అగ్ని మహా పురాణము

Table of Contents

270 - అథ విష్ణు పంజరమ్

పుష్కర ఉవాచః

పుష్కరుడు పలికెను. పూర్వము త్రిపుర సంహారోద్యుక్తుడగు శివునిరక్షకై బ్రహ్మ విష్ణు పంజరస్తోత్రమును ఉపదేశించేను,

బలాసురుని చంపుటకై వెళ్లుచున్న ఇంద్రునకు బృహస్పతి ఉపదేశించెను. విజయ ప్రదమగు దానిస్వరూపము చెప్పెదను. వినుము. “నాకు తూర్పున చక్రధారియగు విష్ణువు, దక్షిణమున గదాధారియగు విష్ణువు, ఉత్తరమున ఖడ్గ ధారియగు విష్ణువు ప్రకాశించుచున్నాడు. విదిశలందు హృషీ కేశడు, వాటి మధ్యలందు జనార్దనుడు, భూమియందు, వరాహరూపధారియగు హరి, ఆకాశమున నరసింహుడు వుండి నన్ను రక్షించుచున్నారు. చివర క్షరములువున్న నిర్మల మగు ఈ సుదర్శన చక్రను తిరుగుచున్నది. ఇది ప్రేతను రాక్షసులను చంపుచు వెళ్లినపుడు దీనికిరణములవై పు ఎవ్వరును చూడజాలరు సహస్రర్చులు గల ప్రజ్వలించుచున్న అగ్నితో సమానమైన ఈ గదరక్షో, భూత, పిశాచ ములను నశింపచేయును. వాసుదేవుని, శార్ణ ఓంకారధ్వని నా శత్రువులను తిర్యక్, మనుష్య, కూష్మాండ , ప్రేతా దులను, పూర్తిగా నశింపచేయుగాక ! శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గధార యొక్క, ఉజ్జ్వలమగు వెన్నెలలోస్నానము చేసిన నా శత్రువులు, గరుత్మంతునిచే సర్పములవలె వెంటనేశమింతురుగాక”:

“కూష్మాండ, యశ, రాక్షస, ప్రేత, వినాయక, క్రూరమనుష్య, క్రూరపక్షి, సింహాదులును, సర్పాదు లును, విష్ణువుయొక్క శంఖరవముచేకొట్టబడినవై సౌమ్యత్వమును పొందుగాక! నాచిత్త వృత్తిని స్మరణ శక్తిని ఆప హరించువారును, సౌబల తేజస్సులు నశింపచేయువారును నాకాంతిని తగ్గించువారును, భోగ ములను హరించువారును, శుభ లక్షణములను నశింపచేయువారును అగు కూష్మాండులు విష్ణు చక్రహతులై నశింతురుగాక  దేవదేవుడై న వాసుదేవుని, సంకీర్తనముచే నామనో బుద్ధి, ఇంద్రియములకు, స్వాస్యము లభించుగాక  నా వెనుకను ఎదుటను, యేడమ ప్రక్కను వేదశాఖాది కీర్తనమ్ కోణ దిశలందును అంతటను జనార్ధనుడగు హరి ఉండుగాక ! సర్వ పూజనీయుడును, ఎన్నటికిని చ్యుతుడు. కాని వాడును, అనంతరూపుడును, పరమేశ్వరుడును, అగు జనార్ధనుని పాదములకు నమస్కరించువాడు ఎన్నడును దుఃఖితుడు కాడు. శ్రీ హరి పరమాత్మయై నట్లే ఆ కేశవుడు జగత్స్వరూపుడు కూడ. ఈ సత్యము యొక్క ప్రభావముచేతను, అచ్యుతునినామ సంకీర్తనముచేతను, స్త్రీ విధపాపములు నశించుగాక.!

ఆగ్ని మహాపురాణమునందు విష్ణుపంజరమను రెండువందల డెబ్బదవ అధ్యాయము సమాప్తము.