అగ్ని మహా పురాణము

Table of Contents

222 - అథ దుర్గసంపత్తిః.

పుష్కర ఉవాచః

పుష్కరుడు చెప్పెను : ఇపుడు దుర్గమును గూర్చి చెప్పెదను. రాజు దుర్గమునందు వివసించ వలెను. తనతో కూడ ఉండు వారిలో వైశ్య - శూద్రుల సంఖ్య ఆధీక మగా ఉండవలెను. శత్రువులకు వశము కాని స్థలమునందు దుర్గము ఏర్పరచు కొవవలెను. దుర్గ మునందు కొందరు బ్రాహ్మణులు కూడ ఉండవలెను. దోమంది కార్మికులు ఎచట లభింతురో, ఎచట నీటికొరకై వరాల మీద ఆధార పడవలసి ఉండదో, నదీ తటాకాదుల నుండి ఉపశము సమృద్ధముగా లభించునో, ఎచట శత్రుపీడ ఉండదో, పుష్పఫలములు, ధనధాన్యములు ఎచట సమృద్ధముగా ఉండదో, శత్రు సేనలు ఎచటికి జాలనో, సర్పభయమ, చోరతపము ఎచట ఉండదో అట్టి ప్రదేశములలో దుర్గమాను నిర్మించుకొనవలెను. బలవంతు డైన వాడు, ధన్వదుర్గము, మహదుర్గము, నరదుర్గము, వృక్షదుర్గము, జలదుర్గము, పర్వతదుర్గము అని ఆరు విధములగు దుర్గములలో ఏదైన ఒక దానిని ఆశ్రయించి ఉండవలెను. ఈ దుర్గములలో పర్వత దుర్గము శ్రేష్టమైనది. ఇది శత్రువులకు అభేద్యమై శత్రువులను నశింపచేయ వీలగునదిగా ఉండును. దుర్గమే రాజధాని. దాని యందు రాజవీధులు, ఆపణములు, దేవాలయములు ఉgడవలెను. నలుమూలల అస్త్రశస్త్ర భరితములగు యంత్రములు కలదై, జలప్రవాహయుక్తమై, చుట్టును జలముతో నిండిన కందకములు గలదై యుండు దుర్గము ఉత్తమము.

ఇపుడు రాజరక్షణను గూర్చి చెప్పెదను. రాజు రాజ్యమునంతను తను పాలించువాడు గాన విషాదులచే ఆతనికి హాని కలుగకుండునట్లు రక్షించవలెను. శిరీషవృక్షము వేళ్ళు, బెరడు, ఆకులు, పువ్వులు, పండ్లు ఈ ఐదింటిని గోమూత్రముతో నూరి సేవించినచో విషనివృత్తి కలుగును. శతావరి, గుడూచి, తండలీయకము కూడ విషనివారకములు. కోశాతకి, కప్లరి. బ్రాహ్మి, చిత్రపటోలిక, మండూకపర్ణి, వారాహీకందము, ఆమలకము, ఆనందకము, భంగు, సోమరాజ___ ఇవి కూడ విషనివారకములు. కొన్ని మాణిక్యములు, ముత్యములు మొదలగునవి కూడ విషవాశ కములు.

