అగ్ని మహా పురాణము

Table of Contents

267 - అథ మహేశ్వరస్నానలక్షకోటి హోమాదయః

పుష్కర ఉవాచః

పుష్కరుడు పలికెను. రాజాదులకు జయమునిచ్చు మాహేశ్వర స్నానాదుల గూర్చి చెప్పెదను. పూర్వము శుక్రాచార్యుడు దీనిని దానవేంద్రుడగు బలికి చెప్పెను. ప్రాతః కాలము, సూర్యోదయమునకు పూర్వము యాచార్యుడు రాజును భద్రపీఠము పై కూర్చుండ బెట్టి “జయ, జయసర్వాన్ శత్రూన్” మొదలు “లిఖి, ఖిలిస్వాహా” వర కునుఉన్న మూలోక మంత్రమును చెప్పుచు స్నానమును చేయించవలెను. ఈ విధముగ స్నానము చేసిన పిమ్మట తండుల హోమము చేసి త్రిశూలధారియగు శివునకు పంచామృత స్నానము చేయించి పూజ చేయవలయును.

సర్వదా విజయమునిచ్చు ఇతర విధములగు స్నానములను చేప్పేదను, ఘృతస్నానము ఆయుర్వర్ధక ము. గోమయస్నానము లక్ష్మీప్రదము. గోమూత్రస్నానము పాపనాశ కము. క్షీరస్నానము బలవృద్ధికరము, దధ్ని నము లక్ష్మీవర్గకము. కుశోదక ముతో స్నానము పాపములను నశింపచేయును. పంచగవ్యస్నానముచే సర్వకామములును లభించును. శృంగోదక స్నానము పాపవినాశ కము. పలాశ , బిల్వ, కమల, - కుశ , స్నానము సర్వకామ్య ప్రదము. వచ, రెండు విధముల పసుపు, ముస్త కలిపిన నీటితో స్నానము రాక్షసవినాశ కము, ఆయుర్వృద్ధి యశస్సు ధర్మము, మేధ కూడ దీనిచే లభించును. సువర్లోకములతో స్నానము మంగళకరము. రజతతామ్ర జల స్నానములు కూడ మంగళ కరము రత్నమిశ్ర జలముతో స్నానము విజయమును, సర్వగంధమిశ్రిత జలముతో స్నానము సౌభాగ్యమును. ఫలో దక స్నానము, ఆరోగ్యమును, ఉసిరికాయల జలముతో స్నానము లక్ష్మిని ఇచ్చును. తిల శ్వేత స్వపములు కలిపిన జలముచే లడ్మియు, ప్రియంగు జలస్నానముచే సౌభాగ్యము, పద్మఉత్పల కదంబ మిశ్ర జలస్నానములచే లక్ష్మియు బలావృక్ష జలస్నానముచే బలము లభించును. విష్ణుచరణోదక స్నానము అన్ని స్నానముల కంటెను శేషమైనది.

ఏ కాకియైన మనుష్యుడు ఒక కోరికతో ఒకే స్నానము చేయవలయును, ఆక్రందయతి ఇత్యాది సూక్తము చెప్పుచు చేతికి మణికట్టవలేను ఈమణి కుష్ణ - పాఠ్యా. - వదా – శుంఠీ - శంఖ - లోహాదులతో చేయబడవలెను. శ్రీ మహావిష్ణువు సర్వకామములకు అధిపతి. ఆతనిని పూజించుటచే సర్వకామములను పొందును. మృతమిశ్ర దుగ్ధ ముతో స్నానము చేయించి విష్ణువును పూజించు వానికి పిత్తరోగము నశించును. పంచముద్ద బలియిచ్చినచో అతిసార రోగము పంచగవ్య స్నానము చేయించినచో పొతవ్యాధి ద్విస్నేహ ద్రవ్యములతో స్నానము చేయించి శ్రద్ధాపూర్వకముగ పూజించు టచే శ్లేష్మరోగములు నశించును మృత - తైల, మధువులతో, చేయించిన స్నానము, “త్రిరస” స్నానము. మృత జలములతో చేయించిన స్నానము, “ద్విస్నేహ” స్నానము మృత, తైల, మిశ్ర జలముతో చేయించిన స్నానము సమలస్నా నము. మధు ఇక్షుర స క్షీరములతో, చేయించిన స్నానము త్రి మధురస్నా నము. మృత, ఇక్షురస, మధు లతో చేయించిన శ్రీరస స్నానము లక్ష్మీప్రదము. కర్పూర, ఉషీర చందనములతో చేసిన అనులేపము “త్రిశుక్లము" చందన ఆగురు, కర్పూర, కస్తూరి కుంకుమములతో చేసిన అనులేపనమును, విష్ణువునకు, సమర్పించినచో యది సర్వ కామ వల ప్రదము. కర్పూరచందన, కుంకుమములతో కాని, కస్తూరి కర్పూర చందనములతో కాని, చేసిన త్రిసుగంధ మనులేపనము సర్వకామప్రదము, జాతివల కర్పూర చందనములుయనునవి "త్రిశీతక మని" చెప్పబడును. పీతవర్ల ములు, శుక్ల వర్ణములు, శుక్లములు, కృష్ణములు, రక్తములు, ఇవి పంచవర్ణములు. విష్ణుపూజకు, ఉత్పలములను, కమ లములను, జాతీపుష్పములను త్రిశీతముకు త్రిశీతమును ఉపయోగించవలెను. కుంకుమ ర క్త కమల రక్తాత్పలములకు “త్రిరక్తము" యని పేరు. ధూపదీపాదులతో మహావిష్ణువుకు పూజ చేసినచో మానవులకు శాంతి లభించును. నాలుగు హస్త ముల చతురస్ర కుండమునందు ఎనమండుగురు లేదా పదునారుగురు బ్రాహ్మణులు తిల, ఆజ్య, తండులములతో లక్షగానీ, కోటిహోమము చేయవలయును. గృహపూజ చేసి గాయత్రిచే హోమము చేసినచో క్రమముగా అన్ని విధముల శాంతి కలగును.

అగ్ని మహాపురాణమున మహేశ్వరస్నాన లక్ష, కోటి, హోమాదికమను రెండువందల ఆరువదియేడవ అధ్యాయము సమాప్తము.