అగ్ని మహా పురాణము

Table of Contents

91 - అథ వివిధ మంత్రాదయః.

పరమేశ్వరుడు చెప్పెను: అభిషేకానంతరము దీక్షితుడు శివ-విష్ణు-సూర్యాదిదేవతలను పూజించవలెమ. శంఖ భేర్యాదివాద్యధ్వనులతో దేవతలకు పంచగవ్యములతో స్నానము చేయించు వాడు, తన కులమును ఉద్ధరించి తాను దేవలోకము నకు వెళ్ళును. దేవతల శరీరమునకు అజ్యాడ్యంగ నము చేయుటచే, కోటి సహస్రవర్ష సంచిత మైన పాపము భస్మ మైపోవును. ఒక ఆడకము (ఆడ్డెడు) నెయ్యి మొదలైన వాడితో దేవతలకు స్నానము చేయించిన మనుష్యుడు దేవత యగును. చందనము పూసి గంధాదులతో దేవపూజ చేయువానికి గూడ అదే ఫలము లభించును. కొంచెము ప్రయాసతో మాత్రమే స్తోత్రపాఠము చే దేవతాస్తుతి చేసినచో భూతభవిష్యజ్ఞానము, మంత్రజ్ఞానము, భోగమోక్షములు లభించుచు. ఎవ రైన మంత్రమునకు సంబంధిం చిన శుభాశుభఫలములను గూర్చి ప్రశ్నించినచో, ఆ ప్రశ్న వాక్యములో నున్న అక్షరములు లెక్కించి, రెండుచే భాగించగా ఒకటి శేషించినచో శుభము, శూన్యముగాని, రెండు గాని శేషించినచో ఆశుభము. మూడుచే భాగించినచో  మూలధాతురూప జీవుని విషయము తెలియును. ఒకటి శేషించినచో వాతజీవుడు, రెండు శేషించినవో పిత్తజీవుడు, మూడు శేషించినచో కప జీవుడు. నాలుగుతో భాగించినచో బ్రాహ్మణాధివర్ణబుద్ధి కలుగును. ఐదుచే భాగించినచో భూతతత్త్వాది జ్ఞానము కలుగును. ఈ విధముగనే జయపరాజయాది జ్ఞానము కూడ కలుగును, మంత్రపదాంతమునందు ఒక త్రికము (మూడు బీజాక్షరములు) న్నను, అధిక బీజాక్షరములున్నను, ప, మ, క లు ఉన్నను వీటిలో మొదటిది అశుభము. మధ్యలో నున్నది మధ్యమము, చివరిది శుభము. చివర సంఖ్యా సమూహ మున్నచో ఆది జీవనకాలము పది సంవత్సరములు అని సూచించును. దళసంఖ్య ఉన్నచో పది సంవత్సరముల పిమ్మట ఆ మంత్రసాధకుడు తప్పక మరణించును, సూర్య-గణపతి- శివ-దుర్గా-లక్ష్మి- విష్ణు మంత్రములు అక్షరములతో, అంగుషస్పృష్ట జైన కమలపత్రముమీద, గోమూత్రాక్షారరేఖపపై, ఇక త్రికము (మూడు  అక్షరములు) ప్రారంభించి పండ్రెండు త్రికములవరకును వ్రాయవలెను. ఆరువదినాలుగు కోషముల మండలము చేసి దానిపై యం, హం యం అను బీజాక్షరముల త్రికములను మొడటి కోశమునుండి ఎనిమిదవ కోశము వరకును వ్రాయవలెను.

ఈ స్థానములపై పాచీక చేయుటచేత గాని, స్పృశించుటచేత గానీ శుభాశుభజ్ఞానము కలుగును. పాచిక లేదా స్పర్శ విషమ సంఖ్యకల దానిపై పడినచో శుభము, సమసంఖ్యగలదానిపై అశుభము. 'యం హం హం' అను మూడు బీజాక్షరముల ఎనిమిది త్రీకములు ధ్వజాదు అమగు ఎనిమిది ఆయములకు ప్రతీకములు. వీటిలో సమ మైనవి ఆశుభములు; విషమములు శుభప్రదములు.  మొదలగు అక్షరములను పదునారు స్వరములతోడను, అట్లే పదునారు స్వరములను కొద్యక్షరముతో చేర్చి, వాటికి ‘ఆం ఈం’ అను పల్లవములను కూర్చవలెను. పల్లవయుక్తములైన ఈ సస్వరకాద్యక్షరములను ఆదియం దుంచి వాటితో త్రిపురామంత్రమను వేరువేరుగ చేర్పవలెను. వీటి మొదట ‘ హ్రీం’ చివర 'నమః' చేర్చవలెను, ఈ విధముగ పూజావీని యుక్షము లగు ఈ మంత్రముల ప్రస్తారముచే ఇరువదివేల నూట ఆరుశది మంత్రము లేర్పడును. సరస్వతీ-చండి–గౌరీ- దుర్గామంత్రములకు ‘ఆం హ్రీం’ అను బీజములును, శ్రీదేవీ మంత్రమునకు ‘ఆం శ్రీం’ అను బీజములును, సూర్యమంత్ర మునకు ‘ఆం క్షౌం’ లును, శివమంత్రమునకు ‘ఆం హూం’ లును, గణేశ మంత్రములకు ‘ఆం గం’ లును, విష్ణువునకు ‘ఆం ఆం’ లును ఉండును. కాదివ్యంజనములు అకారాది షోడశ స్వరములు కలిసి మొత్తము ఏబడియొక్క అక్షరము అగును. ఈ విధముగ సస్వరము లగు కాద్యక్షరములను ఆదియందును, సస్వర క్షాది కాంతాక్షరములను అంతమునందును ఉంచగా సంపూర్ణమంత్ర మగును. మొత్తము మండలముల సంఖ్య 1440 కాగా సూర్య-శివ-దేవీ-దుర్గా-విష్ణువుల మండలములు మూడువందల అరువది చొప్పున అగును.  అభిషిక్తుడైన గురువు ఈ అన్ని మంత్రముల జపము, దేవతల ధ్యానము చేసి, శిష్యునకును పుత్రునకును దీక్ష ఇవ్వవలెను.

అగ్ని మహాపురాణమునందు నానామంత్రికి కథన రూప మగు తొంబదియొకటవ ఆధ్యాయము సమాప్తము.