రాజు వాస్తులక్షణ లక్షితమైన దుర్గములో నివసించుచు దేవతాపూజనము, ప్రజాపాలసము, దుష్ట శిక్షణము దానము చేయుచుండవలెను. దేవాదిధనమును అపహరించిన రాజు ఒక కల్పము వరకను నరకములో పడి యుండును. రాజు దేవపూజాతత్పరుడై దేవాలయములను కట్టించవలెను. దేవతాస్థాపన చేసి, దేవాలయ రక్ష చేయవలెను. దేవతా విగ్రహము మట్టితో కూడ చేయవచ్చును. మట్టితో చేసిన విగ్రహము కంటే దారునిర్మితము, దాని కంటే ఇటుకలతో చేసినది, దాని కంది శిలానిర్మితము, దాని కంటే సువర్ణ నిర్మితము, దాని కంటె రత్న మయము పవిత్రమైనది. భక్తి పూర్వకముగ దేవాలయ నిర్మాణము చేయువాడు. భుక్తిముక్తులను పొందును. దేవాలయము లో చిత్రములు గీయించవలేను. గీతవాద్యాదులు ఏర్పరుపవలేను. అందమైన వస్తువులను దానము చేయవలెను. తైల - ఆజ్య - మధు - క్షీరాదులతో దేవతాభిషేకము చేయవలెను. ఇట్లు చేసినవాడు స్వర్గమును పొందును. బ్రాహ్మణులను పాలించి వారి సన్మానము చేయవలెను. వారి ధనమును లాగికొనరాదు. బ్రాహ్మణుని ఒక బంగారు నాణెమును గాని, గోవును గాని, ఒక అంగుళము భూమి గానీ ఆపహరించిన రాజు మహాప్రళయము వరకును నరకములో పడి ఉండును. అనేక పాపకృత్యములు చేయుచు దురాచార వంతుడుగా ఉన్న బ్రాహ్మణుని కూడ ద్వేషింపరాదు. బ్రహ్మహత్యను మించిన పాపములేదు. ప్రభావతియగు బ్రాహ్మణుడు తలచుకొన్నచో దేవతకానీ పొవిని దేవతగా చేయగలడు, దేవతను కూడ పదచ్యుతుని చేయగలడు. అందుచే సర్వదా ఆతనికి నమస్కారము చేయవలెను.

రాజు చేసిన అధర్మానికి బ్రాహ్మణ స్త్రీ ఏడ్వవలసి వచ్చినట్లయితే అతని రాజ్యము, వంశము, సర్వమును నశించును. అందుచే ధర్మ పరాయణుడగు రాజు పతివ్రతలకు మంచి రక్షణము కల్పించవలెను. శ్రీ గృహకర్మలయందు నిపుణురాలై, సంతుష్టురాలై ఉండవలెను. ఆమె ఇంటిలోని అన్ని వస్తువులను పరిశుభ్రముగా నుంచవలెను. ఖర్చు చేయుటలో సంయమవంతురాలై ఉండవలెను. తండ్రి కన్యకను ఎవనికిచ్చునో అతడే ఆమెకు పతి. ఆమె సర్వదాతనపకే సేవచేయవలెను. భర్తృమరణానంతరము బ్రహ్మచర్యమును పాలించుకొనుశ్రీ స్వర్గమునకువెళ్ళును. ఆమెఇతరులగృహములలో నివసించగూడదు. కలహములనుండి దూరముగా ఉండవలెను. భర్త పర దేశమునందున్న శ్రీ అలంకరించుకొనగూడదు. సర్వదా ఆతని పాతమునే కోరుచు దేవతారాధానము చేయుచుండవలెను. కేవలము మంగళార్ధమై సౌభాగ్యచిహ్నముగా రెండు మూడు ఆలంకారమలనుమాత్రమే ధరించవలెను. మరణించిన భర్త చితిపై అగ్ని ప్రవేశ ముచేసిన శ్రీకూడ స్వర్గము చేరును. లక్ష్మి నిపూజించుట, ఇంటిని పరిశుభ్రముగానుంచుట శ్రీకకర్తవ్యము. కార్తి క ద్వాదశినాడు విష్ణువును పూజించి వత్ససహిత గోదానము చేయవలెను. సావిత్రి తన సదాచార వ్రతముల ప్రభావముచే తన భర్త ను మృత్యువునుండి రక్షించుకొనగలినది. మార్గశిర శుక్ల సప్తమినాడు సూర్యునారాధించుచే స్త్రీ పుత్రులను పొందును. ఇందులో ఏమాత్రము సందేహములేదు.

అగ్ని మహాపురాణమునందు దుర్గసంపత్తివర్ణనము నారీధర్మకథనము అను రెండు వందల ఇరువదిరెండవ అధ్యాయము సమాప్తము.