” యను నరకమందును వేద నిందకుని “ఆప్రతిష్ణము” సందును అబద్ధపు సాక్ష్య మిచ్చు వానిని “పూతివకము” నందును, ధనము నపహరించిన వానిని “పరిలుంఠము” నందును, గాలశ్రీ, వృద్ధులను చంపిన వానిని, బ్రాహ్మణపీడ కుని “కరాలము” నందును, మద్యపానము చేయు బ్రాహ్మణుని “విలేపము” నందును, మిత్రులందు భేదభావము కలిగించు వానిని “మహా ప్రేతము” నందును, పడద్రోయుదురు. పరగామి యగు పురుషుడును, అనేక పురుషగామిని యగు శ్రీయు “శాల్మలము” అను వారక మునందు కాలుచున్న లోహము ఆకారములో ఉన్న ఆ ప్రియురాలిని, లేదా ప్రియుని ఆలింగనము చేసికొనవలసివచ్చును. చాడీలు చేప్పుహని నాలుకను లాగిపారవేయుదురు. పరస్త్రీలను కుదృష్టితో చూచిన వాని కండ్లు పీకి వేయుదురు. మాతా - పుత్రగామిని కణకణలాడు చున్న నిప్పులపై పడద్రోయుదురు. చోరులనుఛురికతో భేదింతురు. మాంసభక్షణము చేయు నరపిశాచులకు వారి మాంసమే కోసి తినిపింతురు. మాసోపవాసము గాని, ఏకాదశి వ్రతము గాని, భీష్మపంచక వ్రతము గాని చేయువాడు నరక మలకు వెళ్ళడు.

అగ్ని మహాపురాణమునంను నరకస్వరూపవర్తన మను రెండువందల మూడవ ఆధ్యాయము సమాప్తము.